📄 ePaper
Friday, April 24, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలుప్రవేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

ప్రవేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

📰 Generate e-Paper Clip

ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్

చేగుంట,ఏప్రిల్,23,మెదక్ టుడే న్యూస్:2025- 26 సంవత్సరంలో విద్యాభ్యాసంలో, చేగుంట మండలం చందాయిపేట్ పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాల లో గురువారం నాడు విద్యార్థులకు వారి ప్రగతి పత్రాలను ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్ అందజేశారు,ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క ప్రగతి గురించి వివరిస్తూ మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరినీ అభినందనలు తెలుపుతూ , మా పాఠశాలలో ప్రవేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థులకు మంచి ప్రతిభను కనబరిచినారని, చదువుతోపాటు ఆటలలో, క్విజ్ పోటీలలో, ముందుంటున్నారని తెలిపారు, రానున్న రోజులలో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు తమ పిల్లలను మా పాఠశాల చేర్పించవలసిందిగా కోరారు, నేటి నుండి పాఠశాలకు వేసవి సెలవులు ఉన్నాయన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments