- మెదక్ టుడే న్యూస్ అగస్ట్ :-12(ప్రతినిధి పి దుర్గేష్ గౌడ్ )పాపన్నపేట: భారత్ మాతాకీ జై నినాదాలతో పాపన్నపేట మండల కేంద్రం మార్మోగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆదేశాల మేరకు, మండల పార్టీ అధ్యక్షులు వద్ద సంతోష్ చారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిష్టానుసారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా పాపన్నపేట పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.పట్టణంలోని పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు.
దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పేలా నిర్వహించిన ఈ కార్యక్రమం పాపన్నపేటలో ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
పాపన్నపేటలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

