📄 ePaper
Saturday, August 1, 2026
ADS
Homepapannapeta -TSగ్రామపంచాయతీ నిధులతో బోర్ల ఏర్పాటు పనులకు శ్రీకారం. సర్పంచ్ పావని...

గ్రామపంచాయతీ నిధులతో బోర్ల ఏర్పాటు పనులకు శ్రీకారం. సర్పంచ్ పావని నరేంద్ర గౌడ్.

📰 Generate e-Paper Clip

ప్రజల దాహం తీర్చడమే ధ్యేయం-పాపన్నపేటలో మంచినీటి విప్లవానికి శ్రీకారం!

ప్రతి వార్డుకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం.

పాపన్నపేట,జూలై,31, మెదక్ టుడే న్యూస్:ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించి గ్రామంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో పాపన్నపేట గ్రామపంచాయతీ మరో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామపంచాయతీ నిధులతో సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో, వార్డు సభ్యుల సహకారంతో శుక్రవారం వార్డుల్లో మంచినీటి బోర్ల ఏర్పాటు పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.ప్రస్తుతం పనులు జరుగుతున్న వార్డులతో పాటు,మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా దశలవారీగా బోర్ల ఏర్పాటు చేపట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు.అందేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ పావనినరేందర్ గౌడ్ తెలిపారు.ప్రజా సంక్షేమమే మా ప్రథమ కర్తవ్యం..ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందే వరకు మా కృషి నిరంతరం కొనసాగుతుంది”అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్,వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువకులు,గ్రామ పెద్దలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular