చేగుంట,మే,1,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు, కార్మిక దినోత్సవం పురస్కరించుకొని జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా సర్పంచ్ స్రవంతి సతీష్ ఉపసర్పంచ్ కార్మిక సంఘం అధ్యక్షుడు తలారి లింగం, మాట్లాడుతూ 1986లో చికాగో లో 18 గంటల పనిని ఎనిమిది గంటలకు కుదిస్తూ మే ఒకటో తేదీన అమలు చేయడం జరిగిందని దానిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మే 1వ తేదీని కార్మిక దినోత్సవం గా పిలుస్తూ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అని తెలిపారు, కార్మికుల కు కనీస వేతనం ఇవ్వాలని కార్మిక దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని వారు అన్నారు, కార్మికులకు పనికి తగ్గ వేతనం అందివాలని కార్మిక సంఘం నాయకుడు తలారి లింగం,ప్రభుత్వాన్ని కోరారు, ఈ కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, వార్డు సభ్యులు పంచాయతీ కార్మికులు, సంఘం అధ్యక్షులు తలారి లింగం, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, కార్మికులు రాములు, బుదయ, శివమ్మ, లలిత, సాయమ్మ, మనమ్మ,లక్ష్మి, వెంకటేష్, సదుల్లా, కృష్ణ, సువర్ణ, నవీన్, నందు, శ్రీకాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

