📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomePanchayati ennakaluనామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ నగేష్..

నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ నగేష్..

📰 Generate e-Paper Clip

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్

మెదక్,డిసెంబర్,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి

రామాయంపేట,నర్సింగి, నిజాంపేట్ ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్ లను ఏ రోజుకు ఆ రోజు నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ, జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, పై అధికారులను సంప్రదించాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular