📄 ePaper
Saturday, May 9, 2026
ADS
HomeNewsజన్మదిన పురస్కరించుకుని చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ.

జన్మదిన పురస్కరించుకుని చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ.

📰 Generate e-Paper Clip


(స్పెషల్ కరస్పాండెంట్)
నెక్కొండ,మే,5,మెదక్ టుడే న్యూస్:మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు ఎస్ఆర్ టెంట్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో 100 రోజుల పనిలో పాల్గొంటున్న కార్మికులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్మికులకు చల్లని మజ్జిగ అందించి ఉపశమనం కలిగించారు.ఈ కార్యక్రమానికి నెక్కొండకు చెందిన గాయత్రి దంత వైద్యశాల డాక్టర్ కొమ్ము శ్రవణ్ కుమార్ తమ తమ్ముళ్లు కొమ్ము అభిలాష్ మరియు కీర్తిశేషులు డాక్టర్ కొమ్ము మహర్షి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి పేరుమీద చలివేంద్ర నిర్వహణకు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, తమ తమ్ముళ్ల జ్ఞాపకార్థం సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments