సిఐటియు జిల్లా కోశాధికారి నర్సమ్మ.
కొల్చారం,మే,25,మెదక్ టుడే న్యూస్:ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ అన్నారు. సోమవారం ఆమె పోతంశెట్టిపల్లి, వెంకటాపూర్, కొంగోడు గ్రామాలను సందర్శించి, ఉపాధి పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. ఫణి ప్రదేశాలలో నీడ, నీళ్లు, వైద్య సదుపాయం కల్పించాలన్నారు. పనిముట్లు అందజేయాలన్నారు. సకాలంలో పులి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జూన్ 2న కొల్చారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఆయా గ్రామాల ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
