📄 ePaper
Sunday, September 20, 2026
ADS
Home Blog Page 35

షాద్‌నగర్ తాలూకా ఉద్యోగ సంఘాల జేఏసీ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక.

0

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,మే,3,మెదక్ టుడే న్యూస్:
షాద్‌నగర్ తాలూకాలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక బలమైన వేదిక అవసరమనే ఉద్దేశంతో ఈ కమిటీని రూపొందించారు.
జేఏసీ చైర్మన్‌గా టీఎన్జీవో ప్రెసిడెంట్, హెల్త్ ఎడ్యుకేటర్ జక్కుల జె. శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సెక్రటరీ జనరల్‌గా టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నాయిని నర్సింలుగౌడ్, వైస్ చైర్మన్లుగా పిఆర్‌టియు ప్రెసిడెంట్ ఏ. శ్రీధర్ రెడ్డి, టీజీయూఎస్ జిల్లా ప్రెసిడెంట్ వి. తౌర్యలను ఎంపిక చేశారు.ఇతర పదవుల్లో:
వి. రామారావు (రిటైర్డ్ ఎమ్మార్వో),
రఘురాం (వార్డెన్),
పద్మ నళిని (జీహెచ్ఎం),
విజయ (ఐసీడీఎస్ సూపర్వైజర్)
ట్రెజరర్‌గా రెవెన్యూ విభాగానికి చెందిన శ్రీహరిను నియమించారు.డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌గా:
ఆనంద్ సింగ్ (డిప్యూటీ తహసీల్దార్), మహేష్ (ఎస్‌టిఓ), జె. లక్ష్మీదేవమ్మ (టీచర్), సురేష్ (రిటైర్డ్ టీచర్), నాగేష్ (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, కొత్తూరు)లను ఎన్నుకున్నారు.
కో-చైర్మన్లుగా:బిజిలి సత్యం, జి. శ్రీనివాసరాజు (లైబ్రేరియన్, కొత్తూరు), నాజర్ అలీ, జనార్ధన్, రమేష్ (సీనియర్ అసిస్టెంట్, మున్సిపల్ ఆఫీస్), కే. వెంకటయ్య, జె.సి. వెంకటయ్య, కృష్ణయ్యలను ఎంపిక చేశారు.సోషల్ మీడియా కన్వీనర్‌గా ఏ. వినీత్ బాబు (కేశంపేట), ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సతీష్ కుమార్ (విఆర్‌ఓ, కేశంపేట), ఫరీద్ (ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్)లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా చైర్మన్ జక్కుల శ్రీనివాస్ మాట్లాడుతూ—ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలు ఐక్యంగా పనిచేయాలని, ప్రభుత్వం దృష్టికి సమస్యలను సమిష్టిగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఏ ఉద్యోగికి సమస్య వచ్చినా, అన్ని సంఘాలు కలసి ముందుకు రావాలని ఆయన కోరారు.

టీఎన్జీవో తాలూకా అధ్యక్షుడు జక్కుల శ్రీనివాసులకు సాయిబాబా కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం

0

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,మే,2,మెదక్ టుడే న్యూస్: టీఎన్జీవో షాద్‌నగర్ తాలూకా అధ్యక్షుడిగా ఎన్నికైన హెల్త్ ఎడ్యుకేటర్ జక్కుల శ్రీనివాసులకు సాయిబాబా కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 6వ వార్డు పరిధిలో గల సాయిబాబా కాలనీలోని శివాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాలనీవాసులు, పెద్దలు, యువకులు భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు.
కార్యక్రమానికి కమిటీ అధ్యక్షుడు మంగ శంకర్ (ASSG) అధ్యక్షత వహించగా, సమన్వయకర్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి గ్రామ శ్రీనివాసులు సమగ్రంగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమ ప్రారంభంలో అతిథులను ఆహ్వానించి, అనంతరం జక్కుల శ్రీనివాసులకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, జక్కుల శ్రీనివాసులు తాలూకా అధ్యక్ష పదవికి అర్హుడని, ఆయనకు ఉన్న సేవాభావం, నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న కట్టుబాటు ఆయనను ఈ స్థాయికి చేర్చాయని కొనియాడారు. ముఖ్యంగా సమన్వయకర్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు మాట్లాడుతూ, శ్రీనివాసులు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలకు చేరువయ్యారని, ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని తెలిపారు.
కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఏ. ఆంజనేయులు గౌడ్, మాజీ అధ్యక్షులు బోర్వెల్ శ్రీరాములు గౌడ్, అమర్నాథ్ రెడ్డి, నాట్కో చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది బెన్నూరి చంద్రయ్య, టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు 26వ వార్డు కౌన్సిలర్ బి శివ (ఎస్ పి), రామిరెడ్డి, డీసీఎం సుధాకర్ రెడ్డి, ఐటి రాజేష్ కుమార్, గుంటి రమేష్, మందారం నరసింహులు, రిటైర్డ్ ఆర్టీసీ బాలస్వామి, రమణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, క్యాషియర్ శ్రీశైలం, పోలీస్ రవి, విష్ణు (లడ్డు), సతీష్, కుమార్, అజయ్, బోల్ట్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
సన్మాన కార్యక్రమానికి ప్రతిస్పందించిన జక్కుల శ్రీనివాసులు మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకానికి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అన్ని విభాగాల ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ, ముఖ్యంగా కాలనీ వాసులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.చివరగా ప్రధాన కార్యదర్శి బొబ్బిలిగామ శ్రీనివాసులు సభకు వందన సమర్పణ గావించి, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

మే డే స్ఫూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడాలి: పినపాక ప్రభాకర్.

0

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్ నగర్,మే,1, మెదక్ న్యూస్:ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ సంఘ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ శ్రామిక ప్రజానికానికి 140వ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ నాలుగు లేబర్ కోడ్‌లను ప్రవేశపెట్టి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని అన్నారు. యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలను అన్ని కార్మిక సంఘాలు కలసికట్టుగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
మే డే స్ఫూర్తితో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. సంఘాల పేరుతో స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేసే వారి పట్ల కార్మిక వర్గం అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాఘవేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, కుమార్, శ్రీనివాస్, రమేష్ నాయక్, ఆంజనేయులు, నరసింలు, చంద్రాయుడు, లింగం, రవి, సత్యం తదితరులు పాల్గొన్నారు.

మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు నిర్వహిద్దాం.

0

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ రాజు
(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్ నగర్,మే,01, మెదక్ టుడే:
141వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే నేడు. 1886 మే 1వ తేదీన చికాగో నగరంలో జరిగిన కార్మిక వర్గ పోరాటంపై విచక్షణ రహితంగా పెట్టుబడిదారీ వర్గం జరిపిన కాల్పుల్లో 5వేల మందికి పైగా కార్మికులు ప్రాణాలర్పించారు. దాని గుర్తుగానే నేటికీ ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటాం అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ రాజు అన్నారు. ఈరోజు షాద్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ అధ్యక్షతన జరిగిన మే డే ఉత్సవాలు కార్యక్రమాలలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం. 44 చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మికవర్గాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని ఎన్నికల్లో ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మారుస్తుందని. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అని అడుగుతున్నాం. మే 1వ తేదీ స్ఫూర్తితో ప్రపంచ పోరాటాలతో పాటు మన దేశంలో కూడా అనేక పోరాటాలు జరిగాయి. వామపక్ష పార్టీ సంఘాలు తప్ప ఏ సంఘాలు కూడా కార్మిక చట్టాలు కట్టుబడి లేవు. వచ్చే కార్మికులు కూడా ప్రలోభాలకో, భయానికో, భక్తికో, బూర్జువా పార్టీలకు సంబంధించిన కార్మిక వర్గ సంఘాలలో ఉంటున్నారు. అంటే కార్మిక వర్గాన్ని నష్టపరచాలని ఆలోచిస్తూ ఉన్న సంఘాలకు తగిన బుద్ధి చెప్పాలి. కార్మిక వర్గం పక్షాన నిలబడే వామపక్ష సంఘాలను, అలాగే సీఐటీయూ తదితర సోదర సంఘాలను ఆదరించండి. కార్మికవర్గ చైతన్యంతో ప్రభుత్వాలను నిర్బంధించండి. ఈ ప్రభుత్వాలపై మన కుటుంబాలు మన మీద ఆధారపడి జీవించే వారందరికి చైతన్యం కలిగించండి. ఎన్నికల్లో వారిని ఓడించకపోతే నిరంతరం మనకు కష్టాలు తప్పవు. మన చట్టాలను కాపాడుకుంటూనే అనుకూలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. అనుకూలమైన ప్రభుత్వం అంటే బూర్జువా పార్టీలు కావు వాళ్లు మాటలు మార్చే ప్రభుత్వాలు అబద్దాలు చెప్పే ప్రభుత్వాలు. అందుకోసం వామపక్ష పార్టీలను ఎన్నుకోవాలని మేడే సందర్భంగా కార్మికవర్గానికి విన్నవిస్తున్నా అని వారు అన్నారు కార్యక్రమంల యుటిఎఫ్ సీనియర్ నాయకులు వెంకటరమణ జిల్లా కార్యదర్శి నరసింహులు. వెంకటయ్య శివారెడ్డి బిజిలి సత్యం రవికుమార్ రాములు బాలయ్య హునియా నాయక్ మున్సిపల్ యూనియన్ అధ్యక్ష యాదయ్య రాజు వెంకటయ్య ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు హెచ్ రాములు కె రాములు పాండు నాయక్
హమాలీ సంఘం నాయకులు శ్రీను రవి గ్రానైట్స్ టైల్స్ సంఘం నాయకులు జవహర్ పర్వతా లు శ్రీనివాస్ సమీర్ సిపిఎం పార్టీ నాయకులు బాలరాజు రాజు తదితరులు పాల్గొన్నారు.

అమీన్‌పూర్ అక్రమ తైబజార్ వసూళ్లపై డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ సీరియస్ హెచ్చరిక: జైలు శిక్ష తప్పదు!

0

వ్యాపారులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: డిప్యూటీ కమిషనర్

అమీన్‌పూర్,మే,1,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో తైబజార్ పేరుతో సాగుతున్న అక్రమ వసూళ్లపై అమీన్‌పూర్ జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ తీవ్రంగా స్పందించారు. గడువు ముగిసినప్పటికీ ప్రజలను, చిరు వ్యాపారులను ఇబ్బంది పెడుతూ అక్రమంగా డబ్బులు వసూలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు.

డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాలు:

తైబజార్ వసూళ్లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ స్పందిస్తూ క్షేత్రస్థాయి అధికారులకు మరియు వసూలు చేస్తున్న వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు:

  • మార్చి 31తో గడువు ముగిసింది: అధికారికంగా తైబజార్ నిర్వహణ గడువు మార్చి 31 నాటికే ముగిసిందని, ప్రస్తుతం ఎవరికీ వసూలు చేసే హక్కు లేదని స్పష్టం చేశారు.
  • వసూలు చేస్తే జైలుకే: “ఉన్నతాధికారుల నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తైబజార్ వసూలు చేయకూడదు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి సామాన్యులను ఇబ్బంది పెడితే, వారిపై కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం” అని ప్రదీప్ కుమార్ హెచ్చరించారు.
  • ఆధారాలతో ఫిర్యాదు చేయండి: ఎవరైనా అక్రమంగా డబ్బులు అడిగితే, వ్యాపారులు భయపడకుండా ఆధారాలతో తమకు ఫిర్యాదు చేయాలని, అక్రమార్కులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

అక్రమార్కులకు చెక్!

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎవరూ తైబజార్ పేరుతో డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని డిప్యూటీ కమిషనర్ స్పష్టం చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

రసాయన శాస్త్రంలో నగరపు లక్ష్మీకుమారికి పీహెచ్.డీ.

0

పటాన్ చెరు,మే,1,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని నగరపు లక్ష్మీకుమారి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘క్లోఫరాబైన్, డెసిటాబైన్, బెలినోస్టాట్, బోర్టెజోమిబ్ తయారీలో కీలక మధ్యస్థ పదార్థాలు, క్రియాశీల ఔషధ పదార్థాల (ఏపీఐ) సంశ్లేషణకు అధునాతన విధానాల’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిత్తలూరి సుధాకర్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ కుమారి చేసిన డాక్టరల్ పరిశోధన, కీలకమైన ఔషధ మధ్యస్థ పదార్థాలు, క్రియాశీల ఔషధ పదార్థాల (ఏపీఐల) సంశ్లేషణ కోసం వినూత్న, సమర్థవంతమైన వ్యూహాలను అందిస్తుందన్నారు. ఈ అధ్యయనం తేలికపాటి చర్య పరిస్థితులలో తక్కువ ఖర్చుతో కూడిన కారకాలను వినియోగించడం ద్వారా, పారిశ్రామిక వినియోగానికి అనువైన వేగవంతమైన, అధిక దిగుబడినిచ్చే, విస్తరించదగిన ప్రక్రియలను సూచిస్తోందని తెలిపారు. డాక్టర్ కుమారి పరిశోధన, క్యాన్సర్ నిరోధక మందుల అభివృద్ధికి గణనీయమైన అవకాశాలను అందించే ఆచరణాత్మక, పారిశ్రామిక-ఆధారిత సంశ్లేషణ పద్ధతులను పరిచయం చేస్తుందన్నారు. ప్రాణాలను కాపాడే ఈ చికిత్సా విధానాల తయారీలో ఎదురయ్యే కీలక సవాళ్లను పరిష్కరించడం ద్వారా, ఆమె పరిశోధన ఔషధ రసాయన శాస్త్రం, ఔషధ తయారీ రంగాలలో పురోగతికి గణనీయంగా దోహదపడుతుందని వెల్లడించారు.డాక్టర్ లక్ష్మీకుమారి సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.డాక్టర్ కుమారి సాధించిన ఈ విజయం ఆమె అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తుందని, క్యాన్సర్ చికిత్సల భవిష్యత్తుకు ఒక విలువైన తోడ్పాటును అందిస్తుందన్నారు.

అమాలి సంఘం ఆధ్వర్యంలో కార్మిక మే డే వేడుకలు.

0

చేగుంట,మే,1,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని అమాలి సంఘం ఆవరణలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.కార్మిక దినోత్సవం పురస్కరించుకొని జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షుడు దుర్గి నర్సింలు,సోమ వెంకటేష్, సిరిగోజి సత్యనారాయణ,మాట్లాడుతూ 1986లో చికాగో లో 18 గంటల పనిని ఎనిమిది గంటలకు కుదిస్తూ మే ఒకటో తేదీన అమలు చేయడం జరిగిందని దానిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మే 1వ తేదీని కార్మిక దినోత్సవం గా పిలుస్తూ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అని తెలిపారు.కార్మిక దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో
అధ్యక్షులు దుర్గి నర్సింలు,ఉపాధ్యక్షులు దుర్గి శివరాజ్,ప్రధాన కార్యదర్శి సోమ పెద్ద వెంకటేష్, క్యాషియర్ మెట్టు రవి,కర్ణ లక్ష్మణ్ , ఆర్గానిక్ సెక్రెటరీ సోమషోక్ సలహాదారులు బక్క చిన్న నర్సింలు, తలారి నల్ల పోచయ్య, సిరిగోజి సత్యనారాయణ,మెట్టు భూపాల్, నాగులు, షాదుల్లా,పులబోయిన భూపాల్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

చేగుంట గ్రామపంచాయతీ ఆవరణలో మే డే వేడుకలు.

0

చేగుంట,మే,1,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు, కార్మిక దినోత్సవం పురస్కరించుకొని జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా సర్పంచ్ స్రవంతి సతీష్ ఉపసర్పంచ్ కార్మిక సంఘం అధ్యక్షుడు తలారి లింగం, మాట్లాడుతూ 1986లో చికాగో లో 18 గంటల పనిని ఎనిమిది గంటలకు కుదిస్తూ మే ఒకటో తేదీన అమలు చేయడం జరిగిందని దానిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మే 1వ తేదీని కార్మిక దినోత్సవం గా పిలుస్తూ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అని తెలిపారు, కార్మికుల కు కనీస వేతనం ఇవ్వాలని కార్మిక దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని వారు అన్నారు, కార్మికులకు పనికి తగ్గ వేతనం అందివాలని కార్మిక సంఘం నాయకుడు తలారి లింగం,ప్రభుత్వాన్ని కోరారు, ఈ కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, వార్డు సభ్యులు పంచాయతీ కార్మికులు, సంఘం అధ్యక్షులు తలారి లింగం, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, కార్మికులు రాములు, బుదయ, శివమ్మ, లలిత, సాయమ్మ, మనమ్మ,లక్ష్మి, వెంకటేష్, సదుల్లా, కృష్ణ, సువర్ణ, నవీన్, నందు, శ్రీకాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నేడు టీఎన్జీవో తాలూకా అధ్యక్షుడు జక్కుల శ్రీనివాసులకు ఘన సన్మానం.

0

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,ఏప్రిల్,30,మెదక్ టుడే న్యూస్: టీఎన్జీవో షాద్‌నగర్ తాలూకా అధ్యక్షుడిగా ఎన్నికైన హెల్త్ ఎడ్యుకేటర్ జక్కుల శ్రీనివాసులకు సాయిబాబా కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.
షాద్‌నగర్ పట్టణంలోని 6వ వార్డు పరిధిలో గల సాయిబాబా కాలనీలో, మే 1 (శుక్రవారం) సాయంత్రం 6 గంటలకు శివాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ అధ్యక్షుడు మంగ శంకర్ (ASSG), సమన్వయకర్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి గ్రామ శ్రీనివాసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు, పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో హాజరై జక్కుల శ్రీనివాసులను సన్మానించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

పదో తరగతి ఫలితాల్లో ‘వ్రిహా’ స్కూల్ ప్రభంజనం.. 100 శాతం ఉత్తీర్ణతతో రికార్డు!

0

టాపర్లకు నగదు పురస్కారాలు అందజేసిన ఛైర్మన్ జి.టి. విజయ కృష్ణ

అమీన్‌పూర్,ఏప్రిల్,30,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని వ్రిహా స్కూల్ పదవ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాలను నమోదు చేసి తన ప్రత్యేకతను చాటుకుంది. గురువారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాఠశాల ఛైర్మన్ జి.టి. విజయ కృష్ణ ఫలితాల వివరాలను వెల్లడించారు.వంద శాతం విజయం:
ఈ ఏడాది వ్రిహా స్కూల్ నుండి 32 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలను సాధించడం విశేషం. విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల నిరంతర కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ఈ సందర్భంగా ఛైర్మన్ పేర్కొన్నారు.ప్రతిభావంతులకు నగదు పురస్కారాలు,పాఠశాల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు యాజమాన్యం నగదు పురస్కారాలను అందజేసింది. వివరాలు ఇలా ఉన్నాయి:ప్రథమ స్థానం: అక్షిత (588/600) – రూ. 25,000 నగదు బహుమతి
ద్వితీయ స్థానం: హాసిని (586 మార్కులు) – రూ. 15,000 నగదు బహుమతి
తృతీయ స్థానం: శ్రేయ (580 మార్కులు) – రూ. 10,000 నగదు బహుమతి.ఘనంగా సన్మానం:
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం శాలువాలతో ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. ప్రియబాంధవి, ప్రిన్సిపల్ జి. రాధిక, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన నాణ్యమైన విద్యను అందిస్తూ మరిన్ని విజయాలు సాధిస్తామని పాఠశాల బృందం ధీమా వ్యక్తం చేసింది.