📄 ePaper
Sunday, September 20, 2026
ADS
HomeNewsచేగుంటలో  చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు.

చేగుంటలో  చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు.

📰 Generate e-Paper Clip

చేగుంట,ఏప్రిల్,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణుల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ రెడ్డిని భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం గాంధీ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంగళరావు మాట్లాడుతూ.. మాజీ మంత్రి ముత్యం రెడ్డి ఆశయ సాధన కోసం శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ మాట్లాడుతూ.. శీనన్న సహకారంతో మండలంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు. మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ,రాబోయే రోజుల్లో శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, డైరెక్టర్లు ముజామిల్, స్టాలిన్, ఆంజనేయులు, చౌదరి శ్రీనివాస్, నాయకులు అయిత పరంజ్యోతి, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు కురుమ లక్ష్మి, సండ్రుగు శ్రీకాంత్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular