పాపన్నపేట,మార్చి,17,మెదక్ టుడే న్యూస్:పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆశాఖ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. మంగళవారం పాపన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపు ను ఆమె సందర్శించారు.రోగులకు అందిస్తున్న వైద్య సేవల సరళిని పరిశీలించారు. కలెక్టర్ వెళ్లిన అనంతరం జిల్లా వైద్యాధికారి శ్రీరాం హెల్త్ క్యాంపునుపరిశీలించారు.ఈకార్యక్రమంలో మెదక్ డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ వో హరిప్రసాద్,పాపన్నపేట మెడికల్ ఆఫీసర్ అన్వర్,గ్రామ సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ ఉన్నారు.

