హవేలి ఘనపూర్,ఫిబ్రవరి,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొదలైన నిరసనలు.కేసీఆర్ ని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి హెచ్చరించిన గులాబీ సైన్యం.
పాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ కు సీట్ నోటీసులు పంపడం పై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంకేసీఆర్ జోలికి వస్తే రేవంత్ రెడ్డిని, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నది అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగంపల్లి శేఖర్ రెడ్డి, బయన్న, మద్దెల భాస్కర్ వాడు నెంబర్లు మన్నె.శివకుమార్, లింగంపల్లి శ్రీనివాస్, , రమేష్, కృష్ణ, రామకృష్ణ, బాలు, చాంద్ పాషా, యాదగిరి, పవన్, మరియుకార్యకర్తలు పాల్గొన్నారు.
కూచన్ పల్లీ గ్రామంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.
కేసీఆర్కు సిట్ నోటీస్ అప్రజాస్వామికం.సిట్ పేరుతో కేసీఆర్ను వేధిస్తున్నారు.
రాష్ట్రంలో ఆరాచక పాలక సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
సిట్ నోటీసుల్ని ఖండించిన మాజీ డిప్యూటీ స్పీకర్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి, మెదక్ ఎన్నికల ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్..
మెదక్,ఫిబ్రవరి,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షను తుంగలో తొక్కి ప్రశ్నించిన వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతూ ఆరాచక పాలన సాగిస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి, మెదక్ ఎన్నికల ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ లు ఆరోపించారు.మాజీ సీఎం కేసీఆర్ గారి పై రేవంత్ సర్కార్ అక్రమంగా పెడుతున్న కేసులను నిరసిస్తూ ఆదివారం మెదక్ జిల్లా బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయం నుండి బీఆర్ఎస్ శ్రేణులతో కలసి నల్ల జెండాలు కండువాలు ధరించి బైక్ నిర్వహించి రాందాస్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,సిట్ పేరుతో ఉద్యమ నాయకుడు,మాజీ సీఎం కేసీఆర్ను వేధిస్తున్నారని అన్నారు.కేసీఆర్కు సిట్ నోటీసులను ఖండించారు. సిట్ విచారణ పేరుతో ఉద్యమ నాయకుడిని వేధించడాన్ని వారు తప్పుబట్టారు. కాంగ్రెస్, రేవంత్ సర్కార్ వేధింపులను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మెదక్ లో బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుత ఆందోళనలు చేపట్టామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు సిట్ నోటీస్ జారీ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తీవ్రంగా విమర్శించారు. ప్రజలిచ్చిన ప్రజాస్వామ్య మాండేట్ను గౌరవించకుండా, ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తుల పేరుతో వేధింపులకు పాల్పడటం సరికాదని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరగాలని, రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా సిట్ వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఏ హామీని సక్రమంగా అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్ప్పుదారి పట్టించటానికి ఫోన్ టాపింక్ పేరుతో తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్పై కక్షకట్టి వేధింపులకు పాల్పడుతుందన్నారు. రాష్ట్రంలో రైతులకు సక్రమంగా యూరియా అందించలేని చేతగాని ప్రభుత్వముందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం పోయి, రాక్షస రాజ్యం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, ప్రజల కష్టాలను తీర్చిన వ్యక్తి గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు.10 సంవత్సరాలు కెసిఆర్ గారు తెలంగాణను అభివృద్ధి పథకంలో నడిపించారన్నారు.ఆసరా పింఛన్లు ,కల్యాణ లక్ష్మి షాది ముబారక్, రైతుబంధు కాలేశ్వరం ద్వారా పంటకు నీళ్లు అందించిన గొప్ప వ్యక్తి కెసిఆర్ పై కక్ష సాధింపులు భాగంగా రేవంత్ రెడ్డి అవమానించారని ఆరోపించారు. ఏ తప్పు చేయకపోయినా కాలేశ్వరం పేరుతో ఫోన్ టైపింగ్లతో కుట్ర కుతంత్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఇవన్నీటిని తెలంగాణ ప్రజలు తిప్పి కొడతారు. 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కెసిఆర్ అని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రాలకు గురి చేస్తు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.అక్రమ కేసులు పెడుతున్నారు, ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి, ప్రజల మన్నేలను పొందేలా అభివృద్ధి పైన దృష్టి పెట్టండి, 6 గ్యారంటీలను అమలు చేయండి అని కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీశారు. ప్రజలు ఇప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తారని సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు,జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్య రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు విజయలక్ష్మి,మాయ మల్లేశం,భీమరి కిషోర్, నాయకులు జీవన్ రావు, సురేందర్ గౌడ్,జుబెర్ అహ్మద్,తుమ్మలక్ష్మీనారాయణ,ఇస్మాయిల్,సంతోష్,నరేష్, చంద్రశేఖర్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు వివిధ వార్డుల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కేసీఆర్కు నోటీసులు ప్రతీకార రాజకీయాలకు పరాకాష్ట.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.
కేసీఆర్ని టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండమే.
మాజీ డిప్యూటీ స్పీకర్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి, మెదక్ ఎన్నికల ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్.
మెదక్,ఫిబ్రవరి,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సీఎం రేవంత్రెడ్డి విచారణ పేరుతో ప్రతీకార రాజకీయాలకు తెర తీశారని మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి, మెదక్ ఎన్నికల ఇన్చార్జి,మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బిఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి డైవర్షన్ పోలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.ఇందులో భాగమే తల తోక లేని ఫోన్ ట్యాపింగ్ కేసు అని పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు.ఈ క్రమంలోనే కేసీఆర్కు సిట్ పేరుతో నోటీసులు జారీ చేశారని తెలిపారు.చావు నోట్లో తలపేట్టి తెలంగాణ సాధించి,దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని అన్నారు. రేవంత్రెడ్డి ఎన్ని విష రాజకీయాలు చేసినా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప నేత కేసీఆర్ అని స్పష్టంచేశారు. నోటీసులు, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ అగ్ని గుండంలా మారి ఆ నిప్పుల సెగకు కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోతుందన్నారు. కేసీఆర్ ఏ తప్పు చేయలేదని, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూడడంతో యూరియా దొరకని పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా జరగాలి, కానీ మెదక్లో బిఆర్ఎస్ నాయకులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మల్కాజిగిరి నుంచి గుండాలని రప్పించి వార్డులో ప్రచారం చేయిస్తూ మా పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య బద్దంగా, పక్షపాతం లేకుండా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ చూడాలని చెప్పారు. ఐదవ వార్డ్ లో మామిళ్ళ ఆంజనేయులు, నాయకులు శ్రీనివాస్ ప్రచారానికి వెళితే …మల్కాజ్గిరి నుంచి వచ్చిన గుండాలు కారులో వెంబడించి భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు.ఈ మీడియా సమావేశంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి. జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ. ఆంజనేయులు,నాయకులు జుబెర్ అహ్మద్,గౌస్ ఖురేషి,సున్నం నరేష్ శంకర్,మహిళా నాయకులరాలు రాధా తదితరులు పాల్గొన్నారు.
బీరంగూడ అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సాయి భజన మండలి భారీ విరాళం.
అమీన్ పూర్, ఫిబ్రవరి,01,
(మెదక్ టుడే) న్యూస్: ప్రతినిధి.భక్తికి నిలయమైన బీరంగూడ గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ మహాత్కార్యంలో భాగంగా, ఆర్.సి.పురం మల్లికార్జున నగర్కు చెందిన సాయి భజన మండలి సభ్యులు తమ వంతు సహాయంగా 1,11,116/- (అక్షరాలా లక్షా పదకొండు వేల నూట పదహారు రూపాయలు) విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.ఈ సందర్భంగా సాయి భజన మండలి ప్రతినిధులు మాట్లాడుతూ.. “మన బీరంగూడ గుట్ట పైన అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఆలయ కమిటీ సభ్యుల కృషి అభినందనీయం. గ్రామస్తులందరి సహకారంతో ఆలయం త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నాము,” అని తెలిపారు.విరాళాన్ని స్వీకరించిన అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. “స్వామివారి కృపతో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించాం. నవంబర్ 3న స్థానిక ఎమ్మెల్యే గారు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, మాజీ చైర్మన్లు, కౌన్సిలర్లు మరియు ఎంపీపీల సహకారంతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆలయ నిర్మాణానికి ఉదారంగా ముందుకు వస్తున్న సాయి భజన మండలి బృందానికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము,” అని పేర్కొన్నారు.ప్రతి ఒక్క భక్తుడు ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని, ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సాయి భజన మండలి సభ్యులు, శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ మెంబర్స్, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చేగుంట గ్రామ పంచాయతీ పాలకవర్గం అధ్వర్యంలో స్వచ్ఛప్రగతికి స్వీకారం.
చేగుంట, ఫిబ్రవరి,1, మెదక్ టుడే న్యూస్:చేగుంట పట్టణంలోని గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదే స్వచ్ఛప్రగతి ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం అధ్వర్యంలో శ్రీకారం చేయడం జరిగింది ఈ స్వచ్ఛప్రగతి ప్రతి నెల 01 వ తేదీ మరియు 15 వ తేదీ నాడు చేగుంట పట్టణంలో మక్కారాజు పేట రోడ్ లో ఉన్న డా: అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి స్వచ్ఛప్రగతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్,ఉప్ప సర్పంచ్ మహ్మద్ రఫీ,వార్డు సభ్యులు వంశీ,యేలామేశ్వర్ ,సుఖేందర్, ఉదయ్ రాజు, మహ్మద్ అరీఫ్,తలారి లింగం,కట్ట శ్రీనివాస్ ,ఆంజనేయులు, శ్రీనివాస్,విష్ణు, శ్రీకాంత్ , గడియలు ప్రసాద్,దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

చేగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దూప ద్వీప నైవేద్యానికి ప్రతినెల 8100 రూపాయలు ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్.
నేను పదవిలో ఉన్నంతకాలం ప్రతి నెల 8,100 ఇస్తాను ఉపసర్పంచ్.
చేగుంట,ఫిబ్రవరి,1,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో ని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ క్ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి దూప ద్వీప నైవేద్యానికి ప్రతి నెల 8100 రూపాయలు అందిస్తానని చెప్పారు. వెంకటేశ్వర స్వామికి నేను ఉప సర్పంచ్ గా ఉన్నంతకాలం ప్రతి నెల ఒకటవ తారీఖు నాడు ఎనిమిది వేల ఒక వంద రూపాయలు ఇస్తాను అని హామీ ఇచ్చారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంతులు వాసుదేవ శర్మ, ఉపసర్పంచ్ రఫీ,శంకర్,శేఖర్,తదితరులు పాల్గొన్నారు
వనదుర్గమ్మ పల్లకీ సేవా.
పాపన్నపేట,ఫిబ్రవరి,1, మెదక్ టుడే న్యూస్:ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం. ఆదివారం మాఘ పౌర్ణమి పురస్కరించుకొని వనదుర్గా క్షేత్రంలో పల్లకీ సేవా వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాన్ని పల్లకీ లో ప్రతిష్టించి వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అర్చకులు శంకర్ శర్మ అమ్మవారి కీ ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీ ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దుర్గమ్మ ను దర్శించుకున్నారు.

మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు సోమవారం నిర్వహించే ప్రజావాణివాయిదా.జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్,జనవరి,31,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఎన్నికలు పూర్తయ్యే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ కార్యాలయంతో పాటు, ఎన్నికలు జరుగు మున్సిపాలిటీ ఏరియాలలో తాత్కాలికంగా వాయిదా చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.జిల్లా యంత్రాంగం మొత్తం పురపాలక ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఎన్నికల జరుగు మున్సిపాలిటీ ఏరియాలలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ కార్యాలయంతో పాటు, మున్సిపాలిటీ ఏరియాలలో కూడా యథావిధిగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి మండలాలలో ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందని ప్రజల వినియోగించుకోవాలని వెల్లడించారు.ప్రజలు ఈ విషయాన్ని గమనించి యంత్రాంగానికి సహకరించాలని ఆయన సూచించారు.
డివిజన్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
శ్రీకృష్ణ నగర్ కాలనీ ముఖద్వారం ప్రారంభం – దాతల సహకారం అభినందనీయం
అమీన్పూర్,జనవరి,31,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.అమీన్పూర్ సర్కిల్ పరిధిలో నూతనంగా ఏర్పడిన అమీన్పూర్ మరియు బీరంగూడ డివిజన్ల సమగ్ర అభివృద్ధికి తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం బీరంగూడ డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన కాలనీ ముఖద్వారాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ కాలనీ ముఖద్వారాన్ని శ్రీమతి ఎలగడి నర్సమ్మ మరియు దాస్ యాదవ్ దంపతులు తమ సొంత నిధులతో అత్యంత సుందరంగా నిర్మించారు. కాలనీపై ఉన్న మక్కువతో, ప్రజా ప్రయోజనం కోరి వారు చేసిన ఈ విరాళాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.ప్రభుత్వంతో పాటు కాలనీల అభివృద్ధిలో శ్రీమతి ఎలగడి నర్సమ్మ – దాస్ యాదవ్ వంటి దాతలు ముందుకు రావడం అభినందనీయం. సొంత నిధులతో కాలనీ ముఖద్వారాన్ని నిర్మించి ఆదర్శంగా నిలిచిన వీరి సేవలు ఎంతో గొప్పవి” అని ఎమ్మెల్యే వారిని ప్రత్యేకంగా అభినందించారు.లక్ష్యం: ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా తమ పాలన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మాజీ కౌన్సిలర్స్ కృష్ణ, ఉపేందర్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మాది కో ఆప్షన్ నెంబర్ తలారి రాములు,చంద్రశేఖర్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కొల్లూరు యాదగిరి, జనార్దన్ రెడ్డి, ప్రసాద్ రావు, మహేష్ ముదిరాజ్, ఇతర మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు శ్రీకృష్ణ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












