📄 ePaper
Friday, September 18, 2026
ADS
HomeNewsయూరియా,గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు-జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

యూరియా,గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు-జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,మార్చి,20,మెదక్ టుడే న్యూస్: యూరియా, గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.శుక్రవారం పాపన్నపేట మండల కేంద్రంలోనీ రైతు అగ్రో సెంటర్ ను , ప్యాక్స్ యూరియా స్టాక్ వివరాలను,గ్యాస్ గోదామును పరిశీలించారు.ఎరువులు మందులు రికార్డులను, గ్యాస్ బుకింగ్ రికార్డును పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి ఎరువులు, మందులు, గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు.గ్యాస్ గాని, ఎరువులు మందుల గురించి కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు, వినియోగదారులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular