📄 ePaper
Tuesday, September 15, 2026
ADS
Home Blog Page 79

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితం ఆదర్శనీయమని అదనపు కలెక్టర్‌ నగేష్ అన్నారు..

0

మెదక్, నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితం ఆదర్శనీయమని అదనపు కలెక్టర్‌ నగేష్ అన్నారు.

అబుల్‌ కలాం 137ఆజాద్‌ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో మంగళవారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిబ్బందితో అదనపు కలెక్టర్ నగేష్ అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆజాద్‌ జయంతి రోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని విద్యాభివృద్ధికి
బాటలు వేసిన మొదటి దేశ విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు.
జర్నలిజంలో అపార అనుభవంతో ఉర్దూ పత్రికను నెలకొల్ పి న సమాజంలో నెలకొన్న రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేశారని చెప్పారు. కేంద్ర విద్యాశాఖా మంత్రిగా పని చేసి విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకవచ్చారని వివరించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య,ఇన్చార్జి మైనారిటీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, కలెక్టరేట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0

లోక్ అదాలత్ – ప్రజలకు త్వరగా న్యాయం అందించడానికి విలువైన అవకాశం.

•లోక్ అదాలత్ – ప్రజలకు త్వరగా న్యాయం అందించడానికి విలువైన అవకాశం.

•స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి రాజీయే రాజమార్గం.

•జిల్లా ఎస్ పి. డి. వి. శ్రీనివాస రావు ఐపీ ఎస్.

మెదక్, నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

మెదక్ జిల్లా ఎస్ పి శ్రీ డి. వి. శ్రీనివాస రావు, ఐపీఎస్  ఈ నెల 15వ తేదీన జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్ ను కక్షిదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎస్ పి మాట్లాడుతు,
లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన, తక్కువ ఖర్చుతో, ఇరువైపుల సమ్మతితో సమస్యలను పరిష్కరించుకునే అవకాశం అందుబాటులో ఉందని తెలిపారు.రాజీ చేసుకునే అవకాశమున్న వివిధ రకాల కేసులు
క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, వైవాహిక జీవితం & కుటుంబ సమస్యలకు సంబంధించిన కేసులు, డ్రంకన్ డ్రైవ్, మోటారు వాహన చట్ట ఉల్లంఘనలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం తదితర కేసులు అని వివరించారు.మెదక్ జిల్లా ఎస్ పి ప్రజలకు సూచిస్తూ,చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని, రాజీ అంటే విజయం వైపు దారితీసే నిజమైన మార్గమాని పేర్కొన్నారు.న్యాయశాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎస్ పి సూచించారు.అదే విధంగా జిల్లా పోలీసు అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, కోర్టు విధులు నిర్వర్తించే కానిస్టేబుల్‌లు మరియు ఇతర సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.తమ కేసులు లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవాలనుకునే వారు సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులను సంప్రదించాలని ఎస్ పి సూచించారు.లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరిత న్యాయం అందుతుందని ఎస్ పి అన్నారు.

నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు..

0

(స్టేట్ బ్యూరో) నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు

ఫిలిం నగర్ రోడ్డు నెంబర్–7లో నివాసం ఉంటున్న శివ ప్రసాద్ అనే వ్యక్తి

కొంతకాలంగా తన ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్ళిన శివ ప్రసాద్

మూడు రోజుల క్రితం ఆ తాళం పగలగొట్టి, ఇంట్లో ఆస్తులు, గోడలు ధ్వంసం చేసి, ఇంటిని ఆక్రమించేందుకు యత్నించిన బెల్లంకొండ సురేష్ మరియు ఆయన అనుచరులు,ఇంటికి వచ్చి ధ్వంసమైన వస్తువులను చూసి విషయం తెలుసుకొని, తన సిబ్బందిని బెల్లంకొండ సురేష్ ఇంటికి పంపిన బాధితుడు శివ ప్రసాద్,

శివ ప్రసాద్ సిబ్బందిపై అసభ్యకరంగా దూషిస్తూ దాడికి యత్నించిన బెల్లంకొండ సురేష్,దీంతో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో బెల్లంకొండ సురేష్‌పై ఫిర్యాదు చేసిన శివ ప్రసాద్.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం..

0

(స్టేట్ బ్యూరో) నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం

దేశంలో మరోసారి ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఢిల్లీ సమీపంలో ఉగ్రవాదులకు సంబంధించిన భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచారణలో తీగ లాగగా సంబంధమున్న వ్యక్తుల డొంక కదులుతోంది.

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఆయుధాలు భారీఎత్తున లభ్యమయ్యాయి. హరియాణాలోని ఫరిదాబాద్‌ లో 350 కిలోల అమ్మోనియం నైట్రేట్ సంబంధిత పేలుడు పదార్థాలు(350 Kg of Explosives), ఒక రైఫిల్‌ సహా 20 టైమర్లను స్వాధీనం చేసుకున్నట్టు స్థానిక పోలీస్ కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా వెల్లడించారు. వీటితో పాటు మూడు మ్యాగజైన్లు, పిస్టల్, వాకీటాకీ సెట్‌ను స్వాధీనపరచుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ఉగ్రసంస్థ పోస్టర్లు అంటించడంతో వెలుగులోకి..

శ్రీనగర్‌లో అక్టోబర్ 27న జైష్-ఎ-మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా పలు పోస్టర్లు వెలిశాయి. వీటిని కశ్మీర్‌కు చెందిన వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్ వేసినట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు పసిగట్టారు. సదరు వ్యక్తి ఉత్తర్‌ ప్రదేశ్‌ సహరాన్‌పుర్‌లోని ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతణ్ని గతవారం అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నిందితుడు గతేడాది అక్టోబర్ ముందువరకూ అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విధులు నిర్వర్తించాడని, అక్కడ అతని లాకర్‌ను తనిఖీ చేయగా ఒక రైఫిల్ దొరికిందని తెలిపారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారమే ఫరిదాబాద్‌లో ఈ రికవరీ జరిగినట్టు వెల్లడించారు.

నిందితుడు రాథర్ చెప్పిన ప్రకారం.. ముజామ్మిల్ షకీల్ అనే మరో డాక్టర్ వద్ద కూడా పేలుడు పదార్థాలు, ఆయుధ సామాగ్రి నిల్వ ఉన్నట్టు తేలింది. దీంతో పుల్వామాకు చెందిన షీకల్‌నూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు ఫరిదాబాద్‌లోని ఆల్-ఫలాహ్ ఆస్పత్రి లో పనిచేస్తున్నాడు.

లేడీ డాక్టర్ కారులో..

ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళా వైద్యురాలి కారులో ఒక రైఫిల్, పిస్టల్ బయటపడ్డాయి. ఆమె మందుగుండు సామాగ్రిని నిల్వచేసేందుకు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు.. ఆమెపై విచారణ చేపట్టారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు..

0

(స్టేట్ బ్యూరో) మెదక్ టుడే న్యూస్:

మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్ధం ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని 2008, సెప్టెంబరు 11న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దేశంలోని అన్ని విద్యాసంస్థలు విద్యపై సదస్సులు, వ్యాస రచన, ఉపన్యాస పోటీలు, శిక్షణా శిబిరాలు నిర్వహించబడుతాయి.
అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత, విద్యారంగంపై ఉన్న నిబద్ధతతో గురించి ర్యాలీలు తీస్తూ, నినాదాలు ఇవ్వబడుతాయి.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ (1888 నవంబరు 11 – 1958 ఫిబ్రవరి 22) (Bengali: আবুল কালাম মুহিয়ুদ্দিন আহমেদ আজাদ, ఉర్దూ: ابو الکلام آزاد ) స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. అతను అసలుపేరు “మొహియుద్దీన్ అహ్మద్”, ‘అబుల్ కలాం’ అనేది బిరుదు, ‘ఆజాద్’ కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో ఒకడు. అతను ప్రఖ్యాత పండితుడు, కవి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడు.భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కానగరంలో 1888 నవంబరు 11 న జన్మించాడు. అతని వంశస్థులు బాబర్ రోజుల్లో హేరాత్ (ఆఫ్ఘనిస్తాన్లో ఒక నగరం) కు చెందిన వారు. ఆజాద్ ముస్లిం పండితులు, లేదా మౌలానాల వంశం నుండి వచ్చాడు. అతని తల్లి ఒక అరబ్, షేక్ మహ్మద్ జహీర్ వత్రి, అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆఫ్ఘన్ మూలాల ఉన్న ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

1890 లో అయన తన కుటుంబంతో కలకత్తా వెళ్లాడు. ఆజాద్ సంప్రదాయ ఇస్లామిక్ విద్య అభ్యసించాడు. అతని విద్య ఇంట్లోనే సాగింది. మొదట తండ్రి, పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు. ఆజాద్ మొదట *అరబిక్, పెర్షియన్ నేర్చుకున్నాడు. తరువాత *తత్వశాస్త్రం, రేఖాగణితం, గణితం, బీజగణితం అభ్యసించాడు. స్వీయ అధ్యయనం ద్వారా ఇంగ్లీష్, ప్రపంచ చరిత్ర, రాజకీయాలు నేర్చుకున్నాడు.ఆజాద్ మౌలానా అగుటకు కావలసిన మత శిక్షణ పొందాడు.అతను దివ్య ఖురాన్ పై భాష్యం వ్రాసాడు.
అతను జమాలుద్దిన్ ఆఫ్ఘానీ పాన్-ఇస్లామిక్ సిద్ధాంతాలలో, అలిగర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆలోచనలో ఆసక్తి చూపేవాడు. పాన్-ఇస్లామిక్ భావాలతో అతను ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఈజిప్ట్, సిరియా, టర్కీ సందర్శించాడు.ఇరాక్ లో అతను ఇరాన్ రాజ్యాంగ ప్రభుత్వ స్థాపనకు పోరాటం సల్పుతున్న నిర్వాసిత విప్లవ కారులను కలుసుకున్నాడు. ఈజిప్ట్ లో అతను షేక్ ముహమ్మద్ అబ్దుహ్, సయీద్ పాషా వంటి అరబ్ ప్రపంచంలోని ఇతర విప్లవకారులను కలుసుకున్నారు. అతను కాన్స్టాంటినోపుల్లో యంగ్ టర్క్స్ భావాలతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయాలు అన్ని అతనిని ఒక జాతీయవాద విప్లవవాదిగా రూపాంతరం చెందించాయి.

విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం ఆజాద్, బెంగాల్ కు చెందిన అరవింద ఘోష్, శ్రీ శ్యాం సుందర్ చక్రవర్తి వంటి ప్రముఖ విప్లవకారులను కలుసుకున్నారు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాన్ని చేపట్టారు. విప్లవాత్మక చర్యలు బెంగాల్, బీహార్ లకు పరిమితం అగుట ఆజాద్ కు తెలిసి రెండు సంవత్సరాల లోపల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉత్తర భారతదేశం, బాంబే లాంటి ప్రాంతాలలో రహస్య విప్లవ కేంద్రాలు ఏర్పాటుచేసారు. ఆసమయంలో విప్లవ వాదులు ముస్లింల విప్లవ వ్యతిరేకులుగా భావించసాగారు ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి వ్యతిరేకంగా ముస్లిం కమ్యూనిటీని ఉపయోగిస్తుందని భావించాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన సహచరులను ముస్లింల పట్ల వారి పగను పోగొట్టటానికి ప్రయత్నించాడు
1912 లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూలో ‘ అల్ హిలాల్’ వార పత్రిక ముస్లింల మధ్య విప్లవాత్మక భావాలను పెంచడానికి ప్రారంభించారు. అల్ హిలాల్ మోర్లే-మింటో సంస్కరణల ఫలితంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన సంఘర్షణల తర్వాత హిందూ మతం-ముస్లిం వర్గాల మద్య ఐక్యత కుదుర్చటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ‘అల్ హిలాల్’ అతివాద భావనల ఒక విప్లవాత్మక ధ్వనిగా మారింది. ప్రభుత్వం వేర్పాటువాద భావనల ప్రచారకునిగా “అల్- హిలాల్”ను భావిస్తింది. ప్రభుత్వం దానిని 1914 లో నిషేధించింది.

ఆజాద్ భారతీయ జాతీయ వాదం, హిందూ -ముస్లిం ఐక్యత ఆధారంగా విప్లవాత్మక ఆలోచనలతో మరో పత్రికను “అల్ బలఘ్” ప్రారంభించారు.1916 లో ప్రభుత్వం ఈ పత్రికను కూడా నిషేధించారు, రాంచిలో ఆజాద్ ను నిర్భందించారు. ఆతరువాత మొదటి ప్రపంచ యుద్ధం 1920 తర్వాత విడుదల చేసారు. విడుదల తరువాత ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీలో బ్రిటిష్ వ్యతిరేక భావాలు పెంచారు. ఖలీఫా ఉద్యమం ప్రధాన లక్ష్యం ఖలీఫాను తిరిగి టర్కీ రాజుగా ప్రకటించడం.
గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, గాంధీ, నెహ్రూ ఇతడిని మౌలానా, మీర్-ఎ-కారవాన్‌ అని పిలిచేవాడు.
భారత ప్రభుత్వం మరణానంతరం (1888-1958) 1992లో అతనికి భారతరత్న ఇచ్చి గౌరవించింది.[1]
ఇతడి జన్మదినం నవంబరు 11ను జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు.
మౌలానా ఆజాద్ గాంధీజీ *ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930లో అరెస్టు అయ్యాడు. అతనిని ఒక సంవత్సరంన్నర పాటు మీరట్ జైల్లో ఉంచారు. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ గాంధీజీ ప్రారంభించిన “సహాయ నిరాకరణ” ఉద్యమం ను సమర్ధించి 1920 లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు.ఇతడు ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యేక సెషన్ అధ్యక్షుడు గా (1923) ఎన్నికయ్యాడు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1940 (రాంగడ్) లో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు , 1946 వరకు ఆ పదవిలో ఉన్నాడు.అతను విభజనకు వ్యతిరేకి. విభజన అతని కలలను నాశనం చేసింది. హిందువులు , ముస్లింలు కలసి సహజీవనం చేస్తున్న ఒక ఏకీకృత దేశం బద్దలు అగుట అతని కలను నాశనం చేసి అతనిని విపరీతంగా బాధించింది.

ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్ పి . శ్రీనివాసరావు..

0

ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ . శ్రీనివాసరావు,

మెదక్ నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమంలో బాగంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు.జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీ గారికి తెలియజేశారు. మొత్తం 11 ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కొన్నింటిపై వెంటనే స్పందిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,
ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలి. చట్టబద్ధ మార్గంలోనే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. ప్రజల భద్రత, శాంతి కాపాడటం మరియు వారితో మరింత దగ్గరగా ఉండటం ప్రధాన లక్ష్యం అని అన్నారు.అలాగే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో వేగవంతంగా పరిష్కరిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు.

0

•సమస్య పరిష్కరించాలని
ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు.

మెదక్ నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి

సోమవారం ఐడిఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పరిష్కార నిమిత్తం పంపించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో 75 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అందులో భూ భారతి 34,పెన్షన్14 ,ఇందిరమ్మ ఇండ్లు 5,ఇతర 26 దరఖాస్తులు వచ్చాయన్నారు.
సమస్యలను విని వెంటనే పరిష్కారం చూపించడం లక్ష్యంగా ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.ప్రజావాణికి వచ్చిన 75 మంది దరఖాస్తుదారులతో కలెక్టర్, మీ సమస్య చెప్పండని అడిగి తెలుసుకుని దరఖాస్తు పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను సమయానికి పరిష్కరించడం అన్ని శాఖల బాధ్యత అని ఆయన తెలిపారు. ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా నమోదు చేసి, పరిష్కారం వరకు అధికారులు పర్యవేక్షించాలని,
అవసరమైతే ఫీల్డ్ పరిశీలనలు కూడా చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు, డిఆర్ఓ భుజంగరావు,అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలికార్తీక సోమవారం పురస్కరించుకొని శివాలయంలో లక్ష బిల్వార్చన నిర్వహించిన ఎమ్మెల్యే..

0

ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలి
కార్తీక సోమవారం పురస్కరించుకొని శివాలయంలో లక్ష బిల్వార్చన నిర్వహించిన ఎమ్మెల్యే

పటాన్చెరు నవంబర్ 10
(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి

ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. కార్తీక మాసం పురస్కరించుకొని సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జెపి కాలనీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన లక్ష బిల్వార్చన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. శివయ్య కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు సూర్య ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్..

0

నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్

చేగుంట నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్:

చేగుంట మండలం బి కొండాపూర్ గ్రామానికి చెందిన పాలిటి రాజు తల్లి లక్ష్మి మరణించిన విషయం తెలుసుకున్న సండ్రుగు శ్రీకాంత్ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్ధిక సహాయం మరియు 50 కేజీ ల బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు వడియారం ప్రభాకర్, పెద్దపోత చంద్రం,గోరిమిండ్ల శ్రీనివాస్,కత్తుల నరసింహులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సీడ్ కంపెనీ వారిని నమ్మినందుకు కన్నీళ్లు మిగిలాయి అంటున్న రుక్మాపూర్ రైతులు..

0

సీడ్ కంపెనీ వారిని నమ్మినందుకు కన్నీళ్లు మిగిలాయి అంటున్న రుక్మాపూర్ రైతులు

చేగుంట నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్:

చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో
ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి వస్తుందని రైతులకు సీడ్ కంపెనీ వారు ప్రయోగాత్మకంగా వరి విత్తన రకం 45,47( మగరకం విత్తనం) కంపెనీవారు రైతులకు చెప్పడంతో సుమారు 40 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో విత్తనం వేశారు దిగుబడి రాకపోవడంతో చేతికి వచ్చే సమయంలో పంట ఎండిపోవడం గొలలు రాకపోవడం వల్ల నిండా మునిగారు, ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడి వస్తుందని సీడ్ కంపెనీ వారిని నమ్మినందుకు కన్నీళ్లు మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, ప్రయోగాత్మకంగా దొడ్డు రకం విత్తనమని కంపెనీ వారు చెప్పి ఇచ్చారని రైతులు తెలిపారు పంట కోతకు వచ్చే సమయంలో వారికి కొన్ని పొలాల్లో ఒకటి రెండు పిలకలు మాత్రమే వచ్చాయని మరికొంతమంది రైతుల పొలాల్లో మాత్రం మొత్తం పంట ఎండిపోయిందని రైతులకు తెలిపారు లాభం రావడం దేవుడేరుగు కానీ కనీసం పెట్టిన పెట్టుబడి దిగబడి కూడా రాకపోవడంతో రైతులు కన్నీరు పెట్టారు, ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక రైతులు వ్యవసాయ అధికారులకు చూపిన విత్తనాల ప్రాబ్లమ్ అని తెలిపారు. ఒక్కో రైతు ఎకరాకు సుమారు 25 వేల నుండి 30 వేల వరకు ఖర్చు చేశారు ఈ నకిలీ విత్తనాల పట్ల రుక్మాపూర్ గ్రామంలో 40 మంది రైతులకు సుమారు 20 లక్షల వరకు నష్టం కలిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, విత్తనాలు ఇచ్చిన సీడ్ కంపెనీ సూపర్వైజర్ ఫోన్ లేపడం లేదని కనీసం మళ్ళీ గ్రామానికి కూడా రావడం లేదని ఈ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయామని అధికారులకు పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు పిలుకలు తక్కువగా వస్తున్నాయని సూపర్వైజర్ కు ఫోన్ చేస్తే అతను చెప్పిన మందు కొనుగోలు చేసి పొలానికి పిచికారి చేసామని దీంతో పంట పూర్తిగా మాడిపోయిందని గ్రామానికి చెందిన మేకల శ్రీనివాస్, గణేష్, లక్ష్మీ, రామచంద్రం, మోహన్, అనే రైతులు లబోదిబోమన్నారు సదరు విత్తన కంపెనీ పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రైతుల కోరుతున్నారు.