📄 ePaper
Saturday, May 9, 2026
ADS
HomeMedak SPప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం- మెదక్ జిల్లా ఎస్పీ డివి...

ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం- మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు.

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,మే,4,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి, ప్రజావాణిలో బాధితులకు భరోసా కల్పించిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు,ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి నేరుగా విన్నవించుకున్నారు.ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారునితో వ్యక్తిగతంగా మాట్లాడిన ఎస్పీ, వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని అంశాలపై ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్‌లో మాట్లాడి వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రజలకు ఎల్లప్పుడూ పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా అధికారులను సంప్రదించాలని ఎస్పీ తెలిపారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమై ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెరిగిందని ఎస్పీ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments