సిద్దిపేట జిల్లా, జులై 19, మెదక్ టుడే న్యూస్
మార్కుక్ మండలం పాములపర్తిలో మురికి మోరీలు, తాగునీటి సమస్యలను సర్పంచ్ భవాని బాలకిషన్, ఉపసర్పంచ్ జుట్టు సుధాకర్, పరిశీలించారు. గ్రామంలోని మోరీలు, తీయించి దోమలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లి నీటి సమస్యతో ఇబ్బంది కాకుండా, మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ భవాని, బాలకిషన్, ఊరిలో ఏ సమస్య అయినా నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రజల కోసమే పనిచేస్తామని పేర్కొన్నారు.

