📄 ePaper
Friday, July 31, 2026
ADS
Homeతెలంగాణ భక్తిభక్తిశ్రద్ధలతో పెదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన చేయాలి: అమీన్‌పూర్ ఆలయ...

భక్తిశ్రద్ధలతో పెదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన చేయాలి: అమీన్‌పూర్ ఆలయ చైర్మన్ నీలం భిక్షపతి.

📰 Generate e-Paper Clip

గుమ్మడిదల,ఏప్రిల్,30,(మెదక్ టుడే)న్యూస్,ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ పెదమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి రావాల్సిందిగా కోరుతూ అమీన్‌పూర్ సామక్క సారలమ్మ ఆలయ చైర్మన్ నీలం భిక్షపతి కి ఆహ్వాన పత్రికను అందజేశారు. గురువారం నాడు కానుకుంట గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనను కలిసి మే 8న జరిగే ప్రతిష్ఠాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా నీలం భిక్షపతి మాట్లాడుతూ,గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం వల్ల ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు.
కానుకుంట గ్రామస్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమని కొనియాడారు.
మే 8వ తేదీన జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన మరియు హవన కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతిని, ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమ వివరాలు:
కానుకుంటలో మే 6వ తేదీ నుండి మే 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు జరగనున్నాయి. మే 8వ తేదీన ఉదయం విగ్రహ ప్రతిష్ఠాపన, హవనం, పూర్ణాహుతి మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కానుకుంట గ్రామ పెద్దలు, యువకులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular