📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 17

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన బిజెపి నాయకులు.

0

చేగుంట, మే, 9, మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆదేశానుసారం మండలంలోని చందాయిపేట గ్రామానికి చెందిన లబ్ధిదారుడు బండ రాజు కి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కును శనివారం బిజెపి నాయకులు అందజేశారు. అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన రాజు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా, ఎంపీ చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం అందించే సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల బిజెపి ప్రధాన కార్యదర్శి జూకంటి శోభన్, చందాయిపేట బూత్ బిజెపి అధ్యక్షుడు బుడ్డ రమేష్, బిజెపి ప్రధాన కార్యదర్శి శిలబలిష్, మాజీ బూత్ అధ్యక్షుడు వంశీ గౌడ్, ఉపాధ్యక్షుడు శాలిపేట స్వామి, సంఘని రాజు తదితరులు పాల్గొన్నారు.

విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట..

0

తెల్లాపూర్ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం,మే,9,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి,సమాజ నిర్మాణంలో విశ్వబ్రాహ్మణుల సేవలు అత్యంత ప్రశంసనీయమని..వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలో గల శ్రీ శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సోమిరెడ్డి, మల్లారెడ్డి, దేవేందర్ యాదవ్, లచ్చి రామ్ నాయక్, బాబ్జి, శ్రీశైలం, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం: ముఖ్య అతిథిగా హాజరైన ఆదర్శ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి.

0

రామచంద్రపురం,మే,9,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్ డివిజన్‌లో శ్రీ శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆలయానికి చేరుకున్న ఆదర్శ్ రెడ్డికి నిర్వహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.అనంతరం ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతిని, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. మన సాంప్రదాయ విలువలను కాపాడుకోవడంలో ఇటువంటి ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. భక్తి భావం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు జగనాథ్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, విశ్వకర్మ సంఘం సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని కళ్లారా తిలకించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంఘ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సెన్సెస్-2027 ఇండ్ల గణనకు ప్రజలు సహకరించాలి-చేగుంట తాసిల్దార్ శివప్రసాద్ పిలుపు.

0

చేగుంట,మే,9,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, ‘సెన్సెస్-2027’ మొదటి దశలో భాగంగా మే 11 నుండి ప్రారంభం కానున్న ఇండ్ల గణన ప్రక్రియపై చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో శనివారం గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ శివప్రసాద్ మాట్లాడుతూ, గణన కోసం వచ్చే ఎనిమరేటర్లకు ప్రజలు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఈ ప్రక్రియకు ప్రభుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా గణన సమయంలో గోప్యతా నియమాల దృష్ట్యా ఆధార్ నంబర్ గాని, ఓటీపీ గాని చెప్పవలసిన అవసరం లేదని, కేవలం ఇంటి నంబరు, ఇంటికి సంబంధించిన వివరాలు మాత్రమే తెలపాలని సూచించారు. అలాగే ప్రజలు స్వయంగా ‘సెల్ఫ్ ఎనిమరేషన్’ చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ భూమేష్, సర్పంచ్ నర్సింహా, ఉపసర్పంచ్ స్వామి, పంచాయతీ సెక్రటరీలు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా, మండలంలోని ప్రతి ఓటరు తమ ఓటర్ మ్యాపింగ్, ప్రోజెనీ వివరాలను తప్పనిసరిగా పూర్తి చేయించుకోవాలని తాసిల్దార్ సూచించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం బూత్ స్థాయి అధికారుల ( బి ఎల్ వో ) ద్వారా నిర్వహించబడుతోందని, వివరాలు అందించని యెడల భవిష్యత్తులో ఓటు తొలగించబడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, పత్రికా మిత్రులు ఈ విషయాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

చేగుంట లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు.

0

చేగుంట,మే,9,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ సంరక్షణకు,భక్తులను ఇబ్బంది పెడుతున్న కోతుల బెడదను నివారించేందుకు స్థానిక శ్రీ వెంకటేశ్వర మెడికల్ హాల్ యాజమాన్యం గొప్ప మనసు చాటుకున్నారు. శ్రీమతి చొల్లేటి సుజాత కృష్ణమూర్తి కుటుంబం ఆలయ భద్రత దృష్ట్యా అవసరమైన రక్షణ ఏర్పాట్లను తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేయించారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా, కోతుల నుండి ఉపశమనం పొందేలా ఈ సౌకర్యాలను కల్పించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఖర్చును శ్రీ వెంకటేశ్వర మెడికల్ హాల్ కుటుంబ సభ్యులే భరించారు. దైవ కార్యాల పట్ల వారు చూపిస్తున్న చొరవను, వారి సేవా గుణాన్ని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. స్వామి వారి కృప ఆ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని వారు ఆకాంక్షించారు.

చేగుంటలో ఘనంగా మన్యం వీరుడు అల్లూరిసీతారామరాజు వర్ధంతి:

0

పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు

చేగుంట,మే,7,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రఫీ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లా పాండ్రంగి (జూలై 4, 1897). జన్మించారు. ఆయన గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అగ్గిపిడుగులా పోరాడిన గొప్ప దేశభక్తుడు అల్లూరి అని కొనియాడారు. కేవలం 25 ఏళ్ల చిన్న వయసులోనే వేలాది మంది గిరిజనులను ఏకం చేసి, విల్లులు, బాణాలు, నాటు తుపాకులతో బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ వారి వెన్నులో వణుకు పుట్టించారని గుర్తు చేశారు. 1924 మే 7న బ్రిటిష్ వారు ఆయన్ను మోసపూరితంగా పట్టుకుని కాల్చి చంపిన రోజని, అందుకే ఏటా ఈ రోజున ఆయన బలిదానాన్ని స్మరించుకుంటామని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ సైతం అల్లూరి సేవలను గుర్తించి భీమవరంలో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సండ్రుగు సతీష్, గ్రామ పాలకవర్గ సభ్యులు సాయిబాబా, సుఖేందర్, రవి, గ్రామస్తులు లింగం, శ్రీను, సోమ సత్యనారాయణ, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

మాజీ పోలీసు అధికారుల సమక్షంలో ఘనంగా రాహుల్ – అపూర్వ వివాహ విందు.

0

(స్పెషల్ కరస్పాండెంట్)
హైదరాబాద్,మే,7,మెదక్ టుడే న్యూస్:
మాజీ అదనపు పోలీసు అధికారి యోహాన్ కుమారుడు రాహుల్ మరియు అపూర్వల వివాహ విందు కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని శౌర్య కన్వెన్షన్ లో అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు, మాజీ పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వేడుకకు 1976 సంవత్సరపు బ్యాచ్‌కు చెందిన మాజీ ఉప నిరీక్షకులు, మాజీ పోలీసు అధికారులు విశేషంగా హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మాజీ సహచరులు ఆత్మీయంగా కలుసుకొని ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమం ఆప్యాయ వాతావరణంలో కొనసాగింది.
ఈ వివాహ విందుకు మాజీ అదనపు పోలీసు అధికారులు సత్యనారాయణ, విజయ్ సింగ్, సంతోష్ కరుణాకర్, హరిచందర్, రాజరత్నం, సీహెచ్ రాజయ్య, బి. నరసింహులు, రంగారావు, హీరామంజి, పండరీనాథ్, వజ్రలింగం, మాజీ ఉప పోలీసు అధికారులు పీఎస్‌ఎస్‌పీ బాబు, రామకిషన్ రావు, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ అదనపు పోలీసు అధికారి విజయ్ సింగ్ మాట్లాడుతూ, “రాహుల్ – అపూర్వల దాంపత్య జీవితం ఆనందంగా, ఆదర్శవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. పరస్పర గౌరవం, ప్రేమాభిమానాలు, కుటుంబ విలువలతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకుంటారు” అని ఆశీర్వదించారు.
అలాగే సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు మాట్లాడుతూ, “కుటుంబ వేడుకలు బంధాలను మరింత బలపరుస్తాయి. నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.
వివాహ విందు సందర్భంగా అతిథులకు ప్రత్యేక భోజన వసతులు ఏర్పాటు చేయగా, హాజరైన వారంతా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యుల సమన్వయంతో కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది.

జయలక్ష్మి నగర్‌లో తైక్వాండో అకాడమీ ప్రారంభం.

0

ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ యువ నాయకులు తుమ్మల రుష్వంత్ రెడ్డి

అమీన్ పూర్,మే,6,(మెదక్ టుడే ) న్యూస్ ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ డివిజన్ పరిధిలోని జయలక్ష్మి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన తైక్వాండో అకాడమీ గురువారం ఘనంగా ప్రారంభమైంది. మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమీన్‌పూర్ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు తుమ్మల రుష్వంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అకాడమీని ప్రారంభించారు.ఈ సందర్భంగా రుష్వంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి సమాజంలో ఆత్మరక్షణ విద్యల అవసరం ఎంతో ఉందని, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు తైక్వాండో వంటి క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను అలవరుస్తాయని పేర్కొన్నారు. స్థానికంగా ఇలాంటి అకాడమీలను ఏర్పాటు చేయడం వల్ల యువతలో ఉన్న ప్రతిభను వెలికితీయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తైక్వాండో అకాడమీ మాస్టర్ హేమంత్, బోయిని సందీప్, సుశాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, అకాడమీ నిర్వాహకులు, స్థానిక నాయకులు మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

అమీన్‌పూర్‌లో సీలింగ్ భూముల పరిశీలన: ఆక్రమణలు ఉంటే కూల్చివేతలు తప్పవు – ఎమ్మార్వో వెంకటేష్.

0

అమీన్‌పూర్,మే,6,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండల పరిధిలోని ప్రభుత్వ సీలింగ్ భూములను రెవెన్యూ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని సర్వే నంబర్లు 1042, 1043 లో ఉన్న సీలింగ్ భూములను అమీన్‌పూర్ తహసీల్దార్ వెంకటేష్, ఆర్.ఐ సంగీత, సర్వేయర్ మరియు ఇతర రెవెన్యూ సిబ్బందితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో వెంకటేష్ మాట్లాడుతూ గతంలోనే నోటీసులు: సదరు సర్వే నంబర్లలోని భూములపై గతంలోనే ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎమ్మార్వో తెలిపారు.సర్వే నిర్వహణ: ఈ భూములకు సంబంధించి త్వరలోనే పూర్తిస్థాయి సర్వే ప్రక్రియను ముగించి, హద్దులను నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
కఠిన చర్యలు: సర్వే పూర్తయిన వెంటనే పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని ఎమ్మార్వో హెచ్చరించారు.ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, ఎవరూ కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయవద్దని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది మరియు సర్వే అధికారులు పాల్గొన్నారు.

పసికందును అమ్మేసిన నర్సు.

0

-తల్లిని మోసం చేసి రూ.లక్షన్నరలకు నవజాత శిశువు విక్రయం

-మెదక్ జిల్లాలో అమానుష ఘటన కలకలం

-ఐదు రోజుల తర్వాత బతికే ఉందన్న విషయం తెలుసుకున్న తల్లి

మెదక్,మే-6,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి):మెదక్ జిల్లాలో మానవత్వానికే మచ్చ తెచ్చే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టిన పసికందు చనిపోయిందని ఓ తల్లిని నమ్మించిన నర్సు, ఆ నవజాత శిశువును రహస్యంగా రూ.1.50 లక్షలకు విక్రయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ అమానుష ఘటన బయటపడటంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన నస్రా ఫాతిమా ప్రస్తుతం సికింద్రాబాద్ మౌలాలిలో నివసిస్తోంది. ఏడు నెలల గర్భిణిగా ఉన్న ఆమె ఇటీవల అత్తగారింటికి వెళ్లేందుకు మెదక్‌కు వచ్చింది. ఈ సమయంలో బస్టాండ్ వద్ద చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్‌పై కోతులు దాడి చేయడంతో తీవ్ర భయానికి గురైంది. అక్కడున్న స్నేహితురాలు వెంటనే ఫాతిమాను సమీప ఆసుపత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించగా ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అక్తరీ బేగం అత్యంత దారుణంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.పుట్టిన పాప చనిపోయిందని ఫాతిమాను నమ్మించిన నర్సు, ఆమె దుఃఖంలో ఉండగానే శిశువును రహస్యంగా విక్రయించినట్లు సమాచారం. నర్సు మాటలను నమ్మిన బాధితురాలు కన్నీటి పర్యంతమై మూడు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. కానీ ఐదు రోజుల తర్వాత ఓ వ్యక్తి ద్వారా తన పాప బతికే ఉందన్న సమాచారం ఫాతిమాకు చేరింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించి నర్సుపై ఫిర్యాదు చేసింది.

  • ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శిశువును ఎవరికీ విక్రయించారు?, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు?, ఆసుపత్రి సిబ్బంది పాత్ర ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. పుట్టిన బిడ్డ కోసం తల్లి విలపిస్తుంటే, డబ్బుల కోసం పసికందును అమ్మేయడం అమానుషమని ప్రజలు మండిపడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.