పాపన్నపేట,మార్చ్,16,మెదక్ టుడే న్యూస్:పాపన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం తైబజారు కు అధికారులు వేలం పాట నిర్వహించారు. రూ.6.55.000 లకు దున్న శివ గౌడ్ అధిక ధర పలికి ఈ హక్కుని దక్కించుకున్నారు .ఈకార్యక్రమంలో ఎంపీవో శ్రీశైలం,గ్రామపంచాయతీ కార్యదర్శి నయీమ్,సర్పంచ్ పావని నరేందర్ గౌడ్,ఉప సర్పంచ్ సద్దామ్ హుస్సేన్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
బీరంగూడలో రాష్ట్ర స్థాయి కబడ్డీ సంబరాలు-పోస్టర్ ఆవిష్కరించిన బీఆర్ఎస్ నాయకురాలు కాట సునీత రాజు గౌడ్.
అమీన్ పూర్,మార్చి,16,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూడలో నిర్వహించ తలపెట్టిన “తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ ఛాంపియన్స్ ట్రోఫీ – సీజన్ 10” పోటీలకు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్కు సంబంధించిన ఆహ్వాన పత్రికను సోమవారం ‘టీమ్ పండు’ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కాట సునీత రాజు గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడలకు పూర్వవైభవం తీసుకురావడంలో కబడ్డీ కీలక పాత్ర పోషిస్తుందని, ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం ద్వారా యువతలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా క్రమశిక్షణకు కూడా తోడ్పడతాయని పేర్కొన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన క్రీడలను నిర్వహిస్తున్న టీమ్ పండు సభ్యులను ఆమె అభినందిస్తూ, పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
పోటీల వివరాలు:
- తేదీలు: మార్చి 28 మరియు 29,
2026. - వేదిక: మండే మార్కెట్ గ్రౌండ్స్, బీరంగూడ, పటాన్చెరు.
బహుమతులు: మొదటి బహుమతి: రూ. 50,000/-
రెండవ బహుమతి: రూ. 30,000/-
- మూడు మరియు నాలుగవ
బహుమతులు: తలా రూ. 10,000/-
తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అనుమతితో నిర్వహించబడుతున్న ఈ పోటీలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జట్లు పాల్గొననున్నాయి. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు టీమ్ పండు సభ్యులు మరియు క్రీడా ప్రేమికులు పాల్గొన్నారు.

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా చెక్కును అందచేసిన ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి.
చేగుంట,మార్చ్,15,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేస్తూ జీవించే మెండ స్వామి (40) శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ భీమా పాలసీ తీసుకున్నారు.తీసుకున్న 06 నెలలకు ఆరోగ్యం బాగాలేక మరణించాడు ,
కంపెనీ నుండి 5,41,000 రూపాయిల బీమా చెక్కును .నామిని అయిన తన భార్య మెండే రాని,కి ఆదివారం నాడు
5లక్షల 41వేలు రూపాయలు
చెక్కును చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి, సర్పంచ్ శ్రీధర్ చేతుల మీదుగా అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఇన్సూరెన్స్ కలిగి ఉండడం తమ బాధ్యతగా భావించి, సరైన బీమా కలిగి ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ స్వామి వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ రవి, డీజీఎం సురేష్ , ఆర్ ఎం శ్రీనివాస్, డివో నరసింహులు, ఏజెంటు కోటగిరి ప్రశాంత్, బ్రాంచ్ ఉద్యోగులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసినా పలు గ్రామల సర్పంచ్ లు.
చేగుంట,మార్చి,15,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని పలు గ్రామాల సర్పంచులు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలసివారి గ్రామ సమస్యలు,గ్రామాల అభివృద్ధి పనులను వివరించారు. అలాగే మల్లన సాగర్ నుంచి శంకరంపేట కెనాల్ ద్వారా వెళ్తున్న నీటిని ఇందుప్రియల్ గ్రామం వద్ద నుంచి కసంపల్లి,పోతంపల్లి,పోతన శేట్టిపల్లి,చెట్లతిమ్మాయిపల్లి,చుట్టుపక్కగ్రామాలకు మీదుగా నీరు వచ్చే విధంగా జిల్లా ఇంచార్జీ మంత్రి కి వివరించాల్సిందిగా,గ్రామాల అభివృద్ధి నిధులు మంజూరు చేయించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా చేగుంట ఎఎంసి ఛైర్మెన్ తాడేం వెంగళరావు,చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, అప్పాల శేఖర్, కసాన్ పల్లి గ్రామ సర్పంచ్ భిక్య నాయక్, పోతంపల్లి గ్రామ సర్పంచ్ మాధవ రెడ్డి,పోతన శేట్టిపల్లి గ్రామ సర్పంచ్ ప్రశాంత్, చెట్లతిమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్ హంశి మనోహర్,నడిమి తండా గ్రామ సర్పంచ్ కేతవత్ రాములు,పెద్ద శివనూర్ గ్రామ సర్పంచ్ నర్సింలు,తదితరులు పాల్గొన్నారు.
పరిశుద్ధ కార్మికులను సన్మానించిన, పలు సర్పంచులు.
చేగుంట,మార్చి,14,మెదక్ టుడే న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో భాగంగా 99 రోజుల ప్రణాళిక లో నేడు ఆదివారం 10 రోజు ప్రణాళిక లో భాగంగా 15.03.2026 రోజున చేయవలసిన కార్యాచరణలో మండలం లోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికీ సబ్బు నూనె మరియు గ్లౌస్లు యూనిఫామ్స్ లు శానిటేషన్ వస్తువులు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో చేగుంట పట్టణ సర్పంచ్, స్రవంతి సతీష్, వడియారం సర్పంచ్, సాయికుమార్ గౌడ్ రెడ్డిపల్లి సర్పంచ్ నరసింహ, అనంతసాగర్ సర్పంచ్ శ్రీధర్, వివిధ గ్రామాల సర్పంచులు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు,వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు ,మహిళా సంఘాల మహిళలు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గోన్నారు.

రీజియన్ పరిధిలో ఎక్సలెంట్ జోన్ ఛైర్పర్సన్ అవార్డును అందుకున్న లయన్ ఆకుల సుఖేందర్.
చేగుంట,మార్చి,15,మెదక్ టుడే న్యూస్:చేగుంట లయన్స్ క్లబ్ నుండి లయన్స్ ఇంటర్నేషనల్ 320 డి జిల్లా పరిధిలో ఉన్న సిద్దిపేట రీజియన్ లో లయన్ ఆకుల సుఖేందర్ జోన్ ఛైర్పర్సన్ గా చేగుంట, తూప్రాన్ తో పాటు రామాయంపేట లోని రెండు క్లబ్ లకు బాధ్యతలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్న సుఖేందర్ కు గజ్వేల్ లోని ప్రజ్ఞ గార్డెన్లో ఆదివారం నాడు లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ బాబురావు,గవర్నర్ లయన్ అమర్నాథ్ మరియు రీజియన్ చైర్ పర్సన్ లయన్ సంజయ్ గుప్తా చేతుల మీదుగా ఉత్తమ జోన్ చైర్పర్సన్ అవార్డును అందుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఫస్ట్ గవర్నర్ విజయలక్ష్మి ,సెకండ్ గవర్నర్ నరసింహరాజు ,జిల్లా సెక్రెటరీ లైన్ శ్రీనివాస్ రెడ్డి,మర్రి ప్రవీణ్, శ్రీధర్ పరమేశ్వరి చారి, నేతి శ్రీనివాస్ మల్లేష్ గౌడ్ ,లింగమూర్తి ,వీర బ్రహ్మం ,రామ్ రెడ్డి ,శంభుని శ్రీనివాస్, నాగరాజు ,అనిల్ నర్సింలు ,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
వడియారం గ్రామంలో ఇఫ్తార్ విందు.
ముఖ్య అతిథిగా హాజరు అయిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి
చేగుంట,మార్చి,15,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో పవిత్రమైన రంజన్ మాసంసందర్భంగా వడియారం మండల మైనారిటీ నాయకులు మహ్మద్ నదీమ్ హాసన్ అలీ ఆధ్వర్యంలో ఇస్తార్ విందుకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగాదుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నదీమ్ మాట్లాడుతూ మా వడియారం గ్రామంలో మా కుటుంబ పరంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరంగా ఉన్నది. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మేము అందరం ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక్కపొద్దులు ఉంటాము సాయంకాలం నమాజు చేసుకున్న తర్వాత భోజనం చేయడం జరుగుతుంది. ఇలా ఇస్తారు విందు అందరికీ భోజనాలు పెట్టడం నాకు ఆ దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డితోపాటు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఎఎంసి ఛైర్మెన్ తాడేం వెంగళరావు, గ్రామ సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, ఉపసర్పంచ్ లు, ఎఎంసి డైరెక్టర్లు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ మైనారిటీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

ఘనంగా మాన్యవర్ కాన్షీరామ్ 92వ జయంతి వేడుకలు.
•రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
•పటాన్చెరు బీఎస్పీ అధ్యక్షులు పడమటి శ్రీశైలం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
రామచంద్రపురం,మార్చి,15,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు, బహుజన రాజ్యాధికార నిర్మాత మాన్యవర్ కాన్షీరామ్ 92వ జయంతి వేడుకలను పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షులు పడమటి శ్రీశైలం ఆధ్వర్యంలో సోమవారం రామచంద్రపురంలోని ఈఎస్ఐ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా పడమటి శ్రీశైలం మాట్లాడుతూ.. దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కాన్షీరామ్ గారు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సేవా దృక్పథంతో ఈరోజు ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ మరియు డాక్టర్ శైలజ కి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జ్ సుంకు వినయ్ కుమార్, మరో ఇంచార్జ్ దర్శన్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, సీనియర్ నాయకులు సంజీవ, జనార్దన్, సంజీవ్ కుమార్, సురేందర్, బ్యాగరి శ్రీను, థామస్ మరియు ఇతర పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ లను పట్టుకున్న తాసిల్దార్ శివప్రసాద్.
చేగుంట,మార్చి,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం లోని వివిధ దాబాలులో నిర్వహించిన తనిఖీలలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన, వాణిజ్య అవసరాలకు వాడుతున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై స్థానిక తహసీల్దార్లు శివప్రసాద్, ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి , ఆకస్మిక తనిఖీలు చేపట్టి,చేగుంట పట్టణ కేంద్రం లోని శ్రీ కృష్ణ గ్రాండ్ హోటల్ 3, సమ్మెర్ ప్రీతీ షేర్ పంజాబీ ఫ్యామిలీ దాబా 4,తెలంగాణ ఫ్యామిలీ ధాబా లో 03, మక్కారాజ్ పేట్ వై జంక్షన్ ధాబా వద్ద 05,మండలం లో మొత్తం 12 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.చేగుంట పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్ కంపనీలు ఉండడం వల్ల, ఇక్కడ వరస కార్మికులు రావడం వల్ల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, గ్యాస్ రిఫీలింగ్ నిర్వహకులకు, మిర్చి హోటల్ లకు అధిక రూపాయలకు అక్రమ రవాణా చేస్తూ, ప్రజలదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని,వీరి పైన తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తాసిల్దార్ శివప్రసాద్
చేగుంట తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలో గృహ అవసర గ్యాస్ కు ఎటువంటి కొరత లేదు అని,మున్ముందు అవసరములకు కావలసిన గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వారు అన్నారు.ఈ కార్యక్రమం లో ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జై భరత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చేగుంటలో ఎస్ వి మొబైల్స్ షో రూమ్ ని ప్రారంభించినచెరుకు శ్రీనివాస్ రెడ్డి.
చేగుంట,మార్చి,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో ఎస్ వి మొబైల్స్ ఎలెక్ట్రానిక్ షాపును ప్రారంభించిన దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా షాపు యజమా నులు మాట్లాడుతూ ప్రజలకు అతి తక్కువ ధరలలో ఫోన్లు ఫ్రిడ్జ్లు టీవీలు మా షోరూంలో అన్ని రకముల ఎలక్ట్రానిక్ వస్తువులు దొరుకుతాయి జీరో ఈఎంఐ తో ఇవ్వబడును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని అని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డితో పాటు షాపు యజమా నులు శ్రీనివాస్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, చేగుంట ఎఎంసి ఛైర్మెన్ తాడేం వెంగళరావు, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, వడియారం సర్పంచ్ సాయికుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అన్నం ఆంజనేయులు, మోజామిల్, చేగుంట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాశపోయిన మహేష్, చేగుంట వార్డ్ నెంబర్ లు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామ సర్పంచ్ లు ఉపసర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.











