చేగుంట,ఏప్రిల్,23,మెదక్ టుడే న్యూస్:జన గణన శిక్షణ ఎన్యుమరేటర్, సూపర్వైజర్ తరగతులను తీవ్రమైన ఎండల దృష్ట్యా ఉదయం పూట మాత్రమే నిర్వహించాలని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేగుంట తహసిల్దార్ శివ ప్రసాద్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కార్యదర్శి చల్లా లక్ష్మణ్, అధ్యక్షులు రావుల వెంకటేష్ , ఎస్ టి యు అధ్యక్షులు కొంతాలపల్లి పెంటా గౌడ్, యుటిఎఫ్ అధ్యక్షులు, బాల పోచయ్య, తపస్ ప్రధాన కార్యదర్శి తంగేళ్లపల్లి కృష్ణమూర్తి,టి ఆర్ టి ఎఫ్ ప్రధాన కార్యదర్శి దేవరాజ్, ఎస్ జి టి యు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, తపస్ జిల్లా నాయకులు దేశపతి కృష్ణమూర్తి,పి ఆర్ టి యు జిల్లా నాయకులు చల్ల రామకృష్ణ, టి పి టి ఎఫ్ జిల్లా నాయకులు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేగుంట తహసిల్దార్ కు వినతి పత్రం,
RELATED ARTICLES
