మెదక్, నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శనీయమని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.
అబుల్ కలాం 137ఆజాద్ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో మంగళవారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిబ్బందితో అదనపు కలెక్టర్ నగేష్ అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆజాద్ జయంతి రోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని విద్యాభివృద్ధికి
బాటలు వేసిన మొదటి దేశ విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు.
జర్నలిజంలో అపార అనుభవంతో ఉర్దూ పత్రికను నెలకొల్ పి న సమాజంలో నెలకొన్న రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేశారని చెప్పారు. కేంద్ర విద్యాశాఖా మంత్రిగా పని చేసి విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకవచ్చారని వివరించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య,ఇన్చార్జి మైనారిటీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, కలెక్టరేట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
