📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomeTelanganaకలెక్టర్ తక్షణమే సంక్షేమ హాస్టళ్ల ను పర్యవేక్షణ చేయలి.

కలెక్టర్ తక్షణమే సంక్షేమ హాస్టళ్ల ను పర్యవేక్షణ చేయలి.

📰 Generate e-Paper Clip

కలెక్టర్ తక్షణమే సంక్షేమ హాస్టళ్ల ను పర్యవేక్షణ చేయలి

విద్యార్థుల గోస వినేదెవరు

బీసీ, ఎస్సీ,ఎస్టీ జిల్లా వేల్పర్స్ కూర్చిలకే పరిమితం

యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జగన్

మెదక్,జులై,7,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)జిల్లాలో హాస్టల్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా చాలా సమస్యలతో పరిమితమవుతున్నాయని యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జగన్ అన్నారుఈ సందర్భంగా ఆయన పది రోజుల పాటు అన్నీ హాస్టలను పర్యవేక్షణ చేయడం జరిగిందని ఇంటర్ జూనియర్ కళాశాల విద్యార్థుల సమస్యలు తెలుసుకొని జగన్ మాట్లాడుతూ,బీసీ హాస్టళ్ల పరిస్థితి దారుణంగా ఉందని వంద మంది వుంటే మూడు బాత్రుమ్స్ మాత్రమే వాడే పరిస్థితి ఉందని ఆయన అన్నారు ఎస్సీ ఎస్టీ హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఉదయం రాగిజావ కూడా పెట్టడం లేదని ఆయన మండిపడ్డారు విపరీతమైన దోమలు కరుస్తున్న వార్డెన్లు పట్టించుకోవడంలేదని ఇప్పటివరకు కూడా దోమతెరలు లేనటువంటి హాస్టళ్ళు ఉన్నాయని ఆయన అన్నారు అపరిశుభ్రంగా హాస్టల్లో వెలబోతున్నాయని ఇంత జరుగుతున్న జిల్లా వేల్పల్స్ మాత్రం కుర్చీలకే పరిమితం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కేజీబీవీ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి గురుకులాల్లో నీళ్ల చారుతో సరిపెడుతున్నారని అన్నారు. జూనియర్ కళాశాలలో విద్యార్థులకు భోజనం అమలు చేయాలని తక్షణమే కలెక్టర్ మేడమ్ అన్నీ హాస్టళ్లను సుడిగాలి పర్యటన గా చేసి సమస్యలు పరిష్కరం చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో యు ఎస్ ఎఫ్ ఐ మెదక్ నగర కార్యదర్శి చరణ్ నాయకులు రాజు, అర్జున్, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular