📄 ePaper
Friday, July 31, 2026
ADS
Homesangareddy collector-TSఎల్ -నినో ప్రభావం మెదక్ జిల్లాలో రైతులకు అవగాహన సదస్సులు...

ఎల్ -నినో ప్రభావం మెదక్ జిల్లాలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహణ తీరు బెష్ మంత్రి వివేక్ వెంకటస్వామి.

📰 Generate e-Paper Clip

ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు గ్రామ గ్రామానా అవగాహన

సంగారెడ్డి జిల్లా,జూలై,20,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎల్‌నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై సంగారెడ్డి- మెదక్ జిల్లా సమీక్ష సమావేశంతెలంగాణ రాష్ట్రానికి కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు మరియు గనుల శాఖల మంత్రి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులఅధ్యక్షతన జరిగింది. ,టూరిజం శాఖ ప్రధాన కార్యదర్శి ,మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి వాణి ప్రసాద్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పత్రిక్ జైన్ , మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్, ,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ,నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ,ఎమ్మెల్యే నారాయణఖేడ్ సంజీవరెడ్డి,జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు ఎమ్మెల్యే సంగారెడ్డి చింత ప్రభాకర్ , సబ్ కలెక్టర్ నారాయణఖేడ్ ఉమా హారతి అదనపు ఎస్పీ సంగారెడ్డి చైతన్య ఇది జిల్లాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇరిగేషన్, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని.ఈ పరిస్థితుల్లో రైతాంగం,ప్రకృతి సవాళ్లకు అనుగుణంగా అప్రమత్తం చేస్తున్నట్లు.అధిక నీటి వినియోగం ఉండే పంటల జోలికి వెళ్లకుండా, తక్కువ నీటి అవసరాలతో చేతికొచ్చే ప్రత్యామ్నాయ మెట్ట పంటల వైపే దృష్టి సారించాలన్నారు వ్యవసాయ ఉద్యాన వన అధికారుల సమన్వయంతో
అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.ప్రతి రైతుకు భూగర్భ జలాల పరిస్థితి, సాగునీటి లభ్యత, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, వర్షాభావ పరిస్థితులపై స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ,రైతులకు ఎల్
నీ .నో పై అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు కోతుల బెడద ఎక్కువగా ఉండటంవల్ల వాటి నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు పంట నష్టం జరిగిన రైతులకు, నష్టపోయిన రైతులకు, కొంత నష్ట పరిహారం చెల్లించాలన్నారు.25 వేల రూపాయలు ఎకరానికి అందించే విషయాన్ని కేబినెట్లో చర్చించాలన్నారు.ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. సింగూరు డ్యాం మరమ్మతుల కోసం అన్ని నీటిని విడుదల చేయడం జరిగిందని, ఎనిమిది టిఎంసిలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులను, త్రాగునీటిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular