📄 ePaper
Saturday, June 6, 2026
ADS
Home Blog Page 26

వడియారం ప్రాథమిక పాఠశాలలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం.

0

చేగుంట,ఏప్రిల్,15,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని ప్రాథమిక పాఠశాల వడియారంలో “రోడ్డు భద్రత” నియమాల గురించి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు సిద్ధిరాములు మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపకూడదని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపంచకూడదని మరియు ఒకరు ఇద్దరి కంటే ఎక్కువ మంది వాహనాలపై ప్రయాణించ రాదని పేర్కొనడం జరిగింది. విద్యార్థులు రోడ్డుకు ఎడమ వైపున నడవాలని, జీబ్రా క్రాసింగ్ ఉన్నచోటనే రోడ్డు దాటాలని సూచించారు. “గమ్యం కన్నా ప్రాణం మిన్న” కాబట్టి ఆటోలో గాని ఇతర వాహనాలలో గాని పరిమితికి మించి ప్రయాణించకూడదని, మద్యం సేవించి వాహనాలను నడప రాదని తెలియజేయడం జరిగింది.ఈ అవగాహన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వసంత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి.

0

చేగుంట,ఏప్రిల్,15,మెదక్ టుడే న్యూస్:రోడ్డు వారోత్సవాల్లో భాగంగా పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంట విద్యార్థులు చేగుంట పాఠశాల నుండి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించినప్పుడే, రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతామని, మద్యం తాగి వాహనాలు నడప రాదని, అతివేగం కూడా ప్రమాదాల కారణమవుతాయని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలి వారన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంఈఓ నీరజ, ఎస్సై 2 బిక్య నాయక్, పోలీస్ సిబ్బంది వెంకటేష్,మహేష్,సిద్దు,రవి, ఉపాధ్యాయులు చల్లా లక్ష్మణ్, గర్దాస్ మనోహర్ రావు, రావుల వెంకటేష్, ఉమామహేశ్వరి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదల ఆరోగ్యమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి: బండారి రమేష్-అంబేద్కర్ జయంతి సందర్భంగా షాద్నగర్ అంబేద్కర్ కాలనీలో వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న విశ్వహిందూ పరిషత్..

0

(స్పెషల్ కరస్పాండెంట్):షాద్‌నగర్,ఏప్రిల్,15,మెదక్ టుడే న్యూస్:నిరుపేదల ఆరోగ్య పరిరక్షణే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కి నిజమైన నివాళి అని విశ్వహిందూ పరిషత్ ఆంధ్ర–తెలంగాణ క్షేత్ర సేవా ప్రముఖ్ బండారి రమేష్ అన్నారు.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, షాద్‌నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో విశ్వహిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈసందర్భంగా శిబిరానికి హాజరైన నిరుపేదలకు ప్రముఖ వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు బండారి రమేష్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో మఠమందిర ప్రాంత సహ ప్రముఖ్ మఠం రాజయ్య, భాగ్యవతి, జిల్లా సేవా ప్రముఖ్ వెంపటి నాగేశ్వర్, పట్టణ అధ్యక్షుడు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
వైద్య శిబిరంలో డా. శివానంద్, డా. కార్తికేయ, డా. మల్లిక, డా. బుచ్చయ్య, డా. వెంకటేష్, డా. తిరుపతి, డా. ఆంజనేయులు, డా. పద్మనాభం తదితరులు సేవలందించారు.

మద్యం,సెల్ ఫోన్,అతివేగంతోనే ప్రమాదాలు,పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్.

0

పాపన్న పేట,ఏప్రిల్,14,మెదక్ టుడే న్యూస్:మద్యం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడుపవద్ద ని పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని మల్లంపేట లో
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “అర్రేవ్ అ లీవ్” కార్యక్రమం
నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూవాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపడం వల్ల ప్రాణాలకు రక్షణ కవచంల ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తోపాటు,కారు సీటు బెల్టు ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అతివేగం,మద్యంసేవించివాహనాలునడపడం,హెల్మెట్,సీటుబెల్టుఉపయోగించకపోవడంవల్లజరుగుతున్నాయన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలంపోలీసుల బాధ్యత మాత్రమేకాదనిప్రతివాహనదారుడుప్రతిపౌరుడుబాధ్యతగావ్యవహరించినప్పుడేప్రమాదాలనుగణనీయంగా తగ్గించవచ్చన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలనుకాపాడుకోవాలనివిజ్ఞప్తిచేశారు.వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు రాంగ్ రూట్లో నడపకూడదని తెలియజేశారు. డ్రైవింగ్‌ చేసేటప్పుడు సెల్‌ఫోన్లను ఉప యోగించొద్దని, సెల్ ఫోన్ లోఇతరులతో మాట్లాడకుండా డ్రైవింగ్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పుట్టి పద్మా , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి , వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పోలీసులు ఉన్నారు.

ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ.

0

పాపన్నపేట, ఏప్రిల్ 14, మెదక్ టుడే న్యూస్:మండల కేంద్రం పాపన్నపేటలో మంగళవారం అంబేద్కర్ విగ్రహావిష్కరణ,జయంతి కార్యక్రమం అట్టహసంగా జరిగింది. గ్రామంలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ చేపట్టారు.ఈకార్యక్రమానికి మెదక్ మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హన్మంత్ రావు హాజరై నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జై భీమ్. జై అంబేద్కర్ నినాదాలతో సంస్థాన్ పాపన్నపేట మారుమోగింది. తహశీల్దార్ కార్యాలయం సమీపన ఈ వేడుక కన్నుల పండువగా సాగింది. గ్రామ సర్పంచ్ పావని నరేందర్ గౌడ్,మాజీ ప్రజాప్రతినిధులు గురుమూర్తి గౌడ్,ఆకుల శ్రీనివాస్,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి,అధికార ప్రతినిధి శెట్టి శ్రీకాంత్,సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు నీరుడి వెంకటేశం,సర్పంచులు దండెం సుశీల దుర్గయ్య,శ్రీను,అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు .. దనుబాబు,బాచారం బాబు,ఎర్రోళ్ల రాజు,ప్రశాంత్,నీరుడి ప్రదీప్ కుమార్,హరీష్,కుంటిగారి శివ,రాజు తదితరులు పాల్గొన్నారు .

అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీడీపీఓ శ్రీమతి ఉదయ.

0

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్, ఏప్రిల్ 13: మెదక్ టుడే న్యూస్
షాద్‌నగర్ పరిధిలోని సాయిబాబా కాలనీలో గల 3వ, నెంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని సీడీపీఓ శ్రీమతి ఉదయ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని పలు అంశాలను సవివరంగా పరిశీలిస్తూ, పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు.
తనిఖీలో భాగంగా కేంద్రంలో అమలవుతున్న కమిటీ వ్యవస్థ గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అక్కడి చిన్నారుల ఎత్తు, బరువు వివరాలను స్వయంగా పరిశీలించి, రికార్డులతో సరిపోల్చి చెక్ చేశారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందికి సూచించారు.కేంద్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ ప్రసన్న విధులకు సమయానికి హాజరు కావాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గట్టిగా హెచ్చరించారు.పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై కూడా ఆమె విచారణ జరిపారు. గుడ్లు, బాలామృతం, రేషన్ సరఫరా సక్రమంగా జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకుని, సరైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మౌలిక సదుపాయాల విషయమై కూడా ఆమె పరిశీలన జరిపి, కేంద్రంలో అవసరమైన సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సూచించారు. సరఫరా అవుతున్న ఆహార పదార్థాల నాణ్యత, సరఫరా సంస్థల వివరాలపై కూడా సమాచారం సేకరించారు.ఈ సందర్భంగా సీడీపీఓ శ్రీమతి ఉదయ మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం, పోషణపై ఎటువంటి నిర్లక్ష్యం సహించబోనని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవిష్యత్తుకు పునాది వంటివని, అందువల్ల సిబ్బంది తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలని సూచించారు.స్థానికులు సీడీపీఓ ఆకస్మిక తనిఖీపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి తనిఖీలు తరచుగా నిర్వహిస్తే కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు.

కోఆప్షన్ పదవికి విజయ్ కుమార్ రెడ్డి..!ఇచ్చిన హామీని అధిష్టానం నిలబెట్టుకుంటుందనే నమ్మకంనాలుగు వార్డుల్లో తనదైన చాతుర్యం చూపిన నేతరెడ్డి సామాజిక వర్గం నుంచి తనకే అవకాశం ఉందనిస్పష్టం

0

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,ఏప్రిల్,13,మెదక్ టుడే న్యూస్:
షాద్‌నగర్ మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవుల కోసం పోటీ రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతున్న నేపథ్యంలో, మాజీ కౌన్సిలర్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తనకే ఆ అవకాశం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కోఆప్షన్ పదవి విషయంలో గతంలో పార్టీ అధిష్టానం తనకు రాజకీయంగా సముచిత న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఆ హామీని ఈసారి తప్పకుండా నిలబెట్టుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.ముఖ్యంగా, మున్సిపాలిటీలో ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేకపోవడం తనకు అనుకూలంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆ కోటాలో తనకే అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.గత మున్సిపల్ ఎన్నికల్లో 24వ, 25వ వార్డులతో పాటు 5వ, 6వ వార్డుల్లో పార్టీ విజయానికి తన వంతు కృషి చేశానని విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా 6వ వార్డులో తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో కిరణ్‌ను రాజీ దిశగా తీసుకెళ్లి పార్టీకి అనుకూల వాతావరణం కల్పించానని వివరించారు.అలాగే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన నివాసంలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి సహా పలువురు స్థానిక నాయకులు తన సేవలను గుర్తించి భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
పార్టీలో నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తూ ఎంతోకాలంగా గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నానని, ఈసారి కోఆప్షన్ పదవి ద్వారా తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నల్ల పోచమ్మ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్.

0

అమీన్‌పూర్,ఏప్రిల్,12,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో బీరంగూడ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో వెలసిన శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నందారం నరసింహా గౌడ్ ని శాలువాతో కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర కాలనీ కో-ఆపరేటివ్ సొసైటి ప్రెసిడెంట్ ఎం మల్లేష్ , శ్రీ నల్ల పోచమ్మ ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

అనంతసాగర్ ఏ పి ఎల్ లీగ్ మ్యాచ్ లో మొదటి బహుమతి అందుకున్న బోయిని వారియర్స్.

0

చేగుంట,ఏప్రిల్,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో ఏ పి ఎల్ ప్రీమియం లీగును ప్రారంభించిన సర్పంచ్ ఉప సర్పంచ్ ఈ టోర్నమెంట్ లో అనంతసాగర్ కు చెందిన నాలుగు టీములో బోయిని వారియర్స్ యాదవ్ వారియర్స్ జిటి రాయల్స్ రాయల్ ఇన్న చాలెంజర్స్ సాగిన ఈ టీమ్ లు పోటీలలో ఉత్కంఠగా హోరా హోరిగా సాగిన ఈ మ్యాచ్ ఫైనల్ లో రెండు జట్లు తలపడగా విన్నర్స్ మొదటి స్థానంలో బోయిని వారియర్స్ రన్నర్స్ రెండో స్థానంలో యాదవ్ వారియర్స్ స్థానాన్ని దక్కించుకున్నాయి వీరికి మొదటి బహుమతి సర్పంచ్ చేతులమీరుగా రెండవ బహుమతి ఉప సర్పంచ్ చేతుల మీదుగా అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్ ఉప సర్పంచ్ స్వామి సర్పంచ్ మాట్లాడుతూ యువత క్రీడాల్లో ఎంతో ప్రతిభను చాటరాని చెప్పారు వార్డు మెంబర్లు రమేష్ శ్రీనివాస్ గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు.

కంపెనీ యజమాన్యం ముడి సరుకులు తరలిస్తుండగా అడ్డుకున్న విద్యుత్ అధికారులు.

0

చేగుంట,ఏప్రిల్,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల పరిదిలోని రెడ్డిపల్లి గ్రామ శివారులో గల కారబొన్ రిసోర్సస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రాష్ట్ర విద్యుత్ సంస్థకు 20 కోట్ల రూపాయలు బాకీ ఉండగా , కౌశిక్ గోష్ కంపెనీ లాస్ నడవడం వల్ల హైకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేశారు, హైకోర్టు 31 మార్చ్ 26 నాడు బ్యాంక్ గ్యారంటీతో ఏడు కోట్ల రూపాయలు తో సెటిల్మెంట్ చేసుకోవడానికి తీర్పు ఇచ్చింది, కానీ రామయంపేట్ ఏ డి ఆదయ్య మాట్లాడుతూ మాకు అధికారికంగా ఎలాంటి అనుమతులు రాలేదు అని అన్నారు మీరు ఇలా కంపెనీలో ఉన్న ముడి సరుకులను తరలిస్తుండగా అడ్డుకోవడం జరిగిందని తెలిపారు, కంపెనీ యజమాని కౌశిక్ గోషే మాట్లాడుతూ మాకు హైకోర్టు అనుమతులు ఇవ్వడంతోనే ముడి సరుకులు తరలిస్తున్నామని గత రెండు రోజుల నుండి మెటీరియల్ ఇక్కడనే ఉండిపోయింది లారీలు క్రేన్లు అన్ని ఇక్కడనే ఉన్నాయి దీన్ని అడ్డుకోవడం చట్టరీత్య వ్యతిరేకమని అన్నారు, విషయం తెలుసుకున్న చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి ఎలాంటి గొడవలు జరగకుండా చూశారు.