పాపన్నపేట,ఫిబ్రవరి,26,మెదక్ టుడే న్యూస్:పాపన్నపేట మండలంలోని రామతీర్థం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు శ్రీశైలం వివాహం మమతతో గురువారం రామతీర్థం లో గ్రామంలో ఘనంగా జరిగిది.ఈ వివాహానికి మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మదేవేందర్ రెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకులు కంఠరెడ్డి.తిరుపతిరెడ్డి, మండల నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అదే గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు ఎరుకల.భూమయ్య కుమార్తె నిశ్చితార్థంకు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ బాల గౌడ్,పాపన్నపేట్ సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు కుమ్మరి. జగన్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్ గురుమార్తి గౌడ్, నాయకులు సోములు, దుర్గయ్య, బాబా గౌడ్,అంటోని,మాణిక్య రెడ్డి,చంద్రశేఖర్,నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేట,ఫిబ్రవరి,26,మెదక్ టుడే న్యూస్:విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధి నామాపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.ఏఎస్సై దేవిదాస్ పవర్ కథనం మేరకు.గ్రామానికి చెందిన గనాజిగారి నర్సింలు(49) వ్యవసాయం చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు.పొలం వద్ద పనుల కోసం బుధవారం ఉదయం ఇంటి నుంచి పొలం వద్దకు వెళ్లాడు.పొలంలో అడవి పందుల కోసం రక్షణగా ఏర్పాటు చేసిన కరెంటు తీగకు తగిలి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో సమీపంలో ఉన్న పొలాల వద్ద ఉన్న స్థానికులకు ఫోన్ చేయగా అక్కడికి వెళ్లి చూడగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెంది ఉన్నాడు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి భార్య బాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.
రామచంద్రాపురం,ఫిబ్రవరి,26,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.బిహెచ్ఎల్ హెచ్ఆర్డీసీ విభాగంలో అదనపు ఇంజనీర్గా సుదీర్ఘ కాలం సేవలందించిన తోట వెంకటస్వామి పదవీవిరమణ సందర్భంగా హెచ్ఆర్డీసీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తన విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వెంకటస్వామిని సహచర ఉద్యోగులు, అధికారులు ఘనంగా కొనియాడారు.
సేవలు చిరస్మరణీయం:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ.. బిహెచ్ఎల్ సంస్థలో వెంకటస్వామి గారు అందించిన సేవలను స్మరించుకున్నారు. క్రమశిక్షణ, నిబద్ధత గల అధికారిగా ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. అనంతరం వెంకటస్వామి–పద్మావతి దంపతులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విశ్రాంతి జీవితం సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు.
ఆత్మీయ వేడుక:
ఈ వేడుకలో కుటుంబ సభ్యులు చెన్నం మధు–శ్రీవాణి, తోట కార్తీక్–అలేఖ్యలు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు. మనవళ్లు, మనవరాళ్ల సందడితో కార్యక్రమం ఎంతో కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి బంధుమిత్రులు, పెద్ద సంఖ్యలో సహచర ఉద్యోగులు పాల్గొని ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
అమీన్పూర్,ఫిబ్రవరి,24,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.బీరంగూడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల విజయవంతానికి అహర్నిశలు శ్రమించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను మంగళవారం దేవాలయ కమిటీ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపింది.
అధికారులకు స్వామివారి ప్రసాదం అందజేత:
దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు అధికారులను కలిసి స్వామివారి శేషవస్త్రం మరియు ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో మెరుగైన సేవలందించిన: మెడికల్ డిపార్ట్మెంట్ అధికారిణి మోహిని, ట్రాఫిక్ ఏసీపీ ఆదిమురళి, ట్రాఫిక్ సీఐ లాలు నాయక్ అమీన్పూర్ ఎమ్మార్వో వెంకటేశం, హెచ్ఎండబ్ల్యూఎస్ డీజీఎం చంద్రశేఖర్, తదితర అధికారులకు దేవస్థానం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సమిష్టి కృషితోనే ఉత్సవాలు విజయవంతం:
ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, వైద్య మరియు జలమండలి శాఖలు అద్భుతంగా పనిచేశాయని కొనియాడారు. అధికారుల సమన్వయం వల్లే శివరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, వైభవంగా జరిగాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ రెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు మహేష్, రమేష్ యాదవ్, శ్రీనివాస్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
పాపన్నపేట,ఫిబ్రవరి,24,మెదక్ టుడే న్యూస్:మండల కేంద్రం పాపన్నపేటలో బోనాల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. మంగళవారం రేణుక ఎల్లమ్మ ఆలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికీ విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారికీ పిండి వంటలు నైవేద్యంగా సమర్పించారు. సాయంత్రం మహిళాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి గ్రామస్తులు,బంధువుల రాకతో ఆలయం ప్రాంగణం సందడి నెలకొంది.
అమీన్పూర్,ఫిబ్రవరి,23,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలో బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి మహాశివరాత్రి జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించిన ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఉత్సవాల విజయవంతానికి సహకరించిన పోలీస్ మరియు జిహెచ్ఎంసి అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. జాతర ముగింపు సందర్భంగా వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.జాతరలో లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ , శేరిలింగంపల్లి జోన్ డీసీపీ శ్రీనివాస్ , జోన్ అడిషనల్ డిసిపి ఉదయ్ రెడ్డి ,రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్, మరియు క్షేత్రస్థాయిలో బందోబస్తును సమన్వయం చేసిన అమీన్పూర్ సిఐ నరేష్ ని చైర్మన్ సుధాకర్ యాదవ్ ప్రత్యేకంగా కలిశారు. అలాగే పారిశుధ్యం, ఇతర మౌలిక వసతులను పర్యవేక్షించిన అమీన్పూర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ కి కూడా స్వామివారి శేషవస్త్రం కప్పి, ప్రసాదాలను అందజేశారు.
చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ:
మహాశివరాత్రి జాతరను ఒక పండుగలా, క్రమశిక్షణతో నిర్వహించడంలో పోలీస్ యంత్రాంగం మరియు జిహెచ్ఎంసి అధికారుల కృషి మరువలేనిది. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్, డీసీపీ, ,అడిషనల్ డిసిపి, ఏసీపీ, మరియు సిఐ నరేష్ పర్యవేక్షణ అద్భుతంగా ఉంది. అందుకే ఆలయ కమిటీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతూ స్వామివారి ఆశీస్సులు అందజేశాము.ఈ కార్యక్రమంలో ఆయన చైర్మన్ సుధాకర్ యాదవ్తో పాటు దేవాదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహేష్, శ్రీనివాస్, రమేష్ యాదవ్, మరియు ఇతర ముఖ్య అనుచరులు పాల్గొన్నారు. అధికారుల సమన్వయం మరియు చైర్మన్ గారి సమర్థవంతమైన పర్యవేక్షణలో ఈ ఏడాది జాతర ప్రశాంతంగా ముగిసిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అమీన్పూర్,ఫిబ్రవరి,20,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని సాయి అంబికా కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రాజన్న టీ కొట్టు’ ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి తో కలిసి ఆయన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడం అభినందనీయమని, స్థానిక వ్యాపారాలకు ప్రజలందరూ ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు. మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి మాట్లాడుతూ, కాలనీ వాసులకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులను కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు సీనియర్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు: మాజీ ఎంపీపీ దేవానందం మాజీ కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి, కొల్లూరు చంద్రకళ గోపాల్ మాజీ కో-ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు,సీనియర్ నాయకులు నర్సింగ్ రావు, తుమ్మల ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ యువ నాయకులు తుమ్మల రుష్వంత్ రెడ్డి, ఈర్ల శ్రీకాంత్, అమీన్పూర్ యువకులు, ఈ కార్యక్రమంలో టీ కొట్టు నిర్వాహకులు, కాలనీ వాసులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే మరియు ఇతర నేతలు స్వయంగా టీ రుచి చూసి నిర్వాహకులను అభినందించారు.
అమీన్పూర్,ఫిబ్రవరి,20,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర స్థాయి ‘సీఎం కప్’ కబడ్డీ పోటీలకు సంగారెడ్డి జిల్లా బాయ్స్ జట్టు హెడ్ కోచ్గా అమీన్పూర్ జిహెచ్ఎంసి కి చెందిన కె. పాండు ఎంపికయ్యారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో నిర్వహించనున్న ఈ మెగా టోర్నమెంట్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల జట్లు తలపడనున్నాయి.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్జీఎఫ్ ప్రెసిడెంట్ సుభాష్ గౌడ్ కె. పాండును ప్రత్యేకంగా అభినందించారు. అమీన్పూర్ ప్రాంతానికి చెందిన క్రీడాకారుడు జిల్లా జట్టుకు కోచ్గా ఎంపిక కావడం పట్ల స్థానిక నాయకులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన కె. పాండు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా ఎస్జీఎఫ్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జట్టును పటిష్టంగా తీర్చిదిద్దామని, ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు స్థానిక నేతలు పాల్గొని పాండుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమీన్పూర్,ఫిబ్రవరి,20,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్లో మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క–సారలమ్మ దేవాలయంలో, ఆలయ చైర్మన్ నీలం బిక్షపతి ఆధ్వర్యంలో అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పణ మరియు అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మేడారం మహా జాతర ముగిసిన అనంతరం ప్రతి ఏటా నిర్వహించే సంప్రదాయం ప్రకారం, ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ నీలం బిక్షపతి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులందరికీ ఆశీస్సులు అందేలా ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.అమ్మవార్ల కృప అందరికీ ఉండాలి – నీలం బిక్షపతి:కార్యక్రమం అనంతరం చైర్మన్ నీలం బిక్షపతి మాట్లాడుతూ.. “మేడారం జాతర తర్వాత అమ్మవార్లకు నైవేద్యం పెట్టి, ఒడిబియ్యం సమర్పించడం మా ఆలయ ఆనవాయితీ. లోకకళ్యాణం కోసం, భక్తులందరి చల్లని చూపు కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషకరం” అని తెలిపారు.పూజల అనంతరం భక్తులందరికీ ఆలయ కమిటీ తరఫున భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళా భక్తులు మరియు అధిక సంఖ్యలో అమీన్పూర్ వాసులు పాల్గొని అమ్మవార్ల తీర్థప్రసాదాలను స్వీకరించారు.
అమీన్పూర్,ఫిబ్రవరి,20,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఆలయ ఈవో శ్రీ శశిధర్ గుప్తా, చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్ సమర్థవంతమైన నిర్వహణలో అంగరంగ వైభవంగా ముగిశాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారు చేసిన ముందస్తు ఏర్పాట్లు, పటిష్టమైన ప్రణాళికతో ఉత్సవాలు అత్యంత క్రమశిక్షణతో జరిగాయి.దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు సమక్షంలో ఈవో, చైర్మన్ గారలు స్వయంగా హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఆదాయం వివరాలు – భక్తుల అచంచల విశ్వాసం:
మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి సమకూరిన ఆదాయ వివరాలను ఈవో శశిధర్ గుప్తా, చైర్మన్ సుధాకర్ యాదవ్ వెల్లడించారు: మొత్తం ఆదాయం: రూ. 80,92,132/- (దర్శనం టికెట్లు, టెండర్లు, అన్నదాన విరాళాల ద్వారా) హుండీ ఆదాయం: రూ. 8,62,677/- ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం చేశామని తెలిపారు. ఈవో శశిధర్ గుప్తా మాట్లాడుతూ.. రికార్డు స్థాయిలో ఆదాయం రావడం స్వామి అమ్మవార్లపై భక్తులకున్న భక్తికి నిదర్శనమని, వచ్చిన ప్రతి రూపాయిని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తామని స్పష్టం చేశారు.
అన్ని శాఖల సమన్వయమే విజయరహస్యం:
ఉత్సవాల విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈవో మరియు చైర్మన్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు: పోలీస్ శాఖ: పటిష్ట బందోబస్తు నిర్వహించిన సీపీ, డీసీపీలు, ఏసీపీలు, సీఐలకు ప్రత్యేక ధన్యవాదాలు. విద్యుత్ & జిహెచ్ఎంసి: నిరంతర విద్యుత్ సరఫరా చేసిన ఏడీలు, ఏఈలకు మరియు పరిశుభ్రతను పాటించిన జిహెచ్ఎంసి సిబ్బందికి ధన్యవాదాలు. రెవెన్యూ: సమన్వయం చేసిన అమీన్పూర్ ఎమ్మార్వో కి కృతజ్ఞతలు.దాతలు, వాలంటీర్లు, మీడియా మిత్రులు మరియు భక్తులందరి సహకారం మరువలేనిదని, భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ ధర్మకర్తల కమిటీ సభ్యులు, అర్చకులు, మహిళా భక్తులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు..