📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomeTelanganaదళిత జర్నలిస్ట్‌పై ,మట్టి మాఫియా దారులు దాడి-నిందితులను అరెస్ట్ చేయాలని...

దళిత జర్నలిస్ట్‌పై ,మట్టి మాఫియా దారులు దాడి-నిందితులను అరెస్ట్ చేయాలని డిజిటల్ మీడియా అసోసియేషన్,తాసిల్దార్ కు వినతి పత్రం.

📰 Generate e-Paper Clip

మసాయిపేట,చేగుంట,జూన్,24,మెదక్ టుడే న్యూస్:దళిత జర్నలిస్ట్‌పై దాడి ఘటనను నిరసిస్తూ,నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మసాయిపేట మండల డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు  బుధవారం స్థానిక తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,చుంచు మహేందర్ మసాయిపేట మండలం లో డిజిటల్ మీడియా , జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.ఈ నెల జూన్ 15న ఆయన స్థానిక ‘ అక్రమ మట్టి మాఫియా’దందాపై పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించారు.ఈ కథనంతో మా పైనే వార్త రాస్తావా అంటూ. తీవ్ర ఆగ్రహంతో నిందితుడు పాపన్న వేణుగోపాల్,జర్నలిస్ట్ మహేందర్‌పై కక్ష పెంచుకున్నాడు.21న చొరవాణి ద్వారా అసభ్య పదజాలంతో తీవ్రంగా బెదిరింపులకు పాల్పడ్డాడు. రాత్రి 8:50 గంటల సమయంలో, మసాయిపేట ‘షేరి పంజాబీ డాబా’ వద్ద జర్నలిస్ట్ మహేందర్ ఉండగా, నిందితుడు వేణుగోపాల్ తనతో పాటు సుమారు 15 మంది అనుచరుల తో కలిసి,దాడి చేశారు. బాధితుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడని తెలిసి,కులం పేరుతో దూషిస్తూ, శారీరకంగా తీవ్రంగా గాయపరిచారు.నిన్ను వాహనం టైరు కింద పడేసి చంపేస్తా అంటూ బెదిరించినట్లు బాధితుడు వినతిపత్రంలో పేర్కొన్నాడు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular