📄 ePaper
Saturday, June 6, 2026
ADS
Home Blog Page 36

టైలర్స్ కాలనీలో రెచ్చిపోయిన భూబకాసురులు: శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రభుత్వ భూమి కబ్జా!

0

సర్వే నంబర్ 993లో రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు

  • ప్రభుత్వ కాంపౌండ్ వాల్ కూల్చివేత.. స్థానికుల ఆందోళన

•కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎమ్మార్వోకు విన్నపం

అమీన్పూర్,మార్చి,10,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని టైలర్స్ కాలనీలో భూ కబ్జాదారులు బరితెగించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ స్వామి ఆలయ సమీపంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు రాత్రికి రాత్రే పావులు కదిపారు. సర్వే నంబర్ 993లో ఉన్న ప్రభుత్వ స్థలానికి రక్షణగా ఉన్న కాంపౌండ్ వాల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేసి, అక్రమంగా గదుల నిర్మాణం చేపడుతుండటం స్థానికంగా కలకలం రేపుతోంది.

రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు:

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టైలర్స్ కాలనీలోని ఎల్లమ్మ ఆలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతకాలంగా కబ్జాదారులు కన్నేశారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి అదను చూసి, ప్రభుత్వానికి చెందిన కాంపౌండ్ వాల్‌ను జేసీబీలతో ధ్వంసం చేశారు. అధికారుల కళ్లు గప్పి తెల్లవారేసరికి అక్కడ తాత్కాలికంగా ఇళ్లు, గదుల నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆస్తిని బహిరంగంగా ఆక్రమిస్తుంటే రెవెన్యూ విభాగం ఏం చేస్తోందని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.

స్థానికుల ఆగ్రహం – అధికారుల స్పందన కోసం నిరీక్షణ:

ఈ అక్రమ కట్టడాల వెనుక కొందరు స్థానిక బడా వ్యక్తుల హస్తం ఉందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడటంతో పాటు, రక్షణ గోడను కూల్చివేసి అక్రమంగా చొరబడిన కబ్జాదారులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మార్వోకు విన్నపం:

సర్వే నంబర్ 993లో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలి. ఎమ్మార్వో గారు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి. నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి” అని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేసిన జి ఎం ర్ వరలక్ష్మి ఫౌండేషన్.

0

చేగుంట,మార్చ్,10,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం మకరాపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్లు పంపిణీ చేసిన జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక కానిస్టేబుల్ రాజా గౌడ్ అందించారు. అంతరం రోడ్డు భద్రత పైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్,మక్కరాజుపేట గ్రామానికి చెందిన కానిస్టేబుల్ బాల్ శెట్టి రాజా గౌడ్,నల్ల ప్రవీణ్ కుమార్,బెస్త స్వామి, రాంరెడ్డి,స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్: నియోజకవర్గ సమస్యలపై చర్చ.

0

•పటాన్‌చెరు అభివృద్ధి పనులపై సచివాలయంలో మర్యాదపూర్వక భేటీ

  • నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూల స్పందన

పటాన్‌చెరు,మార్చి,10,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజా సమస్యలే అజెండాగా ఈ భేటీ కొనసాగింది.

ముఖ్య అంశాలు:

ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనుల గురించి మంత్రి కి కాట శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ప్రధానంగా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు, వైద్య సౌకర్యాల మెరుగుదల మరియు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా చర్చించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి డివిజన్ అభివృద్ధి పథంలో సాగాలని, అందుకు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందించాలని కోరారు.

మంత్రి హామీ:

కాట శ్రీనివాస్ గౌడ్ వివరించిన సమస్యలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. పటాన్‌చెరు నియోజకవర్గ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.ప్రజల పక్షాన నిలబడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న కాట శ్రీనివాస్ గౌడ్ ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు. ఈ భేటీలో పటాన్‌చెరు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల్, సుధాకర్ గౌడ్,
సివానందం పాల్గొన్నారు.

మంగళపర్తి మహేష్ గౌడ్ కు గ్రామ గులాబీపార్టీ అధ్యక్ష పీఠం దక్కాలి.

0

గ్రామ యువకుల డిమాండ్

పార్టీ పెద్దలు యువతను ప్రోత్సహించాలి

గ్రామంలో మరోసారి గులాబీ జెండా ఎగరాలి

మెదక్, మార్చి,10,మెదక్ టుడే న్యూస్: వెల్దుర్తి మండలం పరిధిలోని మంగళపర్తి గ్రామంలో మహేష్ గౌడ్ కు గులాబీ పార్టీ నుండి అధ్యక్ష పీఠం దక్కలి గత కొన్ని సంవత్సరాల్లో కొంతమంది నాయకులకు హస్త గతమైంది గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న యువతకు రాజకీయ ప్రోత్సహం పార్టీలో సమన్వయం లేకుండా చేస్తున్న పార్టీ పెద్దమనుషులు ప్రస్తుత నెలకొన్న రాజకీయాల్లో మహేష్ గౌడ్ గ్రామ అధ్యక్ష పదవి ఇవ్వాలని గ్రామ యువకుల డిమాండ్ పార్టీ పెద్దలు యువతను ప్రోత్సహించాలి అదేవిధంగా గ్రామంలో మరోసారి గులాబీ జెండా ఎగరవేస్తామని భీమా వ్యక్తం చేస్తున్న నవ యువ గులాబీ కార్యకర్తలు పార్టీ కోసం కృషి చేసే వారికి తప్పక గుర్తింపు దక్కుతుంది గ్రామంలో బిఆర్ఎస్ నాయకుల్లో రాజుకుంటున్న అధ్యక్ష వైరం గ్రామ సీనియర్ నాయకుల పై యువకులు తీవ్ర విమర్శలు. గుప్పిస్తున్నారు గ్రామాలపై కన్నెత్తి చూడని పార్టీ మండల కమిటీ పార్టీ బలోపితానికి కృషి చేయలేకపోతున్న పార్టీ శ్రేణులు గ్రామంలో ప్రజా లోకం నూతన యువ నాయకత్వాన్ని కోరుకుంటుంది

జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

0

•మహిళా సాధికారతే సమాజ ప్రగతికి పునాది

•అదనపు ఎస్పీ ఎస్ మహేందర్

మెదక్,మార్చ్,9,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందితో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, మహిళా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలోనే కాకుండా దేశ అభివృద్ధిలో కూడా మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. నేటి కాలంలో మహిళలు విద్య, వైద్యం, పరిపాలన, రక్షణ, క్రీడలు, సాంకేతిక రంగాలు సహా అన్ని విభాగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది ధైర్యం, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రతకు విశేషంగా సేవలు అందిస్తున్నారని అదనపు ఎస్పీ అభినందించారు. శాంతి భద్రతలను కాపాడడంలో మహిళా పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని పరిష్కరించడంలో మహిళా పోలీస్ సిబ్బంది ముందుంటున్నారని అన్నారు.
విధుల్లో ఉన్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ మహిళా పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఆయన తెలిపారు. కుటుంబ బాధ్యతలను నిర్వహించుకుంటూనే విధుల్లో రాణించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా విజయాలను సాధించగలరని చెప్పారు.
అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి మహిళా పోలీస్ సిబ్బందిని షాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డియస్పి ప్రసన్న కుమార్, ఆర్ఐ శైలందర్, సీఐ లు సందీప్ రెడ్డి, కృష్ణముర్తి, డీపీవో సిబ్బంది, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

వైభవంగా ప్రారంభమైన బొంతపల్లి వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు.

0

గుమ్మడిదల,మార్చి,8,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బొంతపల్లిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో, శివనామ స్మరణతో మారుమోగింది.

ఘనంగా ధ్వజారోహణం – విశేష పూజలు

బ్రహ్మోత్సవాల తొలిరోజైన ఆదివారం ఉదయం ఆలయ ఈవో శశిధర్ గుప్తా, ధర్మకర్తల మండలి చైర్మన్ ప్రతాప్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

గణపతి హోమం: ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుతూ గణపతి పూజ, పుణ్యాహవాచనం చేపట్టారు.
ధ్వజారోహణం: ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఆవిష్కరించి, బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.
పట్టువస్త్రాల సమర్పణ: స్వామివారికి, అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి దంపతులు భక్తిశ్రద్ధలతో పట్టువస్త్రాలను సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు.

భక్తి పారవశ్యంలో భక్తులు

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారు, అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల ప్రారంభం కావడంతో పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఏర్పాట్లపై పర్యవేక్షణ

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శశిధర్ గుప్తా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో నిర్వహించే వాహన సేవలు, కళ్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్లు, తాగునీరు వంటి వసతులను సిద్ధం చేసినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.

అమీన్‌పూర్‌లో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

0

మహిళల ఆనందోత్సాహాల మధ్య గిఫ్టులు, బహుమతుల ప్రదానం

బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కాటా సునీత రాజు గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు.

అమీన్‌పూర్,మార్చి,8,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు శ్రీమతి కాటా సునీత రాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది మహిళలు పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.

ఆటపాటలతో సందడి చేసిన మహిళలు

మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన వివిధ రకాల ఆటపాటలు, పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. రోజువారీ పనుల ఒత్తిడిని మర్చిపోయి మహిళలందరూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు కాటా సునీత రాజు గౌడ్ స్వయంగా బహుమతులు మరియు ప్రత్యేక కానుకలను అందజేసి వారిని అభినందించారు.

మహిళా శక్తికి సలాం: కాటా సునీత రాజు గౌడ్

ఈ సందర్భంగా కాటా సునీత రాజు గౌడ్ మాట్లాడుతూ, కీలక వ్యాఖ్యలు చేశారు. “మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ నిర్మాణంలోనూ స్త్రీల పాత్ర వెలకట్టలేనిది. ఈ రోజు మహిళలందరి మధ్య ఇలా పండగలా వేడుకలు నిర్వహించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. ఆడబిడ్డల ముఖంలో చిరునవ్వు చూడటమే మాకు అసలైన విజయం. ప్రతి మహిళా ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని, అందుకు మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది” అని ఆమె పేర్కొన్నారు.అనంతరం వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా ప్రతినిధులు, స్థానిక మహిళా సంఘాల సభ్యులు మరియు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

మహా ధర్నా కు తపస్ సంపూర్ణ మద్దతు.

0

పాపన్నపేట,మార్చ్,6,మెదక్ టుడే న్యూస్:డీఎస్సీ–2003 లో నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం మార్చి 7 తలపెట్టిన ధర్నాకు తపస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు తపస్ నాయకులు మంగ నర్సింలు,మండల అధ్యక్షులు దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, జిల్లా కార్యదర్శి తులసిరాం, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, డీఎస్సీ–2003 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు ప్రభుత్వ విధానాల కారణంగా దీర్ఘకాలం పాటు నియామకాలకు దూరమై అనంతరం విధుల్లో చేరినప్పటికీ, వారికి పాత పెన్షన్ విధానం వర్తించకుండా చేయడం అన్యాయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నెం. 57 ప్రకారం మరియు ఈ అంశంపై గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో డి ఎ స్ సి –2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. న్యాయమైన హక్కు సాధన కోసం ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న మహా ధర్నాలో ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మార్కెట్ వేలం రూ. 2.88 లక్షలు.

0

పాపన్నపేట,మార్చ్,4,మెదక్ టుడే న్యూస్:పాపన్నపేట మండల పరిధి లోని నార్సింగి గ్రామానికి చెందిన వారాంతపు సంత మార్కెట్ వేలం పాట మంగళవారం నార్సింగి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బహిరంగ వేలం పాట నిర్వహించారు. గ్రామానికి చెందిన పూంటికూర సందీప్ గౌడ్ రూ. 2.88 లక్షలకు ఈ హక్కును దక్కించుకున్నారు.సర్పంచ్ దారబోయిన మల్లేశం,ఉప సర్పంచ్ శ్రీరామ్ నరేష్,పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.

పాపన్నపేటలో హోలీ సంబరాలు.

0

పాపన్నపేట,మార్చి,3,మెదక్ టుడే న్యూస్:మండల కేంద్రం పాపన్నపేటలో హోళీ వేడుక అట్టహాసంగా జరిగింది. మంగళవారం గ్రామం లోని మర్రి చెట్టు వద్ద,మెదక్ – బొడ్మట్ పల్లి పాపన్నపేట ప్రధాన రహదారి సమీపన యువకులు,నాయకులు వివిధ రకాల రంగులు చల్లు కొని సందడి చేశారు. ఒకరికొకరు హోళీ వేడుక శుభాకాంక్షలు చెప్పారు.