📄 ePaper
Saturday, June 6, 2026
ADS
Home Blog Page 35

టెన్త్ క్లాసు విద్యార్థుల వీడ్కోలు సమావేశం.

0

చేగుంట,మార్చి,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల్ ఇబ్రహీంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పదో తరగతి ఈ జీవితంలో చాలా ముఖ్యమైన మలుపు ఈ దశలో మీరు కష్టపడి చదివితే మీ భవిష్యత్తు బలంగా ఉంటుంది ఎప్పుడు క్రమశిక్షణ పట్టుదల మరియు మంచి ఆలోచనలను మీతో తీసుకొని ముందుకు సాగండి మేము మీకు ఇచ్చిన విద్య సలహాలు,విలువలను జీవితంలో గుర్తుంచుకోండి విజయాలు వచ్చినప్పుడు వినయం ఉండాలి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి మీరు ఎక్కడికి వెళ్లినా పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి ఇబ్రహీంపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు ఇట్టి ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.వి లతంబర్ రావ్ గ్రామ ఉపసర్పంచ్ చౌదరి శ్రీనివాస్ ఉపాధ్యాయులు పరంధామయ్య వెంకటేష్ మహేందర్ రెడ్డి బాల్ నరసయ్య గీత నరేష్,వార్డు సభ్యులు,గుండమైన నవీన్, చాకలి శ్యామల. కుమ్మరి రాజు సుమలత,విద్యార్థి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వడియారం ప్రాథమిక పాఠశాలకు సౌండ్ బాక్స్ బహూకరించిన, టీచర్.

0

చేగుంట,మార్చి,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం ప్రాథమిక పాఠశాలకు సంతోషిమాత టీచర్ సౌండ్ బాక్స్ బహుకరించడం జరిగింది. ఇటీవల నిర్వహించిన పదోన్నతులలో వడియారం ప్రాథమిక పాఠశాల నుండి రెడ్డిపల్లి ఉన్నత పాఠశాలకు వెళ్లిన సంతోషిమాత టీచర్, వడియారం పాఠశాలకు విద్యార్థులకు ఉపయోగపడే సౌండ్ బాక్స్ ఇచ్చినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధిరాములు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వసంత, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

పెద్ద శివనూర్ గ్రామంలో డిజిటల్ పంటల సర్వే.

0

చేగుంట,మార్చి,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో డిజిటల్ పంట సర్వే నిర్వహించారు మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ పొలాలను పరిశీలించి రైతుల వివరాలు త్వరగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి భువనేశ్వరి, చేగుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులు, గ్రామ వాలంటరీ హరీష్, అన్నం కుమార్, అప్పల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

పటాన్‌చెరులో మహిళా దినోత్సవ వేడుకలు: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాట సునీత రాజు గౌడ్.

0

పటాన్‌చెరు,మార్చి,12,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.పటాన్‌చెరు నియోజకవర్గ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి – యాదమ్మ దంపతుల సారధ్యంలో నిర్వహించిన ఈ భారీ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కాట సునీత రాజు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది మహిళలతో పటాన్‌చెరు ప్రాంతం ఒక చైతన్య వేదికగా మారింది.

అనంతరం ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి గూడెం యాదమ్మ మాట్లాడుతూ

మహిళా శక్తికి నిదర్శనంగా ఈ వేడుక నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇంటి బాధ్యతలతో పాటు సామాజిక బాధ్యతల్లోనూ మహిళలు చురుగ్గా పాల్గొనాలని, ప్రతి మహిళా ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ మహిళల కోసం కుట్టు మిషన్ల పంపిణీ, ఉపాధి శిక్షణ తరగతులు వంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని, మహిళా సంఘాల బలోపేతానికి తమ కుటుంబం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, నిరంతరం మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కాట సునీత రాజు గౌడ్ ప్రసంగిస్తూ

నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తూ అగ్రగామిగా నిలుస్తున్నారని కొనియాడారు. బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే మహిళలకు రాజకీయంగా, సామాజికంగా గొప్ప గౌరవం దక్కిందని, షీ టీమ్స్ వంటి వ్యవస్థల ద్వారా తెలంగాణలో మహిళలకు పూర్తి రక్షణ లభించిందని ఆమె గుర్తు చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పేద తల్లుల జీవితాల్లో వెలుగులు నింపాయని, ఆడబిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి కృషి అభినందనీయమని ప్రశంసించారు. నియోజకవర్గంలోని ప్రతి మహిళా సోదరి అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమె భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో భాగంగా మహిళలకు నిర్వహించిన వివిధ క్రీడా మరియు సాంస్కృతిక పోటీలు సందడిగా సాగాయి. విజేతలకు శ్రీమతి గూడెం యాదమ్మ మరియు కాట సునీత రాజు గౌడ్ కలిసి బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు మరియు పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

పటాన్‌చెరులో పదవ తరగతి పరీక్షలకు సిద్ధం:ఎంఈఓ.

0

•మండల వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాల ఏర్పాటు

•3196 మంది విద్యార్థులు హాజరు.. పకడ్బందీగా సీసీ కెమెరాల నిఘా.

• పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.

    పటాన్‌చెరు,మార్చి,12(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలో ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షల నిర్వహణపై మండల విద్యాధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.

    పరీక్షల గణాంకాలు:

    ఈ ఏడాది పటాన్‌చెరు మండలంలో మొత్తం 3,196 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 1,746 మంది బాలురు, 1,450 మంది బాలికలు ఉన్నారు. వీరి కోసం మండల వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. ఈ కేంద్రాల పర్యవేక్షణ కోసం మొత్తం 175 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందని పేర్కొన్నారు.

    పకడ్బందీ ఏర్పాట్లు – ఎంఈఓ వెల్లడించిన వివరాలు:

    •సిసి కెమెరాల నిఘా: పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రతి ఎగ్జామ్ హాల్‌లో సీసీ కెమెరాలను అమర్చామని, వీటి ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

    •విద్యార్థుల సౌకర్యార్థం: ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తాగునీటి సదుపాయం, విద్యుత్ సరఫరా, మరియు మెరుగైన టాయిలెట్ సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.

    •మెడికల్ క్యాంపులు: విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా ప్రతి సెంటర్ వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశామని, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

    • 144 సెక్షన్ అమలు: పోలీస్ శాఖ సహకారంతో పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లను పరీక్ష సమయంలో మూసివేయాలని ఆదేశించారు.

    ముఖ్య సూచన:

    విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు పరీక్షా హాల్లోకి అనుమతించబడవు అని ఎంఈఓ నాగేశ్వరరావు గారు హెచ్చరించారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో పరీక్షలు రాసి మండల కీర్తిని చాటాలని ఆయన ఆకాంక్షించారు.

    పటాన్‌చెరు మండల పరీక్షా కేంద్రాల వివరాలు:

    1.జెడ్ . పి బాయ్స్ హైస్కూల్, పటాన్‌చెరు (240)

    1. జెడ్ . పి గర్ల్స్ హైస్కూల్, పటాన్‌చెరు (240)
      3.సెయింట్ జోసెఫ్ హైస్కూల్ ‘A’ సెంటర్ (240)
      4.సెయింట్ జోసెఫ్ హైస్కూల్ ‘B’ సెంటర్ (240)
      5.జెడ్ . పి హైస్కూల్ ఇస్నాపూర్ (240)
      6.సెయింట్ మేరీస్ గ్రామర్ హైస్కూల్, ఇస్నాపూర్ (240)
      7.శిశు విహార్ హైస్కూల్, శాంతినగర్ (240)
      8.వి ఎస్ ఆర్ స్కూల్, పటాన్‌చెరు (240)
      9.ఒరిజన్ టెక్నో స్కూల్, గౌతమ్ నగర్ (219)
      10.శ్రీ చైతన్య హైస్కూల్, పటాన్‌చెరు (220)
      11.మంజీరా హైస్కూల్, పటాన్‌చెరు (220)
      12.గౌతమ్ హైస్కూల్, ఇంద్రేషం (220)
      13.శాంతి నికేతన్ హైస్కూల్, పటాన్‌చెరు (188)
    2. జెడ్ పి హైస్కూల్ ముత్తంగి (209)..

    (మొత్తం విద్యార్థులు 3196..)

    కాటా సునీత రాజు గౌడ్ ఆధ్వర్యంలో హరీష్ రావును కలిసిన మహిళా విజేతలు.

    0

    అమీన్‌పూర్ మహిళా విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు అందజేసిన మాజీ మంత్రి

    అమీన్‌పూర్,మార్చి,11,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమీన్‌పూర్‌లో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన మహిళా విజేతలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ తన్నీరు హరీష్ రావు తన నివాసంలో ప్రత్యేకంగా అభినందించారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు శ్రీమతి కాటా సునీత రాజు గౌడ్ ఆధ్వర్యంలో విజేతలైన మహిళలు హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా విజేతలకు మెమెంటోలు మరియు నగదు బహుమతులను అందజేసి సత్కరించారు.

    మహిళా శక్తికి అండగా ఉంటాం: హరీష్ రావు

    ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం కేవలం ఒక రోజు వేడుక కాదని, మహిళల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. అమీన్‌పూర్‌లో మహిళల కోసం ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన కాటా సునీత రాజు గౌడ్ కృషీని ఆయన అభినందించారు. గెలుపొందిన మహిళల ఉత్సాహం చూస్తుంటే సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా మహిళా సంక్షేమ కార్యక్రమాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.

    హరీష్ రావు చేతుల మీదుగా బహుమతులు అందుకోవడం గర్వకారణం: కాటా సునీత రాజు గౌడ్

    నిర్వాహకురాలు శ్రీమతి కాటా సునీత రాజు గౌడ్ మాట్లాడుతూ.అమీన్‌పూర్‌లో మేము నిర్వహించిన మహిళా దినోత్సవ పోటీల్లో గెలిచిన సోదరీమణులకు, ఈరోజు స్వయంగా హరీష్ రావు నివాసంలో వారి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం మాకు దక్కిన గొప్ప గౌరవం. హరీష్ రావు మహిళా సాధికారతకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు. వారు ఇచ్చిన ఈ ప్రోత్సాహం అమీన్‌పూర్ మహిళల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. రాబోయే కాలంలో అమీన్‌పూర్ గ్రామంలో ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతాము” అని తెలిపారు.బహుమతులు అందుకున్న మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, తమను గుర్తించి గౌరవించిన హరీష్ రావు గారికి మరియు కాటా సునీత రాజు గౌడ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు అమీన్‌పూర్ మహిళలు పాల్గొన్నారు..

    గుమ్మడిదలలో వైభవంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు: అశ్వవాహనంపై ఊరేగిన స్వామివారు.

    0

    గుమ్మడిదల,మార్చి,10,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల పురపాలక సంఘం పరిధిలోని బొంతపల్లి గ్రామంలో వెలసిన భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు విశేషంగా అలంకరించిన అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

    భక్తిశ్రద్ధలతో వాహన సేవ:

    ఆలయ ప్రాంగణంలో శివనామ స్మరణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారికి హారతులు సమర్పించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి “హర హర మహాదేవ”, “వీరభద్ర స్వామికి జై” అంటూ చేసిన నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.

    కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం:

    బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రతిరోజూ స్వామివారిని విభిన్న వాహనాలపై అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తుండటంతో, స్థానిక గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి పోయింది.

    పాల్గొన్న ప్రముఖులు:

    ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి, ధర్మకర్తలు అశోక్, భాస్కర్ గౌడ్, ఆలయ సిబ్బంది సోమయ్యతో పాటు స్థానిక నాయకులు ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, హుస్సేన్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిభావంతో సాగేలా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

    మురుగు కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్.

    0

    జయలక్ష్మి నగర్, లక్ష్మి సాయి మెడోస్ కాలనీల్లో అధికారులతో కలిసి మాజీ వైస్ చైర్మన్ పర్యటన
    దుర్వాసన, దోమల బెడదపై కాలనీవాసుల ఫిర్యాదుతో తక్షణ స్పందన

    అమీన్పూర్,మార్చి,10,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ డివిజన్ జయలక్ష్మి నగర్, లక్ష్మి సాయి మెడోస్ కాలనీల గుండా వెళ్తున్న ప్రధాన మురుగునీటి కాలువ వల్ల వెలువడుతున్న దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ స్పష్టం చేశారు.

    సమస్య తీవ్రతపై ప్రజల ఆవేదన:

    గత కొద్దిరోజులుగా సదరు కాలనీల్లో కాలువను శుభ్రపరచకపోవడం వల్ల భరించలేని దుర్వాసన వెలువడుతోందని, దీనివల్ల ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దోమల ఉధృతి పెరిగి పిల్లలు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారని ఇటీవల నందారం నరసింహ గౌడ్ ని కలిసి మొరపెట్టుకున్నారు..

    క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటన:

    ప్రజల విన్నపంపై తక్షణమే స్పందించిన నరసింహ గౌడ్, అమీన్పూర్ మున్సిపాలిటీ డీఈ వెంకటరమణతో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి ఆయన స్వయంగా రెండు కాలనీల్లో పర్యటించారు. కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్ (మట్టి), చెత్తాచెదారం వల్ల నీరు నిలిచిపోయి దుర్వాసన వస్తున్న విషయాన్ని అధికారులకు క్షేత్రస్థాయిలో చూపించారు.

    నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ:

    “కాలనీ ప్రజల ఆరోగ్యం మరియు పరిశుభ్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రధాన మురుగు కాలువను వెంటనే ప్రక్షాళన చేసి, నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించాము. అతి త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం.తమ సమస్యను విన్నవించిన వెంటనే స్పందించి, అధికారులతో కలిసి పరిష్కారం దిశగా కృషి చేస్తున్న నందారం నరసింహ గౌడ్ గారికి జయలక్ష్మి నగర్, లక్ష్మి సాయి మెడోస్ కాలనీ ప్రజలు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

    నేతాజీ నగర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

    0

    పటాన్ చెరు,మార్చి,10,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు ఐక్యతకు ప్రతీకలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జేపీ కాలనీ డివిజన్ పరిధిలోనిబండల్‌గూడ నేతాజీనగర్ ఖాజా గారిబే నవాజ్ మసీద్ నందు మంగళవారం సాయంత్రం మాజీ ఎంపీపీ నాలకంటి యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈనెల 13వ తేదీన పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందును విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నాగ మల్లేష్ యాదవ్, చంద్రశేఖర్, జబ్బర్, షాబుద్దీన్ , అక్రమ్, యాసిన్, సోహియల్, గోరి, పద్మ, మేరీ, తదితరులు పాల్గొన్నారు.

    బొల్లారంలో అక్రమ కట్టడాల కూల్చివేత: పార్కు స్థలం స్వాధీనం.

    0

    ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన గదుల నేలమట్టం

    • అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం
    • ఆక్రమణలు పునరావృతం కాకుండా ప్రహరీ గోడ నిర్మాణానికి ఆదేశం

    అమీన్‌పూర్,మార్చి,10,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ సర్కిల్ – 47 పరిధిలోని బొల్లారం గ్రామం, అన్రిచ్ లేఅవుట్‌లో గల ప్రభుత్వ పార్కు స్థలాన్ని అధికారులు మంగళవారం ఆక్రమణదారుల నుండి విముక్తి చేశారు. సర్వే సంఖ్యలు 81 మరియు 84లో ఉన్న ఈ పార్కు స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రేకుల గదులను ప్రత్యేక బృందం విజయవంతంగా కూల్చివేసింది.

    వివరాల్లోకి వెళ్తే:

    గతంలోనే ఈ పార్కు స్థలాన్ని సంరక్షించడానికి అధికారులు చుట్టూ కందకాలు తవ్వి, ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. అయితే, ప్రభుత్వ చర్యలను లెక్కచేయని కొందరు దుండగులు పదేపదే కందకాలను పూడ్చివేయడం, కంచెను తొలగించడం చేస్తూ వచ్చారు. ఈ అక్రమాలపై స్థానిక పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ, అక్రమార్కులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిర్మాణాలను కొనసాగించారు.

    అధికారుల కఠిన చర్యలు:

    ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని గమనించిన ఉన్నతాధికారులు, మంగళవారం ప్రత్యేక బలగాలతో క్షేత్రస్థాయిలో పర్యటించారు. యంత్రాల సహాయంతో అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించి, భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో తిరిగి ఆక్రమణలకు తావులేకుండా, పార్కు చుట్టూ శాశ్వత ప్రహరీ గోడ నిర్మించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.

    హెచ్చరిక:

    ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను, ప్రజా అవసరాల కోసం కేటాయించిన పార్కు స్థలాలను ఆక్రమిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.