పాపన్నపేట,మార్చ్,3,మెదక్ టుడే న్యూస్:పురుగు మందు తాగి చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.గ్రామానికి చెందిన జిన్న దుర్గాభవాని(24) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది.తరచూ అనారోగ్య విషయమై ఇంట్లో బాధపడుతూ ఉండేది.గత నెల 27న రాతి వేళ ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగు మందు తాగింది.ఈ క్రమంలో కుటుంబీకులు గమనించి చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా హాస్పిటల్ కు తరలించారు.అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది.మృతురాలి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
హోలీ పండగ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్ పి శుభాకాంక్షలు.
•హోలీ పండగ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్ పి శుభాకాంక్షలు.
•ప్రశాంత వాతావరణంలో కుటుంబ సమేతంగా హోలీ జరుపుకోవాలి
•హోలీ పండగ సందర్భంగా ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు
మెదక్,మార్చ్,2,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ మాట్లాడుతూ, మెదక్ జిల్లా ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా సంతోషంగా హోలీ పండగను జరుపుకోవాలని కోరారు.అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపి జరిమానాలకు, రోడ్డు ప్రమాదాలకు కారకులై జైలు పాలుకావద్దని హెచ్చరించారు. హోలీ పండగ వేళ మన తోటి అడపడుచుల పట్ల గౌరవప్రదంగా నడుచుకోవాలని, పండగ పేరుతో అనవసరంగా కొత్త చిక్కులు కొని తెచ్చుకోవద్దని సూచించారు.
గొడవలకు, అల్లర్లకు పాల్పడితే అస్సలు ఉపేక్షించబోమని, చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. గతంలో పండగ వేళ మద్యం మత్తులో చెరువులు, కుంటాల వద్ద స్నానాలకు వెళ్లి ప్రమాదాలకు గురై అనేక కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చిన ఘటనలను గుర్తు చేశారు. మద్యం మత్తులో ఎవరూ కూడా చెరువులు, కుంటాల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు.
చిన్న పిల్లలు తప్పనిసరిగా తల్లిదండ్రుల సమక్షంలోనే స్నానాలకు వెళ్లాలని, అతి ఉత్సాహంతో ప్రమాదాలకు గురి కాకూడదని అన్నారు. పిల్లల కదలికల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా దృష్టి పెట్టాలని, పిల్లల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని తెలిపారు.
మన ఆనందం శాశ్వతంగా ఉండాలి. కానీ క్షణిక ఆనందం కోసం హోలీ పండగ వేళ చేసిన తప్పులు, జరిగిన ప్రమాదాలు లేదా మన అజాగ్రత్త వల్ల ఇతరులు ప్రమాదాలకు గురైతే, ఆ పండగ మొత్తం కుటుంబానికి చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందని హెచ్చరించారు.
ఈ హోలీ పండగ ప్రతి ఒక్కరి జీవితాన్ని రంగులమయం చేయాలని ఆకాంక్షిస్తూ, జిల్లా ప్రజలందరికీ మరోసారి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం.
మెదక్,మార్చ్,26,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మెదక్ జిల్లా ఎస్పీ డి. వి.శ్రీనివాస రావు ఐపీఎస్.మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జయంతి కార్యక్రమాల్లో భాగంగా మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలను స్మరించుకున్నారు.ఈసందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ మాట్లాడుతూ, దుద్దిళ్ల శ్రీపాదరావు సౌమ్య స్వభావం, సరళ జీవనశైలి కలిగిన నాయకుడిగా ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యులై ప్రజానాయకునిగా గుర్తింపు పొందారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన రాజకీయ జీవితాన్ని కొనసాగించారని పేర్కొన్నారు.అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన కాలంలో ఆయన చూపిన నిజాయితీ, నిరాడంబరత, నిష్పక్షపాత నిర్ణయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు బలాన్ని చేకూర్చాయని అన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.ప్రజాసేవే ధ్యేయంగా సాగిన దుద్దిళ్ల శ్రీపాదరావు జీవితం నేటి యువతకు, రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ తెలిపారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, ఆర్ఐ లు శైలందర్, రామ కృష్ణ, సీఐ లు సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి, ఎసై లు సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్.ఎస్. హోమ్స్ కాలనీలో వెలిగిన వీధి దీపాలు.
•సొంత నిధులతో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి

అమీన్పూర్,ఫిబ్రవరి,28,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని ఎస్.ఎస్. హోమ్స్ కాలనీ వాసుల దశాబ్దాల చీకట్లు తొలగిపోయాయి. అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి ఉదారతతో, ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను శనివారం ఆయన స్వయంగా ప్రారంభించారు. కాలనీలో వెలుతురు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించిన ఆయన, తక్షణమే స్పందించి ఈ ఏర్పాటు చేయడంపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి బాటలో అమీన్పూర్:

ఈ సందర్భంగా పాండురంగా రెడ్డి మాట్లాడుతూ.. ఆయన గత ఐదేళ్ల తన పాలనలోని విజయాలను గుర్తు చేసుకున్నారు.వందల కాలనీల అభివృద్ధి: అమీన్పూర్ పరిధిలోని సుమారు 200 నుండి 250 కాలనీలను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చామని ఆయన తెలిపారు.
మౌలిక సదుపాయాల కల్పన: గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపాలిటీ వ్యాప్తంగా కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను నిర్మించి ప్రజల ఇబ్బందులు తొలగించామని చెప్పారు.
పచ్చదనం – ఆహ్లాదం: కాలనీల్లో కేవలం కాంక్రీట్ కట్టడాలే కాకుండా, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా పార్కులను అభివృద్ధి చేసి అమీన్పూర్ను పచ్చదనానికి చిరునామాగా మార్చామన్నారు.
అందుబాటులో ఉండే నాయకత్వం: పదవిలో ఉన్నప్పుడు ప్రతి నిమిషం ప్రజలకు అందుబాటులో ఉండి, క్షేత్రస్థాయి సమస్యలను నేరుగా పర్యవేక్షించి పరిష్కరించానని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స బాశేటి కృష్ణ, బిజిలి రాజు,మాజీ కో-ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు పాల్గొన్నారు. బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఐలాపురం నర్సింగ్ రావు, కొల్లూరి యాదగిరి, మహేందర్ రెడ్డి మరియు కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొని పాండురంగా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

చేగుంటలో భార్య హత్య, నిందితుడి అరెస్ట్.
డబ్బుల కోసం భార్యను పరతో కొట్టి హత్య
రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్
చేగుంట, మార్చ్,1 , మెదక్ టుడే న్యూస్:డబ్బుల కోసం భార్యను పరతో కొట్టి హత్య చేసిన కేసును రామాయంపేట్ పోలీసులు దాకచక్యంగా ఛేదించారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్ కేసు వివరాలను వెల్లడించారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.2015 సంవత్సరంలో మృతురాలు వరలక్ష్మి, నిందితుడు ముఠా త్రిమూర్తులకు రెండో వివాహం జరిగింది. వివాహానంతరం నిందితుడు ఇల్లరికం వచ్చి చేగుంటలో నివాసం ఉంటూ వచ్చాడు. వీరికి దుర్గాప్రసాద్ (10) అనే కుమారుడు ఉన్నాడు.రెండు సంవత్సరాల క్రితం కుటుంబ పోషణ కోసం వరలక్ష్మి కాళ్ళకల్ ఐటిసి కంపెనీలో ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నిందితుడు ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ భార్యను డబ్బుల కోసం వేధించేవాడు. తరచూ జరిగే గొడవలతో భార్యపై ద్వేషం పెంచుకున్న నిందితుడు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
తేదీ 21.02.2026 అర్ధరాత్రి భార్య, కుమారుడు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న పరతో వరలక్ష్మి తలపై దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మృతురాలి వద్ద ఉన్న 39.55 గ్రాముల బంగారు పుస్తెలతాడు, రూ.5,000 నగదు, సెల్ ఫోన్ తీసుకుని అన్నవరం పారిపోయాడు.
నమ్మదగిన సమాచారం మేరకు రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం నిఘా ఏర్పాటు చేసి, 01.03.2026 ఉదయం చేగుంట బస్టాండ్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసింది. అతని వద్ద నుంచి బంగారు పుస్తెలతాడు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు.
ఈ కేసును ఛేదించిన రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్, తూప్రాన్ సీఐ రంగకృష్ణ, చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి, ఎస్ఐ భిక్యా నాయక్, కానిస్టేబుళ్లు భాస్కర్, రాజశేఖర్, సాజిద్ అలీ, హోంగార్డ్ రవీందర్లను మెదక్ జిల్లా ఎస్పీ గారు అభినందించారు.
సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోయధావిధిగా ప్రజావాణి-మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్.
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్,మార్చి,1 ,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి. సోమవారంనాడుసమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజావాణిపై కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులందరూ సమయపాలనతో తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలనిఈసందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు.

మెదక్,ఫిబ్రవరి,28,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు జిల్లాలోని ఉద్యోగులు,ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు.
పూలమాలలు శాలువాలు వివిధ జ్ఞాపకాలతో కలెక్టర్ గారితో పనిచేసిన కాలాన్ని గుర్తుకు చేసుకున్నారు.
జిల్లా కలెక్టర్ విద్య వైద్యంలో జిల్లాలో సమూల మార్పులు తీసుకొచ్చారని పలువురు జిల్లా అధికారులు పునరుద్గాటించారు.
విద్య వైద్యం ప్రధానోజెండాగా కలెక్టర్ రాహుల్ రాజ్ రెండు సంవత్సరాల కాలం బిజీ బిజీగా గడిచిపోయిందని పలువురు తెలిపారు.
ప్రజలకు ఉద్యోగులకు పలు సలహాలు సూచనలు ఇస్తూ మార్గదర్శకులుగా ఏ చిన్న సమస్యనైనా అలవోకగా పరిష్కరించి పలువురి మన్ననలు పొందాడని జిల్లా అధికారులు అన్నారు.
పూర్వపు కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఇక్కడి ప్రజలతో తనకు విడదీయరాని బంధం ఏర్పడిందని, ఇక్కడి నుండి వెళ్లడం బాధాకరమైన హృదయంతో వెళ్తున్నట్లు తెలిపారు. తనకు సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
కలెక్టర్ ను, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంలో పూలు చల్లుతూ కలెక్టర్ కార్యాలయం నుంచి మెయిన్ గేటు వరకు తీసుకెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు, జిల్లా అధికార యంత్రాంగం అంతా పాల్గొన్నారు.
అమీన్పూర్ గ్రామంలో ఘనంగా ఇఫ్తార్ విందు: ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

అమీన్పూర్,ఫిబ్రవరి,27,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని అమీన్పూర్ గ్రామంలోని మస్జిద్-ఈ-ఆలంగీర్ వద్ద ఇఫ్తార్ విందు అత్యంత వైభవంగా జరిగింది. మహమ్మద్ మోయిన్ ఖాన్ (అలియాస్ బాబా బాయ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది ముస్లిం సోదరులు పాల్గొని సామూహిక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందును స్వీకరించారు.ఈ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటు అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ కృష్ణ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ:

“రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక. ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ రోజున అందరూ కలిసి మెలిసి విందులో పాల్గొనడం సంతోషంగా ఉంది. గంగా-జమునా తెహజీబ్కు అమీన్పూర్ నిదర్శనంగా నిలుస్తోంది. ముస్లిం సోదరులకు అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను,” అని పేర్కొన్నారు.కార్యక్రమ నిర్వాహకులు బాబా బాయ్ మాట్లాడుతూ, రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టే సోదరుల కోసం ప్రతి ఏటా ఈ సేవను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కౌన్సిలర్ కృష్ణ, మాజీ కోఆప్షన్ నెంబర్ తలారి రాములు, మాజీ కో ఆప్షన్ నెంబర్ మమ్మద్ యూనివర్స్, ఆప్షన్ నెంబర్ ఎండి ఆసిఫ్, అమీన్పూర్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రమోద రెడ్డి, కొల్లూరు గోపాల్, కొల్లూరి యాదగిరి, గాలి గిరి, మైపాల్ రెడ్డి, దాసు యాదవ్, ఐలాపురం నర్సింగ్ రావు, అమీన్పూర్ గ్రామ పెద్ద బి ఆర్ ఎస్ పార్టీ మైనారిటీ మండల ప్రెసిడెంట్ మహమ్మద్ శోకత్ అలీ, మైనార్టీ పెద్దలు, మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు…
పాపన్నపేట,ఫిబ్రవరి,26,మెదక్ టుడే న్యూస్:మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవనీ ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు.జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు…గురువారం సాయంత్రం నార్సింగి ప్రధాన చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ…వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలన్నారు.ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు.మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలకు, వాహనదారులకు రోడ్డు భద్రత నియమాల గురించి అవగాహన కల్పించారు.కానిస్టేబుళ్లు ప్రవీణ్, వెంకటేష్, తదితరులున్నారు.
విద్యుత్ షాకుతో మరణించిన బాధ్యత కుటుంబాన్ని పరామర్శించినమాజీ డిప్యూటీ స్పీకర్ ఏం పద్మ దేవేందర్ రెడ్డి.
పాపన్నపేట,ఫిబ్రవరి,26,మెదక్ టుడే న్యూస్:పాపన్నపేట మండలంలోని నామపూర్ గ్రామానికి చెందిన రైతు నర్సింహులు ప్రమాదవశాస్తూ విద్యుత్ షాక్ తో పొలం వద్ద బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి గురువారం నామాపూర్ గ్రామానికి చేరుకొని నర్సింలు కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ షాక్ తో నరసింహులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.అనంతరం 5 వేలు రూపాయలు ఆర్థిక సాయంఅందజేశారు. టిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ సొంగు దుర్గయ్య, బాబా గౌడ్, వెంకటరెడ్డి, గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి,తదితర నాయకులు పాల్గొన్నారు.










