📄 ePaper
Saturday, August 1, 2026
ADS
HomeNewsరైతుల కోసం రోడ్ ఎక్కిన రెవిన్యూ, పోలీసు సిబ్బంది.

రైతుల కోసం రోడ్ ఎక్కిన రెవిన్యూ, పోలీసు సిబ్బంది.

📰 Generate e-Paper Clip

చేగుంట,మే,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం లోరైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, (పీపీసీ ) వద్ద లారీల కొరత ఉన్న విషయాన్ని ఆర్డీవో జయ చంద్రా రెడ్డి, తహసీల్దార్ శివ ప్రసాద్ గుర్తించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది సంయుక్తంగా రోడ్డెక్కి చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా చేగుంట గిర్థవర్లు జయ భరత్ రెడ్డి,సుజాత,రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్తున్న లారీలను నిలిపివేసి, (పి పి సి )ల కు మళ్లించడం జరిగింది.ధాన్యం రవాణా ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ చర్యలతో రైతులకు ఊరట లభించడంతో పాటు కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతూ కొనుగోలు వేగంగా జరుగుతున్నాయి అని అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular