📄 ePaper
Wednesday, March 11, 2026
ADS
HomeNewsకొత్తపల్లిలో పోలీసులకవత్తు (ప్లాగ్ మార్చ్)

కొత్తపల్లిలో పోలీసులకవత్తు (ప్లాగ్ మార్చ్)

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,డిసెంబర్,8,మెదక్ టుడే న్యూస్//స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాపన్నపేట మండలం కొత్తపల్లిలో డి.ఎస్.పి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ప్లగ్ మార్చ్ (అవగాహన కార్యక్రమం) నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొత్తపల్లిలో ఎన్నికల నేపథ్యంలో భద్రత చర్యలు ,శాంతి భద్రత పరిరక్షణ కోసం ప్రజలకు విశ్వాసం కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించమన్నారు. అనంతరం ఎన్నికలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డిఎస్ పి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాత్రగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఎన్నికల సందర్భంగా నగదు, మద్యం, బహుమతులు లేదా ఇతర పలోభాలు ఇవ్వడం, తీసుకోవడం చట్టపరంగా నేరమని, ప్రజలు ఎలాంటి ప్రబోవాలకు లొంగకుండా తమ ఓటును సమర్ధవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.అలాగే ఎన్నికల ప్రవర్తన ఉల్లంఘన గురించి వివరించారు.గుంపులుగా తిరగడం, రాత్రివేళ క్యాంపులు నిర్వహించడం, ఓటర్ల పై ఒత్తిడి లేదా ప్రభావం చూపడం ఆఫర్లు, అనాధికారి ప్రచారాలు, పత్యార్థులపై వ్యక్తిగత దూషణాలు చేసే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ జార్జ్, ఎస్ఐలు సారా శ్రీనివాస్ గౌడ్, లింగం, హైమద్, నరేష్ తోపాటు 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments