📄 ePaper
Saturday, June 6, 2026
ADS
Home Blog Page 39

మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ 396వ జయంతి వేడుకలు.

0

అమీన్ పూర్,ఫిబ్రవరి,19,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ సాయి కాలనీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బోయిని బాలమణి బాలరాజ్ మాట్లాడుతూ.భారతీయ ధర్మ రక్షణ కోసం, స్వరాజ్య స్థాపన కోసం పోరాడిన వీర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షత నేటి యువతకు గొప్ప స్ఫూర్తిదాయకం. దేశం కోసం శివాజీ పడ్డ తపనను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి” అని పిలుపునిచ్చారు. యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.అనంతరం బీరంగూడలో సుమారు 200 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీతో బీరంగూడ ప్రాంతమంతా కాషాయమయంగా మారింది. “జై శ్రీరామ్.. జై ఛత్రపతి శివాజీ మహారాజ్” అంటూ యువకులు చేసిన నినాదాలతో ప్రాంతం మొత్తం మారుమోగింది. యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ జయంతి వేడుకలను దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు మరియు భారీ సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.

పార్టీలకతీతంగా తెల్లాపూర్‌లో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు:ఐక్యతను చాటిన గ్రామస్తులు.

0

రామచంద్రపురం,ఫిబ్రవరి,19,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలోని తెల్లాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు సరికొత్త చరిత్రను సృష్టించాయి. శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో రాజకీయ రంగులు పక్కనపెట్టి, పార్టీలకతీతంగా గ్రామ పెద్దలు, యువకులు మరియు వివిధ పార్టీల నాయకులు ఒకే తాటిపైకి వచ్చి ఐక్యతను చాటారు.

ఒకే వేదికపై అన్ని పార్టీల నాయకులు.

శివాజీ మహారాజ్ విగ్రహం లేదా చిత్రపటానికి పూలమాలలు వేసే క్రమంలో ఏ ఒక్క పార్టీ జెండా కనిపించకుండా, కేవలం ‘కేసరి’ జెండాల నీడన అందరూ ఒక్కటయ్యారు. “మహారాజ్ ఏ ఒక్క కులానికో, వర్గానికో చెందినవారు కాదు.. ఆయన భారతజాతి గర్వించదగ్గ వీరుడు” అంటూ నాయకులు స్పష్టం చేశారు. పరస్పర రాజకీయ విమర్శలకు తావు లేకుండా, కేవలం శివాజీ మహారాజ్ ఆశయాల గురించి చర్చిస్తూ వేడుకలను అత్యంత పవిత్రంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మరియు వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ:ఐక్యమత్యమే బలం: “రాజకీయాల్లో మా మధ్య విబేధాలు ఉండవచ్చు, కానీ గ్రామ అభివృద్ధికి మరియు శివాజీ మహారాజ్ వంటి మహాపురుషుల విషయంలో మేమంతా ఒక్కటే” అని చాటిచెప్పారు.
యువతకు మార్గదర్శకం: శివాజీ యూత్ సభ్యులు పార్టీల గోడలు దాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తి గ్రామంలో ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.స్వరాజ్య స్ఫూర్తి: శివాజీ మహారాజ్ స్థాపించిన స్వరాజ్యంలో అందరూ సమానమేనని, ఆ స్ఫూర్తితోనే తెల్లాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

శివాజీ యూత్ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు.

శివాజీ యూత్ ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామంలోని యువతను ఐక్యం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మధ్యాహ్నం గ్రామంలో నిర్వహించిన భారీ ర్యాలీలో యువకులు కత్తులు పట్టుకుని, శివాజీ వేషధారణలో చేసిన ప్రదర్శనలు పౌరుషాన్ని రగిలించాయి. గ్రామంలోని ప్రతి వీధి జై శివాజీ నినాదాలతో మారుమోగింది.ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ గ్రామానికి చెందిన అన్నీ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో యువకులు మరియు మహిళలు పాల్గొని విజయవంతం చేశారు.

కులం పేరుతో మహిళను దూషించిన ఘటనలో నిందితుల రిమాండ్- మెదక్ డి.ఎస్.పి

0

మెదక్,ఫిబ్రవరి,18,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాజకీయ మద్దతు విషయంలో ఏర్పడిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కులం పేరుతో మహిళను దూషించడమే కాకుండా, ఎమ్మెల్యే వాహనంపై రాళ్లతో దాడి చేసి చంపాలనే ప్రయత్నం చెసిన ఘటనకు సంబంధించి నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు మెదక్ డియస్పి డి. ప్రసన్నకుమార్ తెలిపారు.మెదక్ డియస్పి డి. ప్రసన్నకుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.కాంగ్రెస్ పార్టీ మహిళ కార్యకర్త మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి భర్త మల్లికార్జున్ గౌడ్ మరియు అతని అనుచరులు ఆమెను బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే ఆమె ఇందుకు నిరాకరించడంతో, 09-02-2026 తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో మల్లిఖర్జున్ గౌడ్ ఆమెను కులం పేరుతో దూషిస్తూ బూతు మాటలు మాట్లాడినట్లు ఫిర్యాదు అందినట్లు తెలిపారు.ఈ ఘటన విషయమై బాధితురాలు స్థానిక ఎమ్మెల్యే కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆమెను పరామర్శించేందుకు బయలుదేరిన సమయంలో, పిట్లం బేస్ చెరువు కట్ట వద్ద బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మల్లిఖర్జున్ గౌడ్, జీవన్ రావు, వేణు, హబీబ్, మల్లేష్ తదితరులు కలిపి మొత్తం 23 మంది కలిసి ఎమ్మెల్యే వాహనంపై రాళ్లతో దాడి చేసి చంపాలనే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో వాహనానికి నష్టం వాటిల్లడంతో పాటు ఎమ్మెల్యే కి మరియు ఆయన అనుచరులకు గాయాలు అయినట్లు పేర్కొన్నారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై మల్లికార్జున్ గౌడ్ ఛాతిపై చేయి వేసి తోసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గోదాల అఖిలను కులం పేరుతో దూషించిన ఘటనపై సంబంధిత సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డియస్పి గారు తెలిపారు. ఈ కేసులో కొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు.

కారు ప్రమాదంలో బీసీవై పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వనపర్తి రోహిత్ గుప్తా మృతి.

0

మెదక్,కొల్చారం,ఫిబ్రవరి,18,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ పట్టణానికి చెందిన వీవీ సిల్క్స్ యజమాని, బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు వనపర్తి రోహిత్ గుప్తా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.అతివేగంగా వస్తున్న కారు చెట్టును ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున కొల్చారం శివారులో హైదరాబాద్ ప్రధాన రహదారి పై జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, కొల్చారం పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ పట్టణానికి చెందిన వీవీ సిల్క్స్ యజమాని, బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు వనపర్తి రోహిత్ గుప్తా, తన స్నేహితుడు కామారెడ్డి జిల్లాకు చెందిన విజయ్ తో కలిసి విజయవాడలో జరిగిన బీసీవై పార్టీ బీసీ సింహగర్జన కార్యక్రమానికి హాజరై తిరిగి మెదక్ కు వస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ నడుపుతున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టి పక్కనే ఉన్న కట్ చేసిన చెట్టు మొదలు పై నుండి కిందికి వెళ్ళింది. ఈ సంఘటనలో రోహిత్ గుప్త అక్కడికక్కడే మృతి చెందగా విజయ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రున్ని 108 సహాయంతో మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి.

0

అమీన్పూర్,ఫిబ్రవరి,17,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగ రెడ్డి కేసీఆర్ నివాసానికి వెళ్లి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.కేసీఆర్ నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసిన పాండురంగ రెడ్డి , పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాతగా, కోట్లాది మంది ప్రజల ఆశాజ్యోతిగా కేసీఆర్ నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా తుమ్మల పాండురంగ రెడ్డి మాట్లాడుతూ..”తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, దేశానికే ఆదర్శంగా నిలిపిన గొప్ప నాయకుడు కేసీఆర్. వారి మార్గదర్శకత్వంలో పనిచేయడం మాకు గర్వకారణం. అమీన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో వారి సహకారం మరువలేనిది,” అని పేర్కొన్నారు.”కేసీఆర్ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”— తుమ్మల పాండురంగ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్..ఈ కార్యక్రమంలో పాండురంగ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేసీఆర్ కి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

బీరంగూడ ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు: కన్నుల పండువగా వసంతోత్సవం, మహా అన్నపూజ.

0

అమీన్పూర్,ఫిబ్రవరి,17,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

మహారుద్రాభిషేకం.. వసంతోత్సవం

ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మహారుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన వసంతోత్సవం కన్నుల పండువగా సాగింది. రంగురంగుల వసంతాలతో స్వామివారిని ఆరాధిస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.అమావాస్యను పురస్కరించుకుని స్వామివారికి విశేషమైన మహా అన్నపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమాలన్నీ ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్త ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యంత క్రమశిక్షణతో జరిగాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు పూజలు అత్యంత భక్తిభావంతో జరిగాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం, ప్రసాద వితరణలో ఎక్కడా లోటు రాకుండా చర్యలు తీసుకున్నాము.” అని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.ఈ వేడుకల్లో దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలి సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు మరియు భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.

అమీన్పూర్‌లో అంబరాన్నంటిన కేసీఆర్ జన్మదిన వేడుకలు: తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కాటా సునీత రాజేష్ గౌడ్.

0

అమీన్పూర్,ఫిబ్రవరి,17,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలు అమీన్పూర్ డివిజన్ పరిధిలో అత్యంత ఘనంగా జరిగాయి. అమీన్పూర్ గ్రామంలోని కె.ఎస్.ఆర్.జి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కాటా సునీత రాజు గౌడ్ ప్రారంభించారు.

ఘనంగా తెలుగు తల్లి విగ్రహావిష్కరణ

కేసీఆర్  పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద ప్రతిష్టించిన తెలుగు తల్లి విగ్రహాన్ని సునీత గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పేలా, తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీకగా ఈ విగ్రహాన్ని నేడు ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందన్నారు.

తీన్మార్ స్టెప్పులతో హోరెత్తిన అమీన్పూర్

వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సునీత రాజు గౌడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళా కార్యకర్తలతో కలిసి తీన్మార్ స్టెప్పులు వేస్తూ ఉత్సాహంగా కేసీఆర్ గారి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. మహిళల ఆటపాటలతో అమీన్పూర్ గ్రామం పండుగను తలపించింది.

ముఖ్య అతిథి గైర్హాజరుపై వివరణ

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల వారు హాజరుకాలేకపోయారని సునీత గౌడ్ తెలిపారు.

ప్రజా సేవకే కె.ఎస్.ఆర్.జి కార్యాలయం

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమీన్పూర్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కొత్త కార్యాలయం పనిచేస్తుందని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి బిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బిఆర్ఎస్ శ్రేణులు, స్థానిక నాయకులు మరియు అమీన్పూర్ మహిళలు పాల్గొని కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..

కేసీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా 5 మున్సిపాలిటీల విజయం: ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆదర్శ్ రెడ్డి.

0

•కాంగ్రెస్ కుట్రలను చిత్తు చేసిన ప్రజలు: బీఆర్ఎస్ నేతల వెల్లడి

•అభివృద్ధికి పట్టం కట్టిన పటాన్‌చెరు నియోజకవర్గం

రామచంద్రాపురం,ఫిబ్రవరి,16,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ సాధించిన ఘన విజయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కానుకగా అంకితం ఇస్తున్నట్లు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రకటించారు. ఆర్‌సీ పురంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అప్రజాస్వామిక చర్యలకు పాల్పడినా ప్రజలు బీఆర్ఎస్‌కే పట్టం కట్టారని అన్నారు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, అవినీతిపై అభివృద్ధి సాధించిన విజయమిదని పేర్కొన్నారు.హరీశ్ రావు మార్గదర్శకత్వంలో విజయం:
ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరడం సంతోషకరమని, ఈ విజయానికి మార్గదర్శనం చేసిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ సమన్వయంతో, కార్యకర్తల కృషితో ఈ ఫలితం సాధ్యమైందని చెప్పారు. ప్రత్యేకించి ఇస్నాపూర్ మున్సిపాలిటీ విజయం కీలకమని ఆయన అభివర్ణించారు.ఇంద్రేశం: గోసుల శ్రీనివాస్ యాదవ్, మెట్టు కుమార్ యాదవ్.
గుమ్మడిదల: పట్నం మాణిక్యం, గోవర్ధన్ రెడ్డి, తోంట అంజయ్య యాదవ్.గడ్డపోతారం: ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, బాలు రెడ్డి, కాటా రాజు.ఇస్నాపూర్: ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రీకాంత్ గౌడ్, సోమి రెడ్డి, కుమార్ గౌడ్, విష్ణు వర్ధన్, పృథ్వీ రాజ్, సంపత్.జిన్నారం: పాల సాయిరాం, వెంకటేష్ గౌడ్, అమీన్పూర్ మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ యాదవ్.ఈ సమావేశంలో గోసుల శ్రీనివాస్ యాదవ్, పటాన్‌చెరు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, పట్నం మాణిక్యం, బాలు రెడ్డి, గుమ్మడిదల మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, జగన్నాథ్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు, సహకరించిన మీడియా ప్రతినిధులకు ఆదర్శ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

బీరంగూడలో అంబరాన్నంటిన బ్రహ్మోత్సవాలు.. వైభవంగా శివపార్వతుల దివ్య కళ్యాణం.

0

మూడు రోజుల్లో 6 లక్షల మందికి పైగా భక్తుల దర్శనం: ఆలయ ఈవో శశిధర్, చైర్మన్ సుధాకర్ యాదవ్.

  • శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవం.. కన్నుల పండువగా రథోత్సవం
  • విజయవంతం చేసిన అన్ని శాఖలకు, పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు

అమీన్ పూర్,ఫిబ్రవరి,16,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీరంగూడలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఆలయ ప్రాంగణంలో శ్రీ శివపార్వతుల దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు..

ఘనంగా కళ్యాణం – రథోత్సవం:

ఆలయ ప్రధానార్చకులు ప్రహ్లాద్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించగా, ఆలయ ఈవో శశిధర్ దంపతులు, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ దంపతులు మరియు ఆలయ కమిటీ సభ్యులు తమ దంపతులతో కలిసి పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భక్తులందరికీ భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం వేళ శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించిన రథంపై ఉంచి గ్రామ పురవీధుల్లో రథోత్సవం (ఊరేగింపు) అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో శశిధర్ మరియు చైర్మన్ సుధాకర్ యాదవ్ సంయుక్తంగా మాట్లాడుతూ.. “గత మూడు రోజులుగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మూడు రోజుల్లో సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈసారి భక్తుల రద్దీ ఊహించని విధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వంలోని అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.”

పోలీస్ శాఖకు కృతజ్ఞతలు:

బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ వారు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా భారీగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా అహర్నిశలు శ్రమించిన పోలీస్ శాఖ వారికి, అలాగే ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు, స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్స్, వేలాదిమంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అమీన్‌పూర్‌లో వైభవంగా శివపార్వతుల కళ్యాణం.

0

•ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి దంపతులు.

  • ఆధ్యాత్మిక నిలయంగా శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం పాండురంగారెడ్డి.

అమీన్‌పూర్,ఫిబ్రవరి,16,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని శ్రీ దుర్గ భవాని మాత సహిత శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించిన ఈ వేడుకకు అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి – సునీత దంపతులు, నల్ల సత్యనారాయణ రెడ్డి దంపతులు, ఎర్రొల జగన్నాథం దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామి వారి కళ్యాణాన్ని జరిపించారు.ఈ సందర్భంగా మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ..
“లోక కళ్యాణం కోసం శివపార్వతుల వివాహం జరిగిందని, అమీన్‌పూర్ పరిధిలోని ఈ శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం భక్తులందరికీ ఒక గొప్ప ఆధ్యాత్మిక నిలయంగా విరాజిల్లుతోందని కొనియాడారు. మహాశివరాత్రి పర్వదినం అంటేనే అంతా శుభం కలిగించే రోజని, పరమశివుని అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ వారు ఇంతటి వైభవంగా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని, భక్తిభావం వల్ల సమాజంలో శాంతి నెలకొంటుందని” ఆయన పేర్కొన్నారు.పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం సాగింది. కళ్యాణం అనంతరం భక్తులందరికీ భారీ స్థాయిలో అన్న ప్రసాద వితరణ చేపట్టారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి, కృష్ణ, సీనియర్ నాయకులు కొల్లూరు యాదగిరి, ఆర్కల మాణిక్ రెడ్డి, నర్సింలు, నల్ల మాధవ్ రెడ్డి, తుమ్మల ప్రభాకర్ రెడ్డి, మహేంద్ర రెడ్డి, కొండకళ్ళ శ్రీనివాస్, తుమ్మల ప్రతాప్ రెడ్డి మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.