📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
Homeక్రైమ్లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డ సహాయ కార్మిక అధికారి కర్నె...

లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డ సహాయ కార్మిక అధికారి కర్నె చందర్..

📰 Generate e-Paper Clip

(స్టేట్ బ్యూరో)నవంబర్,24,మెదక్ టుడే న్యూస్:

లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డ సహాయ కార్మిక అధికారి కర్నె చందర్
ఖమ్మం జిల్లాలో అవినీతి మరోసారి వెలుగుచూసింది. ఫిర్యాదుదారుని తండ్రి మరణానికి సంబంధించి తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా మంజూరు చేసే అంత్యక్రియల ఖర్చుల నిధి రూ.1,30,000 ఇవ్వడానికి సహాయ కార్మిక అధికారి కర్నె చందర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారి చేతిలో పట్టుబడ్డారు.
ఎలా జరిగింది?ఫిర్యాదుదారుడు తన తండ్రి మరణానంతరం లబ్ధిదారునిగా నామినేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును ఉన్నతాధికారులకు పంపి, మంజూరు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం కోసం కర్నె చందర్ రూ.15,000 లంచం డిమాండ్ చేసినట్లు ACB అధికారులు తెలిపారు.
ఫిర్యాదుదారు చేసిన ఫిర్యాదు మేరకు ఏర్పాటు చేసిన ఉచ్చులో, నేరాన్ని అంగీకరించే స్పష్టమైన ఆధారాలతో కర్నె చందర్ రంగేలో పట్టుబడ్డాడు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular