📄 ePaper
Saturday, May 9, 2026
ADS
Homemedak jilla politicalనూతన సాంకేతిక పద్ధతులను అవలంబించి రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ...

నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించి రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు పండించాలి.మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.

📰 Generate e-Paper Clip

రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం

రైతు సంక్షేమమే ధ్యేయంగా పటిష్ట చర్యలు

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని మాయ గార్డెన్ లో ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, అధ్యక్షతన నిర్వహించిన ఉద్యానవన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెరుగుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు పై అవగాహన సదస్సు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ , వివిధ ప్రజాప్రతినిధులు అధికారులు రైతులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ,రాష్ట్ర గేయాలపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని అన్ని రకాల సబ్సిడీలు ఆర్థిక, ఆధునిక సాంకేతిక రంగంలో నూతన పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచే దిశగా రైతులకు మేలు చేసే విధంగాఅన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అన్నారు. రైతులు ప్రయత్నం చేయక పొతే భవిష్యత్తు లో భూమి మొత్తం నిస్థార మవుతుందని,తక్కువ పెట్టుబడి తో ఎక్కువ పంటలు పండించేలా రైతులు ముందుకెళ్లాలని, ఆర్గానిక్ పంటల సాగు పై రైతులు ద్రుష్టి పెట్టాలన్నారు.భూములను రక్షించి ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, పై అవగాహనా కలిపించు కోవాలన్నారు.జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ… ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా రైతు వారోత్సవాల కార్యక్రమాలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, ఓకే పంట కాకుండా పంటల మార్పిడి చేయాలన్నారు. ఒకే పంటతో జరిగిన నష్టాన్ని అధికారులు రైతులకు వివరించాలన్నారు.పండ్లు కూరగాయలు పూలు లతో ఆయిల్ పామ్ పంటలను కూడా పండించడం ద్వారా అధిక లాభాలను అర్జించవచ్చని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటలో ఇతర పంటలను కూడా పండించవచ్చని, కోతుల బెడద నుండి పంటలను కాపాడడానికి ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ రైతుల బాగు కోరి ఆయిల్ ఫామ్ పంటను రాష్ట్ర ప్రభుత్వం పరిచయం చేసిందన్నారు ఈ పరిచయం దినదినాభివృద్ధి చెందుతూ. మన జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు అన్నారు.రైతులు ప్రస్తుతం ఉన్న పంటలే కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపుతూ అభివృద్ధి దిశగా ముందుకు పోవాలన్నారు అంతర్ పంటలు వేస్తూ ఆయిల్ ఫామ్ సాగు చేస్తే లాభాలు బేశరతుగా ఉంటాయని ఈ సందర్భంగా వెల్లడించారు.మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నుముక అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ప్రత్యామ్నాయ ఇతర పంటలపై రైతులు మొగ్గు చూపుతూ సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జించాలని తెలిపారు.అంతకుముందు శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, కౌన్సిలర్లూ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments