వెంకటాపూర్: వెంకటాపూర్ గ్రామంలోని అంతర్గత రోడ్లు రోజురోజుకు అధ్వానంగా మారుతూ గ్రామ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో నడిచి వెళ్లడమే కాకుండా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించడం కూడా ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.గ్రామస్థుల ఆరోపణల ప్రకారం, గ్రామ పరిసరాల్లోని కేజ్ విల్లాకు సంబంధించిన భారీ వాహనాల నిరంతర రాకపోకల వల్ల రోడ్లు వేగంగా దెబ్బతిన్నాయని వారు చెబుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్లు దెబ్బతినడం వల్ల అత్యవసర సమయాల్లో వాహనాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, గ్రామంలోకి వచ్చే అతిథులు కూడా ఇబ్బందిపడుతున్నారని స్థానికులు తెలిపారు. రోడ్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు, భారీ వాహనాల రాకపోకల వల్ల నష్టం జరుగుతున్నట్లయితే సంబంధిత అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
కేజివిల్- వాహనాల రాకపోకలతో అధ్వానంగా మారిన వెంకటాపూర్ గ్రామ రోడ్లు.. పట్టించుకోని అధికారులు
RELATED ARTICLES

