కొల్చారం,మే,24,మెదక్ టుడే న్యూస్:వరి ధాన్యంతూకం వేసి వారం రోజులు అవుతున్నప్పటికీ లారీలు రావడంలేదని సంగాయిపేటలో రైతులు రోడ్డెక్కారు. సుమారు గంటపాటు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ లారీలు రావడంలేదని ప్రైవేట్ లారీలు ధాన్యం లోడ్ చేయాలంటే 15000 వరకు డిమాండ్ చేస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు నిర్లక్ష్యం మూలంగానే లారీలు సకాలంలో రావడంలేదని లారీ ట్రాన్స్పోర్ట్ లను రైస్ మిల్లు యజమానులను అదుపులో ఉంచాల్సిన అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతుల ఆరోపించారు. వారం రోజుల క్రితం గ్రామం నుండి వెళ్లిన లారీ ఇప్పటికి కాళికాకపోవడం అధికారులు పనితీరుకు నిదర్శనంగా రైతులు పేర్కొన్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కరుణ నేపథ్యంలో అదనపు లారీలను ఏర్పాటు చేసి ధాన్యం ఖాళీ చేయించాలని రైతుల డిమాండ్ చేశారు. కొల్చారం ఎస్ఐ మొహమ్మద్ మొయినుద్దీన్ సంగాయిపేటకు చేరుకుని రైతులకు సముదాయించి ఆందోళన విరమింప చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
లారీల కోసం రోడ్డెక్కిన రైతన్నలు.
RELATED ARTICLES
