📄 ePaper
Saturday, May 9, 2026
ADS
HomeNewsఅత్యాషాకు వెళ్ళి ఆర్థికంగా నష్టపోవద్దు,సైబర్ నేరాల నివారణలో అవగాహనే ముఖ్యం-పాపన్న...

అత్యాషాకు వెళ్ళి ఆర్థికంగా నష్టపోవద్దు,సైబర్ నేరాల నివారణలో అవగాహనే ముఖ్యం-పాపన్న పేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్..

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,మే,6,మెదక్ టుడే న్యూస్: అత్యషకు వెళ్ళి ఆర్థికంగా నష్ట పోవద్దని సైబర్ నేరాలు రోజురోజుకుపెరిగిపోతున్నాయని రైతులు, ప్రజలు అప్రమత్తం గా ఉండాలని పాపన్న పేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన పాపన్న పేట సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలకు సైబర్ నేరాలు, దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, ఈ-మెయిల్స్, లింక్‌లను నమ్మవద్దని, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ వంటి గోప్యమైన వివరాలను ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు. అరుగాలం కష్టించి పండించిన ధాన్యం విక్రయించిన డబ్బులు రైతుల ఖాతాల లో ప్రభుత్వం వేయడంతో సైబర్ నేరగాళ్ళు లేని పోనీ లింకులు పంపుతూ, వ్యక్తిగత సమాచారం రాబట్టెందుకు కుతంత్రాలుపన్నుతారనిజాగ్రతగాఉండాలనిసూచించారు . రైతులు తెలిసి తెలియక సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి డబ్బులు పొడగొట్టు కుంటున్నారని. ఎవరైనా
సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని సూచించారు.నకిలీ అకౌంట్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమం లో రైతులు, వివిధగ్రామాల ప్రజలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments