📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomeUncategorizedబెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి..

బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి..

📰 Generate e-Paper Clip

(స్టేట్ బ్యూరో), నవంబర్ 13 మెదక్ టుడే న్యూస్:

•బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి.

•బెట్టింగ్ లో లక్షల రూపాయలు కోల్పోయి, ఆత్మహత్య చేసుకున్న యువకుడు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన అఖిల్(31) అనే యువకుడు.ఏలూరు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి, పట్టణంలోని ఒక హోటల్లో గది తీసుకున్న అఖిల్.తన తండ్రికి ఫోన్ చేసి బెట్టింగ్ వల్ల నష్టపోయానని, ఇప్పుడు వాళ్లు నన్ను ఇబ్బంది పెడుతున్నారని తెలిపిన యువకుడు.ఇంటికి వస్తే అన్నీ మాట్లాడుకుందామని, బాధపడొద్దని చెప్పిన అఖిల్ తండ్రి.ఒక గదిలో ఉన్న యువకుడు చాలా సేపటి నుండి తలుపులు తీయడం లేదని పోలీసులకు సమాచారం అందించిన హోటల్ సిబ్బంది.తలుపులు పగలగొట్టి చూడగా, అఖిల్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించిన పోలీస్ సిబ్బంది.తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular