📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomeNewsకాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా.

కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా.

📰 Generate e-Paper Clip

6వ వార్డు కౌన్సిలర్ డి. రాజు నాయక్
టీచర్ కాలనీలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం
(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,14,మెదక్ టుడే న్యూస్:షాద్‌నగర్ పట్టణంలోని 6వ వార్డు పరిధిలోని టీచర్ కాలనీలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వార్డు కౌన్సిలర్ డి. రాజు నాయక్ ముందుకు వచ్చారు. గురువారం ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న కాలనీలో స్థానికులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై స్పందించిన ఆయన, వెంటనే పనులు ప్రారంభించి సాటర్‌ను కొత్తగా ఏర్పాటు చేయించారు.పనులు పూర్తయ్యే వరకు స్వయంగా అక్కడే ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేసిన కౌన్సిలర్ రాజు నాయక్‌పై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్డులోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ వంటి సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా సేవలు అందించడం తన బాధ్యత అని రాజు నాయక్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular