చేగుంట,మే,9,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ సంరక్షణకు,భక్తులను ఇబ్బంది పెడుతున్న కోతుల బెడదను నివారించేందుకు స్థానిక శ్రీ వెంకటేశ్వర మెడికల్ హాల్ యాజమాన్యం గొప్ప మనసు చాటుకున్నారు. శ్రీమతి చొల్లేటి సుజాత కృష్ణమూర్తి కుటుంబం ఆలయ భద్రత దృష్ట్యా అవసరమైన రక్షణ ఏర్పాట్లను తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేయించారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా, కోతుల నుండి ఉపశమనం పొందేలా ఈ సౌకర్యాలను కల్పించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఖర్చును శ్రీ వెంకటేశ్వర మెడికల్ హాల్ కుటుంబ సభ్యులే భరించారు. దైవ కార్యాల పట్ల వారు చూపిస్తున్న చొరవను, వారి సేవా గుణాన్ని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. స్వామి వారి కృప ఆ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని వారు ఆకాంక్షించారు.
