📄 ePaper
Saturday, June 6, 2026
ADS
Home Blog Page 34

ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు తాసిల్దార్ శివప్రసాద్.

0

సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు

చేగుంట,మార్చి,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలో గృహ అవసరాలకు గ్యాస్ ఎటువంటి కొరత లేదని తాసిల్దార్ శివప్రసాద్ తెలిపారు చేగుంట మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీని శనివారం ఆయన తనిఖీ చేసి నిల్వలను పరిశీలించారు. అందరికీ సరిపడా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందవద్దని మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన అన్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలనపై,యువత భవిష్యత్తు

0

ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి

చేగుంట,మార్చి,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట పట్టణ కేంద్రంలో శనివారం నాడు, దేశంలోనే విద్యార్థులు, యువత బంగారు భవిష్యత్తును మాదకద్రవ్యాలు,నాశనం చేస్తున్నాయని చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. ఈరోజు మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దడమే “నశా ముక్త భారత అభియాస్”ప్రధాన ఉద్దేశం గా మెదక్ చౌరస్తా లో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ గుణంకాల ప్రకారం 25 ఏళ్లలోపు యువత అధికంగా బానిసలు అవుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.మాదక ద్రవ్యాలు మానసిక, శారీరిక ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు అని, ఇవి యువతను చెడు మార్గంలో నడిపిస్తాయని, చదువులో వెనకబడేలా చేస్తాయన్నారు. ఒకసారి దీనికి బానిసైతే ఎంతటి ఆకృత్యాలు నేరాలు చేయడానికి వెనకాడనన్నారు. ఉపాధ్యాయులు ,తల్లిదండ్రులు విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలని తగు సూచనలు తెలిపి ,మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అందరూ పాటుపడాలని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ,ఎస్ఐ, సంయోద్దీన్ పోలీస్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, బోనాల సర్పంచ్ రాములు, మొహమ్మద్ అలీ,తదితరులు పాల్గొన్నారు.

సిసి డ్రైనేజీ పనిని పర్యవేక్షించిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి.

0

చేగుంట,మార్చి,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట గ్రామంలో గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ వార్డు సభ్యులతో కలిసి సిసి రోడ్లు మరియు డ్రైనేజీ పనులను పర్యవేక్షించిన దుబ్బాక నియోజక వర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో చేగుంట గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, వడ్ల నవీన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, వడియారం గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అన్నం ఆంజనేయులు ఎండి ముజామిల్,ఉప సర్పంచ్ చౌదర్ శ్రీనివాస. చేగుంట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాశ బోయిన మహేష్, కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగినది.

చేగుంట రిషి మెమోరియల్ స్కూల్ లో స్వపరిపాలన దినోత్సవం.

0

చేగుంట,మార్చి,13,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం కేంద్రంలోని రిషి మెమోరియల్ స్కూల్లోవిద్యార్థులే ఉపాధ్యాయులుగా ఒక రోజు విధులు నిర్వహించడం జరిగింది.ప్రతిరోజు ఉపాధ్యాయులు విధి నిర్వహణ ఎంత కష్టంగా ఉంటుందో గుర్తించామని ఇకనుండి మేము కూడా మంచి విద్యార్థులుగా ఉంటూ పెద్దల పట్ల ఉపాధ్యాయుల పట్ల గౌరవప్రదంగా నడుచుకుంటామని తెలుపుతూ వారికి నచ్చిన ఉపాధ్యాయులను అనుకరిస్తూ తమదైన శైలిలో బోధన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వారికిచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం పరుచుకున్నట్లు తెలిపారు. అన్ని రంగాలకు కన్నా ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవప్రదమైన ఉన్నత స్థానంగా వర్ణించారు.
ఈ కార్యక్రమంలో రిషి మెమోరియల్ స్కూల్ కరెస్పాండెంట్  ప్రిన్సిపాల్ సత్యనారాయణ చైర్పర్సన్ సుష్మ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

చేగుంట పట్టణంలో వేగంగా అభివృద్ధి పనులు.

0

చేగుంట,మార్చి,13,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ వెనకాల గల ఆరవ వార్డు ప్రజలు మాకు చాలా సంవత్సరాల నుండి డ్రైనేజీ సరిగా లేదు అని సర్పంచ్ సండ్రు గు స్రవంతి సతీష్ దృష్టికి తీసుకురాగానే సర్పంచ్ అక్కడికి వెళ్లి చూసి చాలా ఇబ్బందికరంగానే ఉంది అని నూతన డ్రైనేజీ వేయిస్తున్నారు దానిని ఈరోజు పరిశీలించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి సతీష్, వార్డు మెంబర్లు ఆకుల సుఖేందర్,తలారి లింగం, శ్రీకాంత్ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

బోనాల గ్రామంలో దివ్యాంగులకు న్యూట్రిషన్ కిట్టు బట్టల పంపిణీ.

0

చేగుంట,మార్చి,13,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలo బోన్నల గ్రామం లో 60 మంది దివ్యాంగులకు న్యూట్రిషన్ మరియు ఒక డ్రెస్సు బట్టలు జీవోదయ సంస్థ డైరెక్టర్, జీవోదయ సంస్థ కోఆర్డినేటర్ మంజుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు చేగుంట ఎమ్మార్పీఎస్ అధ్యక్షు కొలుపుల రామస్వామి,మెదక్ జిల్లా దివ్యంగుల సంగం అద్యక్షులు కుమ్మరి కుమార్, యదగౌడ్,రవి,జగన్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.

0

చేగుంట,మార్చి,13,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని చేగుంట, వడియరం, రెడ్డి పల్లి, చందాయి పేట్, మక్కరాజ్ పేట్, గీతా ఆరు పరీక్షా కేంద్రాలలో బాలురు 334, బాలికలు 335 మొత్తం 669 విద్యార్థులు పరీక్ష వ్రాస్తున్నారు. ఈ సందర్భంగా మక్కరాజ్ పేట్ పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్ శీలం మల్లారెడ్డి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాన్ని చేరుకోవాలని, పరీక్ష రాయడానికి కావలసినటువంటి వస్తువులు తెచ్చుకోవాలని, ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాయాలని వారన్నారు

పదవ తరగతి పరీక్షలకు రామచంద్రపురం సిద్ధం: ఎంఈఓ రాములు.

0

మండల వ్యాప్తంగా 7 పరీక్షా కేంద్రాలు.. 1643 మంది విద్యార్థులు హాజరు

విద్యార్థులకు కీలక సూచనలు జారీ చేసిన ఎంఈఓ

    రామచంద్రపురం,మార్చి,13,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం మండల పరిధిలోరేపటి నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి శ్రీ రాములు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆయన కోరారు.

    1 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,బిహెచ్‌ఈఎల్

    2 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రామచంద్రపురం

    3 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తెల్లాపూర్

    4 స్కాలర్స్ మోడల్ హైస్కూల్

    5 సెయింట్ ఆర్నాల్డ్స్ హైస్కూల్

    6 సెయింట్ ఆన్స్ హైస్కూల్

    7 విద్యాభారతి హైస్కూల్ , బిహెచ్‌ఈఎల్

    విద్యార్థులకు ఎంఈఓ రాములు సూచనలు:

    సమయపాలన: పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థులు గంట ముందే (8:30 గంటలకే) పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.నిషేధిత వస్తువులు: ఎగ్జామ్ హాల్లోకి సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచ్‌లు లేదా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు.
    వసతులు: ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తాగునీరు, విద్యుత్ మరియు ఫర్నిచర్ వంటి కనీస వసతులు కల్పించామని, విద్యార్థులు తమ హాల్ టికెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు.క్రమశిక్షణ: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఇన్విజిలేటర్ల నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు.విద్యార్థులందరూ కష్టపడి చదివి, మంచి ఫలితాలు సాధించి మండలానికి పేరు తీసుకురావాలని ఎంఈఓ రాములు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

    అమీన్‌పూర్ మండలంలో పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: ఎంఈఓ సుధాకర్.

    0

    మండల వ్యాప్తంగా 7 పరీక్షా కేంద్రాల ఏర్పాటు

      •మొత్తం 1460 మంది విద్యార్థులు హాజరు

      •పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ

      అమీన్‌పూర్,మార్చి,13,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ మండల పరిధిలో ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి సుధాకర్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించామని ఆయన పేర్కొన్నారు.

      పరీక్షా కేంద్రాల వారీగా విద్యార్థుల వివరాలు:

      మండలంలోని మొత్తం 7 కేంద్రాలలో 1460 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కేంద్రాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:

      క్రమసంఖ్య పరీక్షా కేంద్రం పేరు విద్యార్థుల సంఖ్య

      1 శ్రీ చైతన్య స్కూల్, అమీన్‌పూర్ 240,
      2 సాయి స్కూల్, బీరంగూడ 240
      3 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , బీరంగూడ 200
      4 లైఫ్ లైన్ స్కూల్, సాయి కాలనీ 220
      5 డార్విన్ స్కూల్, బీరంగూడ 160
      6 సాయి హైస్కూల్, కిష్టారెడ్డిపేట 200
      7 శ్రీనిధి స్కూల్ 200
      మొత్తం విద్యార్థులు 1460..

      ఎంఈఓ సుధాకర్ సూచనలు:

      ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయని, విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.నిబంధనలు: పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు లేదా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.వసతులు: ప్రతి కేంద్రం వద్ద తాగునీరు, వెలుతురు మరియు ఫర్నిచర్ వంటి సౌకర్యాలను పర్యవేక్షించామన్నారు.భద్రత: పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఇన్విజిలేటర్లకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరూ ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

      చేగుంట మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

      0

      చేగుంట,మార్చి,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో మహిళ సమాఖ్య కార్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మండల మహిళా సమాఖ్య- చేగుంట ఆధ్వర్యంలో వివిధ బ్యాంకు మేనేజర్ ఎం ఎస్ వారి సౌజన్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది .గ్రామ సంఘం అధ్యక్షురాలు గ్రామ సంఘం విఓఏ లు అందరు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు రకరకాల ఆటల పోటీలు పాటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా గౌరవ అడిషనల్ డిఆర్డిఓ సరస్వతి రావడం జరిగింది మేడం చేతుల మీదుగా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగినది. ఈకార్యక్రమంలో డిపిఎం బ్యాంక్ లింకేజి బాలరాజ్, మండల సమైక్య పాలకవర్గం, ఎఫ్ పి సి పాలకవర్గం, ఏపిఎం, సీసీ లు, ఎంఎస్ఏ, ఎంఎస్ఓ, ఎఫ్ పి సి సీఈఓ, అకౌంటెంట్ మరియు అటెండర్ పాల్గొనడం జరిగింది.