📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
HomeNewsఅక్రమపీడీఎస్ బియ్యం పట్టివేత.

అక్రమపీడీఎస్ బియ్యం పట్టివేత.

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,మార్చి,20,మెదక్ టుడే న్యూస్:అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ (చౌకబియ్యం) పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.శుక్రవారం పాపన్నపేట శివారులో మెదక్ వైపు నుంచి బొడ్మట్ పల్లి వైపు వెళ్తున్న ఓ వ్యాన్ ను తనిఖీ చేయగా అందులో ఉన్న సుమారు 224 క్వింటాళ్ల పీడీఎస్ (చౌకబియ్యం) పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని పంచనామా నిర్వహించారు.వారి ఫిర్యాదు మేరకు బియ్యం తరలిస్తున్న అశోక్, డ్రైవర్ వెంకట్ రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.ఎక్కడైనా పీడీఎస్ బియ్యం రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular