📄 ePaper
Saturday, May 9, 2026
ADS
HomeNewsమెదక్‌లో జూదంపై పోలీసుల ఉక్కుపాదం-ఐదుగురు అరెస్ట్, రూ. 37,335 స్వాధీనం.

మెదక్‌లో జూదంపై పోలీసుల ఉక్కుపాదం-ఐదుగురు అరెస్ట్, రూ. 37,335 స్వాధీనం.

📰 Generate e-Paper Clip

మెదక్,మే,5,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో బొమ్మా బొరుసు జూదం ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.37,335 నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారు ధర్మకర్ వెంకట్, హుస్సేన్, శేఖర్, రంగారాం, రాజు అని చెప్పారు. ఈ ఘటనపై మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా జూద కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments