📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 23

చౌడమ్మగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా పల్లకీ సేవపల్లకీ సేవలో పాల్గొన్న సీఐ సీతారాం దంపతులు.

0

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్, ఏప్రిల్ 25: మెదక్ టుడే న్యూస్:
షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ గ్రామంలోని చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు.శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ “శ్రీరామ జయరామ్, జయ జయ రామ్” నినాదాలతో భక్తులు ఊరేగింపుగా పాల్గొన్నారు. భక్తి గీతాలు, భజనలతో ఆలయ ప్రాంగణం మార్మోగి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు, రాఘవేంద్రాచార్యతో పాటు అర్చకులు ప్రమోద్, సునీల్ పంతులు ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి షాద్‌నగర్ సీఐ కె. సీతారాం దంపతులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీ సేవలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.
మున్సిపాలిటీ 6వ వార్డు మాజీ కౌన్సిలర్ పులిమామిడి లతాశ్రీ శ్రీశైలం గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దేవాలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తించి దేవాలయ కమిటీ సభ్యులు పూలమాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.అలాగే మండువేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేందుకు దాత బొట్టు రమేష్ చల్లని మంచినీటిని అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పులిమామిడి శ్రీశైలం గౌడ్, జి. వసంతరావు, అన్నారం రఘు గౌడ్, గడ్డమీద రమేష్ ముదిరాజ్, శంకర్ గౌడ్, లక్ష్మారెడ్డి, యాదగిరి, తులసిరామ్, రఘునందన్ రెడ్డి, సుప్ప నర్సింలు, నారాయణ, వీర్లపల్లి కృష్ణయ్య, శంకరయ్య, వీఆర్వో బచ్చన్న, సుప్ప కృష్ణయ్య, పి. ప్రవీణ్ గౌడ్, పద్మా వెంకటేష్, జగన్, గోరియా నాయక్, కొత్త సత్తయ్య గౌడ్, శ్రీనివాస్, రమేష్, రవి, హనుమంత్ రెడ్డి, రవీందర్, నరసింహులు, మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య, భజన భక్త బృందం మహిళలు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం భక్తుల ఉత్సాహం, సమన్వయంతో విజయవంతంగా ముగిసింది.

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా,

0

చేగుంట,ఏప్రిల్,24,మెదక్ న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా పంచాయతీరాజ్ అధికారి యాదయ్య హాజరైనారు. వారిని గ్రామ సర్పంచ్ పాలకవర్గ సభ్యు లు శాలువాతో సన్మానం చేసినారు అనంతరం వారు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధిని చేసుకోవాలని అని అన్నారు తను కూడా వడియారం గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరిస్తాన ని హామీ ఇచ్చారు ఒకేసారి అన్ని పనులు కాకుండా ఒకటి ఒకటి చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్, ఉప సర్పంచ్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి విజయపాల్ రెడ్డి,గ్రామపంచాయతీ పలకవర్గం పాల్గొనడం జరిగినది.

ప్రజలకు నీటి సమస్య రాకుండా చూడాలి డిపిఓ యాదయ్య,

0

చేగుంట,ఏప్రిల్,24,మెదక్ టుడే న్యూస్:ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని చేగుంట మండల కేంద్రంలో స్థానిక గ్రామపంచాయతీలో సర్పంచ్ స్రవంతి సతీష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు చేయవలసిన అభివృద్ధి పనులపై చర్చించి ఏయే వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో గ్రామ సభలో చర్చించి వాటిని చేసే విధంగా ప్రణాళిక తయారు చేసుకున్నారు ఈ గ్రామ సభకు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య హాజరై గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పంచాయతీ ఈఓ ద్వారా అడిగి తెలుసుకున్నారు,
గ్రామంలో నీటి సమస్యను ఎక్కడెక్కడ తీర్చారు మ్యాప్ ఆధారంగా ఈవో జిల్లా పంచాయతీ అధికారికి సూచించడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని, వేసవికాలం దృష్టిలో పెట్టుకొని ప్రధానమైనటువంటి సమస్య మంచినీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆ సమస్య రాకుండా చూసుకోవాలని తెలిపారు, పంచాయతీ పాలకవర్గం సమిష్టిగా పనిచేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నారని ఇదేవిధంగా పాలకవర్గం అంతా కలిసి ఉంటూ గ్రామాన్ని అని రంగాలలో అభివృద్ధి పరచాలని ఆయన తెలిపారు గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలు గాని రికార్డుల పరంగా గాని సమస్యల పరిష్కారంలో గాని పాలకవర్గం సమిష్టిగా పనిచేయడం జరుగుతుందని, రాబోయే రోజులు కూడా పాలకవర్గం ఇదే సమిష్టిగా పనిచేస్తూ ఉత్తమ గ్రామ పంచాయతీ ఎంపికయ్య విధంగా వారి పనితనంలో కనిపిస్తుందని ఆయన తెలిపారు, నేటి సమస్య తీర్చేందుకు పాత బోర్లను బ్లెస్సింగ్ చేయిస్తూ అవసరమైతే నూతన బోర్లు వేసి మంచినీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆ సమస్య రాకుండా చూసుకోవాలని తెలిపారు, పంచాయతీ ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి సతీష్ ఉప సర్పంచ్ మహ్మద్ రఫీ తోపాడు పాలకవర్గ సభ్యులు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

పొలంపల్లి గ్రామంలోపంచాయతీ రాజ్ దినోత్సవం పురస్కరించుకొని గ్రామసభ,

0

చేగుంట,ఏప్రిల్,23,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి అధ్యక్షతన పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామసభ నిర్వహించడం జరిగినది. వారు మాట్లాడుతూ గ్రామ సమస్యలు ఏవి ఉన్న ప్రజలు తన వద్దకు వచ్చి చెప్పవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్,ఉపసర్పంచ్ సత్య గౌడ్,ఆశా వర్కర్ లక్ష్మి,అంగన్వాడీ టీచర్ మమత,వార్డు సభ్యులు యాట మౌనిక,కొండి కమలమ్మ, శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ కొండి మల్లేష్, గ్రామ ప్రజలు చింతకాయల కిషన్, గొల్ల శీను, తప్ప భాను, నరసింహులు పాల్గొనడం జరిగినది.

రాంపూర్ గ్రామంలో వడగండ్ల వర్షానికి నష్టపోయిన వరి పంటలను సర్వే చేసిన అధికారులు.

0

చేగుంట,ఏప్రిల్,23,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల రాళ్ల వర్షం వలన నష్టపోయిన రైతుల పొలాలను చేగుంట వ్యవసాయ అధికారులు ఈరోజు పరిశీలన చేయడం జరిగినది నష్టపోయిన రైతుల పేర్లు రాసుకోవడం జరిగింది. అనంతరం అధికారులు మాట్లాడుతూ అకాల రాళ్ల వర్షం వలన రైతుల చేతికి వచ్చిన పంట పూర్తిగా చాలా నష్టం జరిగింది. పై అధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు లు గ్రామ రైతులు పాల్గొనడం జరిగినది.

ప్రవేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

0

ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్

చేగుంట,ఏప్రిల్,23,మెదక్ టుడే న్యూస్:2025- 26 సంవత్సరంలో విద్యాభ్యాసంలో, చేగుంట మండలం చందాయిపేట్ పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాల లో గురువారం నాడు విద్యార్థులకు వారి ప్రగతి పత్రాలను ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్ అందజేశారు,ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క ప్రగతి గురించి వివరిస్తూ మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరినీ అభినందనలు తెలుపుతూ , మా పాఠశాలలో ప్రవేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థులకు మంచి ప్రతిభను కనబరిచినారని, చదువుతోపాటు ఆటలలో, క్విజ్ పోటీలలో, ముందుంటున్నారని తెలిపారు, రానున్న రోజులలో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు తమ పిల్లలను మా పాఠశాల చేర్పించవలసిందిగా కోరారు, నేటి నుండి పాఠశాలకు వేసవి సెలవులు ఉన్నాయన్నారు.

ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేగుంట తహసిల్దార్ కు వినతి పత్రం,

0

చేగుంట,ఏప్రిల్,23,మెదక్ టుడే న్యూస్:జన గణన శిక్షణ ఎన్యుమరేటర్, సూపర్వైజర్ తరగతులను తీవ్రమైన ఎండల దృష్ట్యా ఉదయం పూట మాత్రమే నిర్వహించాలని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేగుంట తహసిల్దార్ శివ ప్రసాద్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కార్యదర్శి చల్లా లక్ష్మణ్, అధ్యక్షులు రావుల వెంకటేష్ , ఎస్ టి యు అధ్యక్షులు కొంతాలపల్లి పెంటా గౌడ్, యుటిఎఫ్ అధ్యక్షులు, బాల పోచయ్య, తపస్ ప్రధాన కార్యదర్శి తంగేళ్లపల్లి కృష్ణమూర్తి,టి ఆర్ టి ఎఫ్ ప్రధాన కార్యదర్శి దేవరాజ్, ఎస్ జి టి యు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, తపస్ జిల్లా నాయకులు దేశపతి కృష్ణమూర్తి,పి ఆర్ టి యు జిల్లా నాయకులు చల్ల రామకృష్ణ, టి పి టి ఎఫ్ జిల్లా నాయకులు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

మాసాయిపేట హత్య కేసులో నలుగురి అరెస్ట్ తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్.

0

చేగుంట,ఏప్రిల్,22,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గల మాసాయిపేట మండలం, మాసాయిపేట గ్రామంలో కల్లు దుకాణం వద్ద జరిగిన గొడవలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను చేగుంట పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 20న రాత్రి మాసాయిపేటలోని కల్లు దుకాణం వద్ద వడ్డెర నగేష్ అనే వ్యక్తి బాటిళ్లు పగలగొడుతుండగా, అదే గ్రామానికి చెందిన గుడ్డి దశరథ్ (49) వారించాడు. దీంతో ఆగ్రహానికి గురైన వడ్డెర శ్రీకాంత్, నగేష్, దుర్గా స్వామి, సందీప్‌లు కలిసి దశరథ్‌పై తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో నిందితుడు శ్రీకాంత్ బండరాయితో దశరథ్ తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే దశరథ్ మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
మృతుని తమ్ముడు సిద్ధిరమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, డీఎస్పీ నేతృత్వంలో విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజలు క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, కల్లు దుకాణాల వద్ద తప్పనిసరిగా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ విచారణలో చేగుంట ఎస్ఐ చైతన్య రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కావాలని వినతి,

0

చేగుంట,ఏప్రిల్,22,మెదక్ టుడే న్యూస్:చేగుంట (నార్సింగి) మండలంలోని వల్లూరు గ్రామం బస్టాండ్ వద్ద సర్వీసు రోడ్లకు బదులు పూర్తి సాయి అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ నేషనల్ హైవే 44 కామారెడ్డి పి డికి గ్రామ ప్రజల కోరిక మేరకు సర్పంచ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామస్తుల సమస్యను పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిప్పిరి వినోద్ కుమార్,ఉప సర్పంచ్ మియాపూర్ రేఖ మధు, పాల్గొనడం జరిగినది.

రాంపూర్ గ్రామం లో వడగళ్ల రాళ్లు వర్షం నష్టపోయిన రైతులు.

0

చేగుంట,ఏప్రిల్,20,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం అకాల రాళ్ళ వర్షం వలన నష్టపోయిన రైతులు చేగుంట వ్యవసాయ అధికారులు రాంపూర్ గ్రామ సర్పంచ్ కాశబోయిన నాగమణి సుదర్శన్ ఉప్పసర్పంచ్ కాశబోయిన సిద్ధిరాములు పాలకవర్గం మరియు గ్రామ పెద్దలు వరి పంటలను పరిశీలించినారు. వారు మాట్లాడుతూ అకాల రాళ్ళ వర్షం వలన రైతుల చేతికి వచ్చిన పంట పూర్తిగా చాలా నష్టం జరిగింది.తక్షణమే జిల్లా అధికారులతో మాట్లాడి నష్ట పోయిన ప్రతి రైతు వివరాలు సేకరించాలని వారికి తెలియజేశారు.