📄 ePaper
Saturday, June 6, 2026
ADS
Home Blog Page 32

హెల్త్ క్యాంపు పరిశీలన : జిల్లా కలెక్టర్.

0

పాపన్నపేట,మార్చి,17,మెదక్ టుడే న్యూస్:పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆశాఖ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. మంగళవారం పాపన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపు ను ఆమె సందర్శించారు.రోగులకు అందిస్తున్న వైద్య సేవల సరళిని పరిశీలించారు. కలెక్టర్ వెళ్లిన అనంతరం జిల్లా వైద్యాధికారి శ్రీరాం హెల్త్ క్యాంపునుపరిశీలించారు.ఈకార్యక్రమంలో మెదక్ డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ వో హరిప్రసాద్,పాపన్నపేట మెడికల్ ఆఫీసర్ అన్వర్,గ్రామ సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ ఉన్నారు.

ఇఫ్తార్ విందులో పాల్గొన్నఎమ్మెల్యే.

0

పాపన్నపేట,మార్చి,17,మెదక్ టుడే న్యూస్: మండల కేంద్రం పాపన్నపేటలో మంగళవారం జరిగిన ఇఫ్తార్ విందులో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు పాల్గొన్నారు. ఓ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. పేద ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే రంజాన్ తోఫా అందజేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్,కిసాన్ సెల్ జిల్లా నాయకులు ప్రభాకర్ రెడ్డి,నాయకులు నరేందర్ గౌడ్ గౌడ్,ఖలీమ్,సద్దామ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

చేగుంట బాలుర ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం.

0

చేగుంట,మార్చ్,17,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని బాలుర ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా 5వ తరగతి విద్యార్థులు డి.ఈ.ఓ.గా ఎల్. కౌశిక్, ఎం.ఈ.ఓ.గా టి విష్ణు హెచ్.ఎం.గా టి.సిద్ధార్థ్ నోడల్ అధికారిగా కుర్ర శాశ్వత్, మౌర్య, మహమ్మద్,రేవంత్ ఉపాధ్యాయులుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి ఉపాధ్యాయులు రాములు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

న్యూ ఎరా స్కూల్ వార్షికోత్సవం.

0


చేగుంట,మార్చ్,17,మెదక్ టుడే న్యూస్:నార్సింగి మండలంలోని న్యూ ఎరా స్కూల్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగాయి. ఈ వేడుకలకు స్కూల్ ప్రిన్సిపాల్ అనురాధ అధ్యక్షత వహించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.డాన్స్ మాస్టర్ గిరిదయ శిక్షణలో అలరించిన విద్యార్థులు ఈ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రముఖ నృత్య దర్శకుడు గిరిదయ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన శిక్షణలో విద్యార్థులు వైవిధ్యమైన పాటలకు స్టెప్పులేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. భక్తిరసంతో సాగిన ‘జై జై గణేశా’,ఎల్లమ్మ’ పాటలతో పాటు, భావోద్వేగపూరితమైన ‘అమ్మ పాడే లాలి పాట’, జానపద గీతాలైన ‘పెద్దిరెడ్డి’, ‘చిట్టి అక్క లయ’,’గంగరాజు’ పాటలకు విద్యార్థులు అద్భుతంగా నర్తించారు. అలాగే ‘కళ్ళజోడు కాలేజీ పాప’,’డి జె టిల్లు’ వంటి పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో స్కూల్ ఉపాధ్యాయులు మస్రత్, కల్పన, రాణి , ప్రవళిక జ్యోతి , అఫియా, మౌనిక, కృషి ఎంతో ఉందని ప్రిన్సిపాల్ కొనియాడారు. విద్యార్థుల క్రమశిక్షణ, వారి ప్రతిభను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వేడుకలను పర్యవేక్షించారు.ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ,చదువుతో పాటు విద్యార్థులలో ఉన్న ఇలాంటి కళాత్మక నైపుణ్యాలను వెలికితీసిన డాన్స్ మాస్టర్ గిరిదయ ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

పీఎం స్వానిధి పై వీధి వ్యాపారలతో అవగాహన అందస్సు.

0

చేగుంట,మార్చ్,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల ప్రజా పరిషత్,చేగుంట మీటింగ్ హాల్ నందు ” పీఎం స్వానిది ” పై వీధి వ్యాపారులతో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇట్టి సదస్సు యందు వీధి వ్యాపారులకు దశలవారీగా 15000 నుండి 50000 వరకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడం జరుగును, రాబోయే 15 రోజులు ఐకేపీ సిబ్బంది ద్వారా సర్వే చేసి వారి వివరాలను సేకరించడం జరుగుతుందని, ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో మెప్మా పీడీ హనుమంత రెడ్డి, ఎల్ డి ఎం చారి, ఎంపీడీఓ చిన్నారెడ్డి, చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఐకేపీ సిబ్బంది, మహిళలు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

క్రికెట్ క్రీడాకారులను అభినందించిన చేగుంట ఉపసర్పంచ్ మహ్మద్ రఫీ.

0

చేగుంట,మార్చి,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట క్రికెట్ క్రీడాకారులు కామారెడ్డి జిల్లా తిప్పాపూర్ గ్రామంలో టోర్నమెంట్లో చేగుంట టీం గెలుపొందడం జరిగినది. ఫైనల్ లో చేగుంట టీం 122 పరుగులు మొదటి బ్యాటింగ్ చేయగా,తిప్పాపూర్ 62 పరుగులు మాత్రమే చేసి ఓడిపోవడం జరిగింది.చేగుంట టీం భారీ విజయం నమోదు చేసుకుంది. గెలుపొందిన క్రీడాకారులను చేగుంట ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫీ అభినందించారు వారు మాట్లాడుతూ చేగుంట కి ముందు ముందు ఇంకా క్రికెట్లో ముందుకు వెళ్లి విజయాలు సాధించాలి మన చేగుంట పేరు ప్రపంచమంతా తెలిసే విధంగా యువకులు ముందుకు సాగాలి యువకులు మత్తుకు బానిస కాకూడదు, మంచి విషయాలు నేర్చుకోండి మంచి పేరు తెచ్చుకోండి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అని వారు యువకులను ప్రోత్సహించడం జరిగినది. ఈ ఫైనల్లో బెస్ట్ బ్యాట్మెన్ ముఖిద్ ప్రకటించడం జరిగినది.చేగుంట టీం కెప్టెన్, మహేష్, ప్రవీణ్,నవీన్, ముఖి ద్ సల్మాన్,మహేష్,వినయ్, శంకర్,బాబు, యశ్వంత్,చింటూ,సాయి,తేజ,చరణ్,క్రీడాకారులు ఆడి గెలవడం జరిగినది గెలిచిన టీముని చేగుంట మండల ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ అభినందించాడు,

లయన్స్ క్లబ్ ఆఫ్ ఉత్తమ క్లబ్ సెక్రటరీ అవార్డుఅందుకున్న.పి.నాగరాజు.

0

చేగుంట,మార్చి,16,మెదక్ టుడే న్యూస్:లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట క్లబ్ సెక్రటరీ పులబోయిన నాగరాజు ఉత్తమ క్లబ్ సెక్రటరీ అవార్డు అందుకోవడం జరిగింది. నిన్న గజ్వేల్ లోని ప్రజ్ఞ గార్డెన్స్ లో జరిగిన రీజనల్ మీట్ లో అవార్డును రీజనల్ చైర్ పర్సన్ సంజయ్ గుప్తా మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు విచ్చేశారు .మొత్తంగా లయన్స్ క్లబ్ కు సంబంధించి 14 అవార్డులు స్వీకరించామని పులబోయిన నాగరాజు తెలిపారు. లయన్స్ క్లబ్ లో ఈ సంవత్సరం 210 ప్రోగ్రాంలు చేసినందుకు గాను ఈ అవార్డులు దక్కడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట సభ్యులు మరియు ముఖ్య అతిథులు పాల్గొన్నారు.

డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్.

0

డ్రైనేజీ పనులు మొదలు పెట్టిన వార్డు సభ్యుడు ఆకుల సుఖేందర్

చేగుంట,మార్చి,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట పట్టణ కేంద్రంలోనీ 14 వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, వార్డు సభ్యుడు ఆకుల సుఖేందర్ పనులు ప్రారంభం చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ చేగుంట పట్టణలో అభివృద్ధిలో భాగంగా సోమవారం 14వ వార్డులో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది వార్డులో మిగతా డ్రైనేజీ పనులు కూడా పూర్తి చేస్తామని అభివృద్ధిలో ప్రజలందరూ సహకారం అందించాలని పట్టణాభివృద్ధికి ఎప్పుడు ముందుంటామని తెలియజేశారు, వార్డు సభ్యులు ఆకుల సుఖేందర్ మాట్లాడుతూ,14 వ వార్డు అభివృద్ధిలో భాగంగా డ్రైనేజీ నిర్మాణానికి సర్పంచ్ అధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది అని వార్డులో అభివృద్ధి పనులకు సర్పంచ్ సహకారం ఉందని తప్పకుండా 14వ వార్డులు అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని వార్డు ప్రజల సహకారం ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి సతీష్ వార్డు సభ్యులు ఆకుల సుఖేందర్, కటిక రవి సాయిబాబా, డీలర్ శ్రీనివాస్ ,కట్ట శ్రీనివాస్ ,సండ్రుగు శ్రీకాంత్, కామిశెట్టి రాములు ,ముత్యం రెడ్డి ,ఒంటరి రాంరెడ్డి,శంకర్ సార్, యాదిరెడ్డి సురేందర్,రవీందర్, నాగార్జున,రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

వడియారంలో మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ సాయి కుమార్ గౌడ్.

0

చేగుంట,మార్చ్,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలోని 11, 12 వార్డుల్లో అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ పనులకు గ్రామ సర్పంచ్ సాయి కుమార్ గౌడ్ పాలకవర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. మురుగు నీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు.గ్రామంలోని ఆయా వార్డుల్లో మురుగు నీటి పారుదల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ ద్వారా మురుగు కాలువల నిర్మాణం చేపడుతున్నామని సర్పంచ్ పేర్కొన్నారు. పనులు పూర్తయితే మురుగు నీరు నిల్వ ఉండకుండా సక్రమంగా బయటకు వెళ్లేలా అవుతుందని దీంతో స్థానికులకు ఉపశమనం కలుగుతుందని చెప్పారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా అవసరమైన మౌలిక వసతుల కల్పనకు గ్రామ పంచాయతీ కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయి కుమార్ గౌడ్,ఉప సర్పంచ్ నాగరాజు, వార్డు సభ్యులు అనిల్ యాదవ్, శ్రవణ్, జనార్ధన్ గౌడ్, పున్నా వినయ్,సభా అంజుమ్, స్వప్నా,గొల్ల శంకర్ ,గౌటే రాజు, నదీమ్,నరేష్ గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సొసైటీ లో భాగస్వాములే-డిమాండ్ వద్దు.

0

.మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్

పాపన్నపేట,మార్చి,16,మెదక్ టుడే న్యూస్: ట్రాన్స్ జెండర్లు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని మెదక్ డిఎస్పీ ప్రసన్నకుమార్ వారికీ సూచించారు. సోమవారం పాపన్నపేట లోని ఓ ఫంక్షన్ హాల్ లో పోలీస్ అధికారులు నిర్వహించిన అవగాహన సమావేశంలో డిఎస్పీ మాట్లాడారు. సొసైటీలో అందరూ భాగస్వాములే అని,వివిధ గ్రామాలు, ఏడుపాయలలో శుభ కార్యాలలో ఇష్టా రీతిన డబ్బులు డిమాండ్ చేయవద్దన్నారు. గౌరవంగా ప్రవర్తించని యెడల చట్టం పరంగా చర్యలు ఉంటాయన్నారు. జిల్లా సంక్షేమ అధికారిణి హేమాభార్గవి,సిఐ జార్జి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.