📄 ePaper
Saturday, May 9, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలుఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు.

ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు.

📰 Generate e-Paper Clip

వేడుకలో పాల్గొన్న జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు అయిత పరంజ్యోతి

చేగుంట,ఏప్రిల్,26,మెదక్ టుడే న్యూస్:చేగుంట పట్టణ కేంద్రంలో శ్రీ వాసవీ మాత జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యక పరమేశ్వరి దేవాలయం లో నిర్వహించిన కుంకుమ అర్చన కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగాయిఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అలంకరణలు, పుష్పాభిషేకాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు అయిత పరంజ్యోతి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, జిల్లా, మండల ప్రజలందరికీ, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెరగాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలోఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తుడుపునూరి నాగేష్ గుప్తా, రాజేశ్వర్ గుప్తా,చంద్రమౌళి గుప్తా, బాలేశం గుప్తా, రాములు, శంకర్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments