📄 ePaper
Friday, September 11, 2026
ADS
Homepatancheru political newsపోచమ్మ అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్న బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి.

పోచమ్మ అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్న బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

జిన్నారం,ఆగస్టు,27,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో శ్రీ పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఊరేగింపులో నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఊరేగింపులో నడిచి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. జిన్నారం పరిసర ప్రాంత ప్రజలందరిపై పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆగస్టు 30న జిన్నారంలో అత్యంత వైభవంగా జరగనున్న అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశం గౌడ్, జగన్నాథ్ రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular