నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్
చేగుంట నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్:
చేగుంట మండలం బి కొండాపూర్ గ్రామానికి చెందిన పాలిటి రాజు తల్లి లక్ష్మి మరణించిన విషయం తెలుసుకున్న సండ్రుగు శ్రీకాంత్ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్ధిక సహాయం మరియు 50 కేజీ ల బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు వడియారం ప్రభాకర్, పెద్దపోత చంద్రం,గోరిమిండ్ల శ్రీనివాస్,కత్తుల నరసింహులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
