📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomePOITICAL NEWSవెంకంపల్లి – పాపన్నపేట బ్రిడ్జి మంజూరుపై ఎమ్మెల్యే రోహిత్‌కు పాలాభిషేకం.

వెంకంపల్లి – పాపన్నపేట బ్రిడ్జి మంజూరుపై ఎమ్మెల్యే రోహిత్‌కు పాలాభిషేకం.

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,జూలై,5,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి పి. దుర్గేష్ గౌడ్
వెంకంపల్లి నుండి పాపన్నపేట వరకు బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం లభించడంతో స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పాపన్నపేట మండలంలోని ఆదివారం సుభాష్ చంద్రబోస్ చౌరస్తా లో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ,ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న బ్రిడ్జి మంజూరు కావడం స్థానికులకు ప్రయోజకరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోహిత్ చేసిన కృషి ఫలితంగానే ఈ బ్రిడ్జి మంజూరైందని వారు కొనియాడారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే వెంకంపల్లి గోపాల్ పేట–పాపన్నపేట మధ్య రాకపోకలు మరింత సులభతరం అవడంతో పాటు, వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు తొలగిపోతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్, దోసని సంగమేశ్వర్, ముశెట్టి కిష్టయ్య,శ్రీకాంత్ అప్ప, సుంకరి శివయ్య, కలిమ్,ప్రసాద్, శ్రీశైలం, అంజి, పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు,వార్డు మెంబర్లు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular