📄 ePaper
Friday, September 18, 2026
ADS
HomeNewsనేడు టీఎన్జీవో తాలూకా అధ్యక్షుడు జక్కుల శ్రీనివాసులకు ఘన సన్మానం.

నేడు టీఎన్జీవో తాలూకా అధ్యక్షుడు జక్కుల శ్రీనివాసులకు ఘన సన్మానం.

📰 Generate e-Paper Clip

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,ఏప్రిల్,30,మెదక్ టుడే న్యూస్: టీఎన్జీవో షాద్‌నగర్ తాలూకా అధ్యక్షుడిగా ఎన్నికైన హెల్త్ ఎడ్యుకేటర్ జక్కుల శ్రీనివాసులకు సాయిబాబా కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.
షాద్‌నగర్ పట్టణంలోని 6వ వార్డు పరిధిలో గల సాయిబాబా కాలనీలో, మే 1 (శుక్రవారం) సాయంత్రం 6 గంటలకు శివాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ అధ్యక్షుడు మంగ శంకర్ (ASSG), సమన్వయకర్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి గ్రామ శ్రీనివాసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు, పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో హాజరై జక్కుల శ్రీనివాసులను సన్మానించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular