చేగుంట,ఏప్రిల్,27,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని స్థానిక మెదక్ చౌరస్తా వద్ద పార్టీ మండల అధ్యక్షులు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలన పోవాలి కేసీఆర్ మళ్ళీ సీఎం గా రావాలి అని టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తేవడం జరిగిందని ముఖ్యంగా రైతులకు రైతుబంధు రైతు భరోసా వంటి పథకాలతో రైతులను ఆదుకున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని వారు అన్నారు అబద్ధపు హక్కులతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఎక్కడ కూడా పూర్తి చేయలేకపోయారని వారు తెలిపారు, ఎంతోమంది ఆత్మ బలిదానాలు సబ్బండ వర్గాల ప్రజల ఆందోళనతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిందని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కేసిఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందని వారు గుర్తు చేశారు, ఈ కార్యక్రమంలో చేగుంట మండల బి ఆర్ ఎస్ పార్టీఅధ్యక్షులు నారాయణరెడ్డి , పట్టణ అధ్యక్షులు యాదగిరి ,మహమ్మద్ అలీ, డిష్ రాజు, సోమ సత్యనారాయణ, డాక్టర్ రమేష్ ,పట్నం తానీషా, కుర్ర లక్ష్మీనారాయణ, జర్నల్ సింగ్, వలప మహేష్, కటిక రాజేష్, ఆరిఫ్, మురాడి లక్ష్మణ్, కట్ట శీను, బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగినది
చేగుంట బీఆర్ఎస్ పార్టీ 26 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
RELATED ARTICLES
