చేగుంట,మే,19,మెదక్ టుడే న్యూస్:రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, వివోఏ ల రాష్ట్ర కమిటీ మేరకు మే 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవదిక సమ్మె చేపట్టినట్లు చేగుంట వివోఏ ల సంఘం సభ్యులు ప్రకటించారు మంగళవారం స్థానిక ఎస్ ఐ చైతన్య కుమార్ కి కలిసి సమ్మె నోటీస్ అందజేశారు. తమకు మద్దతు ఇవ్వాలని అన్నారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న విఓఏ లకు : కనీస వేతనం 20,000వేలకు పెంచాలని.ఆరోగ్య హెల్త్ పాలసీ , పదోన్నతులు ఆరోగ్య బీమా, ట్యాబ్ స్వాకర్యంకల్పించాలనివిన్నవించారు .న్యాయమైన డిమాండ్ లు తీర్చాక పోతే వెనక్కి తగ్గేది లేదని తెలిపారు.ఈ కార్యక్రమం లో అవుబోతు స్వామి, భానుప్రయ్, కవిత, హారిక, అరుణ, పద్మ, మనీషా,కృష్ణవేణి,తదితరులు పాల్గొన్నారు.
సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఎస్ ఐ కి వినతి ఇచ్చిన వివోఏలు.
